India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD బాచుపల్లిలో ఇటీవల గోడ కూలి మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని జన్ సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్పీ సింగ్ డిమాండ్ చేశారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాచ్పల్లిలో ఈనెల 10న గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతిచెందారని, పలువురు గాయపడ్డారని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
HYD బాచుపల్లిలో ఇటీవల గోడ కూలి మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని జన్ సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్పీ సింగ్ డిమాండ్ చేశారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాచ్పల్లిలో ఈనెల 10న గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతిచెందారని, పలువురు గాయపడ్డారని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి గ్రామ చెరువులో పడి ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మంత్రి లక్ష్మణ్ చెరువులో ఉన్న పశువులను బయటకు తీసుకురావడానికి వెళ్లి మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. లక్ష్మణ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా HYDలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో రూ.34,28,500 నగదు సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.6,54,77,063 విలువ గల ఇతర వస్తువులు, 126.70 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, 9 మందిపై కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా HYDలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో రూ.34,28,500 నగదు సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.6,54,77,063 విలువ గల ఇతర వస్తువులు, 126.70 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, 9 మందిపై కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇంట్లో వాళ్ళు తనకు అన్నం పెట్టడం లేదని అలిగి ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కిన సంఘటన ములుగు జిల్లా కమలాపురంలో చోటుచేసుకుంది. శ్యామల రాజేశ్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం ఇంట్లో అన్నం పెట్టడం లేదని గొడవ పెట్టుకున్నాడు. అనంతరం పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి నిద్రపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు టవర్ వద్దకు చేరుకుని రాజేశ్ని కిందికి దింపి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. శనివారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 504.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను, 123.0122 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో లేదని, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులు కొనసాగుతోందని తెలిపారు.
ఓ పెంపుడు కుక్క తన విశ్వాసం చాటుకుంది. HYD మేడ్చల్ పరిధి కిష్టాపూర్లో ఉండే కొడతల వెంకటేశ్ (45) శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. అయితే యజమాని చనిపోవడంతో పెంపుడు కుక్క వెంకటేశ్ అంత్యక్రియల్లో పాల్గొని అక్కడే ఉండిపోయింది. అంత్యక్రియలు చేసిన చోట తిరుగుతూ స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ శునకాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఓ పెంపుడు కుక్క తన విశ్వాసం చాటుకుంది. HYD మేడ్చల్ పరిధి కిష్టాపూర్లో ఉండే కొడతల వెంకటేశ్ (45) శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. అయితే యజమాని చనిపోవడంతో పెంపుడు కుక్క వెంకటేశ్ అంత్యక్రియల్లో పాల్గొని అక్కడే ఉండిపోయింది. అంత్యక్రియలు చేసిన చోట తిరుగుతూ స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ శునకాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండల పరిధిలోని నగరం తాండ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరం తండా గ్రామానికి చెందిన కేతావత్ స్వామి అనే వ్యక్తికి ఒక సంవత్సరం క్రితం వివాహం జరిగింది. అతని తాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో ఖర్చులు, అతని పెళ్లి ఖర్చులతో అప్పు కావడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.