Telangana

News May 12, 2024

వరంగల్: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి

image

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతిచెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన తన్మయి తన చెల్లి TS F SET పరీక్ష కోసం శనివారం ఘట్ కేసర్‌కు బయలుదేరారు. ఈక్రమంలో కారు ఆలేరు వద్ద ఎదురుగా వచ్చిన ట్రాలీని ఢీకొట్టింది. ప్రమాదంలో తన్మయికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వరంగల్ MGMకి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. తన్మయి వరంగల్ వాగ్దేవి కాలేజీలో బీటెక్ చదువుతోంది.

News May 12, 2024

అమెరికాలో ఖమ్మం యువకుడి మృతి

image

ఖమ్మానికి చెందిన విద్యార్థి లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి అమెరికాలోని ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలిలా.. రాకేష్(24) అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈనెల 8న స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు రాకేశ్‌తో పాటు అతని స్నేహితుడు మునిగిపోయారు. మృతదేహాలు మరుసటి రోజు లభ్యమయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో మృతదేహాన్ని ఖమ్మానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.  

News May 12, 2024

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేటలో జరిగింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. కోదాడ – జడ్చర్ల రహదారిపై అంగడిపేట వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో డీజిల్ పోయించుకుని వస్తున్న ఆటోను హెడ్ కానిస్టేబుల్ మర్యాదాస్ ఆపాడు. ఈ క్రమంలో వెనకనుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News May 12, 2024

NLG: ఓటరు కార్డు లేనివారికి ప్రత్యామ్నాయ కార్డులు

image

ఓటరు కార్డు లేనివారు ప్రత్యామ్నాయంగా 1.పాస్పోర్టు 2.డ్రైవింగ్ లైసెన్స్, 3.ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు గుర్తింపు, కార్డులు 4.బ్యాంకు, పోస్టాఫీసు పాస్ బుక్ 5.పాన్ కార్డు, 6.ఆర్టీఐ ఎన్పీఆర్ స్మార్ట్ కార్డు, 7.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి జాబ్ కార్డు, 8.కార్మిక శాఖ ఇచ్చిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, 9. ఫొటోతో కూడిన పింఛను పత్రం, 10.ఆధార్ కార్డు చూపించి ఓటు వేయవచ్చు.

News May 12, 2024

మల్కాజ్‌గిరి: యువత చేతిలోనే దేశ భవిష్యత్తు

image

ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ యువత చేతిలోనే ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు యూత్‌ ఓటర్లదే కీలక భూమిక. లోక్‌సభ నియోజక వర్గాలన్నింటిలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజ్‌గిరి. ఈ నియోజకవర్గంలో యువ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయితో పాటు కేంద్ర స్థాయిలో కూడా నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో మరి యువ ఓటర్లు ఈ దఫా ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

News May 12, 2024

మల్కాజ్‌గిరి: యువత చేతిలోనే దేశ భవిష్యత్తు

image

ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ యువత చేతిలోనే ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు యూత్‌ ఓటర్లదే కీలక భూమిక. లోక్‌సభ నియోజక వర్గాలన్నింటిలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజ్‌గిరి. ఈ నియోజకవర్గంలో యువ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయితో పాటు కేంద్ర స్థాయిలో కూడా నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో మరి యువ ఓటర్లు ఈ దఫా ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

News May 12, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
✓ఎన్నికల నిర్వహణపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓పలు శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News May 12, 2024

MBNR, NGKL పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు!!

image

✓ కొడంగల్ అసెంబ్లీలో – 2,41,794
✓ నారాయణపేట – 2,36,182
✓ మహబూబ్‌నగర్ – 2,59,260
✓ జడ్చర్ల – 2,22,838
✓ దేవరకద్ర – 2,39,745
✓ షాద్‌నగర్ – 2,38,478
✓ మక్తల్ – 2,44,173
✓ వనపర్తి – 2,73,863
✓ గద్వాల – 2,56,637
✓ అలంపూర్ – 2,40,063
✓ నాగర్‌కర్నూల్ – 2,36,094
✓ అచ్చంపేట – 2,47,729
✓ కల్వకుర్తి – 2,44,405
✓ కొల్లాపూర్ – 2,39,463 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో వనపర్తిలో అత్యధిక ఓట్లు ఉన్నాయి.

News May 12, 2024

కరీంనగర్: MP ఎన్నికలు.. భారీ బందోబస్తు

image

ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. కమిషనరేట్‌కు చెందిన 2వేల మంది, 400 మంది కేంద్ర బలగాలు, 100 మంది ప్రత్యేక పోలీసుల బందోబస్తులో ఉన్నట్లు చెప్పారు. ఎన్నికలు జరిగే సమయంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా, ఓటర్లను తప్ప ఇతరులను లోనికి అనుమతించవద్దన్నారు.

News May 12, 2024

కొత్తగూడెం: ఎన్నికల ఎఫెక్ట్.. ఆ రూట్ బంద్

image

13వ తేదీన పోలింగ్ నేపథ్యంలో చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో భారీ వాహనాలను 12న ఉదయం 5 గంటల నుంచి 14న ఉదయం 8 గంటల వరకు నిలిపి వేయాలని రంపచోడవరం రిటర్నింగ్ అధికారి పోలీసులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.