Telangana

News May 12, 2024

పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎస్పీ చందనా దీప్తి

image

NLG:ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.జిల్లాలో శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు,9 మంది డిస్పీలు,37 మంది సీఐలు,84 మంది యస్.ఐలతో కలిపి మొత్తం 3000 మంది సిబ్బంది, 7 కంపెనీల కేంద్ర బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది.వీటితో పాటు 5 ప్లాటున్ల TSSP సిబ్బంది,పెట్రోలింగ్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News May 12, 2024

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా పకడ్బందీగా ఏర్పాట్లు

image

ఈ నెల 13 న జరిగే లోక సభ పోలింగ్ కు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయుటకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఓటర్లు వంద శాతం పోలింగ్ లో పాల్గొనాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి వీలుగా 913 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 64 సమస్యాత్మక లొకేషన్లలో 183 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గట్టి భద్రతా ఏర్పాటు చేశామన్నారు.

News May 12, 2024

HNK: రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తాపట్నాయక్ శనివారం సాయంత్రం పరిశీలించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

News May 12, 2024

KNR: ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశాం: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా పోలింగ్ అధికారుల థర్డ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.

News May 11, 2024

ఇల్లంతకుంట మండల విద్యాధికారి సస్పెన్షన్.!

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల విద్యాధికారి (FAC ) బన్నాజీని సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడి కే.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఇల్లంతకుంట మండల ఎంపీపీ నుంచి బన్నాజీ సన్మానం పొందారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ RJDకి తెలియజేసారు. ఎన్నికల నియమనిబంధనలు బన్నాజీ ఉల్లంఘించడంతో సస్పెండ్ చేసినట్టు RJD తెలిపారు.

News May 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కాటారం మండలంలో ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య. @ సుల్తానాబాద్ మండలంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి. @ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం. @ పార్లమెంట్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: కరీంనగర్ సిపి. @ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కరీంనగర్ కలెక్టర్.

News May 11, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈరోజు TOPNEWS

image

> జిల్లావ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం
> ములుగు: అన్నం పెట్టలేదని సెల్ టవర్ ఎక్కిన యువకుడు
> జిల్లాలో సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చిన 144 సెక్షన్
> ETNR: లారీ-బైకు ఢీ..యువతికి తీవ్రగాయాలు
> బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడోరోజు భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు
> MHBD: బిల్డింగ్ పై నుండి పడి యువకుడికి గాయాలు
> WGL,KZP రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ
> ములుగు: పొలంలోకి దూసుకెళ్లిన ఆటో..పలువురికి గాయాలు

News May 11, 2024

MDK: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. చెన్నయిపల్లి గ్రామానికి చెందిన చిన్నోళ్ల శ్రీశైలం(23) ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన శ్రీశైలం గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన  ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 11, 2024

NLG: ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులకు కీలక సూచన

image

MP ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నింటినీ తనిఖీ చేయించుకోవాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ తెలిపారు. శనివారం ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల మూడో విడత తనిఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఎవరైనా అభ్యర్థులకు ఖర్చులకు సంబంధించి రిజిస్టర్లు, ఖర్చులు సంబంధించిన వివరాలు మిగిలిపోయినట్లయితే తనిఖీ చేయించుకోవాలన్నారు.

News May 11, 2024

HYD: ఓటేసిన వారికి ఆఫర్ అంటూ ఫ్లెక్సీ 

image

HYD కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరుతూ సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్ శనివారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మే 13న ఎన్నికల్లో ఓటు వేసిన వారు.. తమ షాప్‌కు వచ్చి వారి చేతికున్న సిరా గుర్తు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు చూపిస్తే కూరగాయలు 10 శాతం, జిరాక్స్ 25 శాతం తక్కువ ధరకు ఇస్తానని బ్యానర్ ఏర్పాటు చేశారు.