India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో సొరంగ మార్గ నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎన్నికల తర్వాత నిపుణులతో సాయిల్, రూట్ ఇన్వెస్టిగేషన్ జరుగనుంది. ITC కోహినూర్ నుంచి ఖాజాగూడ, నానక్రాంగూడ మీదుగా విప్రో సర్కిల్ వరకు.. ITC నుంచి JNTUH, ITC నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, GVK మాల్ నుంచి నానల్నగర్ వరకు.. నాంపల్లి నుంచి చాంద్రాయణగుట్ట,చార్మినార్ నుంచి ఫలక్నుమా వరకు ఆయా మార్గాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని నిర్ణయించారు.
ఈనెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఏజెన్సీ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ ముగుస్తుందని తహశీల్దార్ రమాదేవి తెలిపారు. సమస్యాత్మక పోలింగ్కేంద్రాలు అధికంగా ఏజెన్సీలో ఉండటంతో ఇక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 తర్వాత ఓటర్లను లోనికి అనుమతించమన్నారు.
కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,194 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వీటిలో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. 17,97,000 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషుల కంటే మహిళలు 40,000 మంది అధికంగా ఉన్నారని వివరించారు. 42 వేల మంది దివ్యాంగులు ఉన్నారని, వయోవృద్ధులు 13200 మంది ఉన్నారని తెలిపారు.
HYD చర్లపల్లి రైల్వే టర్మినల్ సంబంధించి అధికారులు ఓ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ తెలిపారు. స్టేషన్ పునరుద్ధరణ సమయంలో దాదాపుగా 500 చెట్లను తొలగించి, నార్త్ లాలాగూడ, మౌలాలి, ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో వాటిని మళ్లీ నాటినట్లుగా పేర్కొన్నారు. పర్యావరణంపై ఉన్న ప్రేమతో చెట్లను నరికి వేయకుండా, ఈ విధంగా చేసినట్లు వెల్లడించారు. మరోవైపు చర్లపల్లి రైల్వే స్టేషన్లో 5,500 మొక్కల పెంపునకు శ్రీకారం చుట్టారు.
HYD చర్లపల్లి రైల్వే టర్మినల్ సంబంధించి అధికారులు ఓ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ తెలిపారు. స్టేషన్ పునరుద్ధరణ సమయంలో దాదాపుగా 500 చెట్లను తొలగించి, నార్త్ లాలాగూడ, మౌలాలి, ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో వాటిని మళ్లీ నాటినట్లుగా పేర్కొన్నారు. పర్యావరణంపై ఉన్న ప్రేమతో చెట్లను నరికి వేయకుండా, ఈ విధంగా చేసినట్లు వెల్లడించారు. మరోవైపు చర్లపల్లి రైల్వే స్టేషన్లో 5,500 మొక్కల పెంపునకు శ్రీకారం చుట్టారు.
పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీస్ అధికారులతో నారాయణపేటలోని శెట్టి ఫంక్షన్ హాలులో శనివారం సమావేశం నిర్వహించారు. విధులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 550 పోలింగ్ కేంద్రాల వద్ద 1300 మంది పోలీసులతో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
లోక్ సభ ఎన్నికల్లో జిల్లాలోని ఓటర్లందరూ తప్పకుండా ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లోక్ సభ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.
శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. HYD నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ఇప్పటి వరకు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అందించామని పేర్కొన్నారు.
శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. HYD నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ఇప్పటి వరకు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అందించామని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల బందోబస్తులు దాదాపు 1100 జిల్లా పోలీసులు, 400 ఇతర శాఖలకు సంబంధించిన పోలీసులు, 27 సెక్షన్ల కేంద్రబలగాలు, 15 సెక్షన్ల స్పెషల్ పోలీసులు పాల్గొన్నట్లు తెలియజేశారు. మొత్తం 1500 సిబ్బంది ఉన్నరన్నారు.
Sorry, no posts matched your criteria.