India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంట్లో వాళ్ళు తనకు అన్నం పెట్టడం లేదని అలిగి ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కిన సంఘటన ములుగు జిల్లా కమలాపురంలో చోటుచేసుకుంది. శ్యామల రాజేశ్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం ఇంట్లో అన్నం పెట్టడం లేదని గొడవ పెట్టుకున్నాడు. అనంతరం పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి నిద్రపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు టవర్ వద్దకు చేరుకుని రాజేశ్ని కిందికి దింపి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. శనివారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 504.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను, 123.0122 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో లేదని, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులు కొనసాగుతోందని తెలిపారు.
ఓ పెంపుడు కుక్క తన విశ్వాసం చాటుకుంది. HYD మేడ్చల్ పరిధి కిష్టాపూర్లో ఉండే కొడతల వెంకటేశ్ (45) శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. అయితే యజమాని చనిపోవడంతో పెంపుడు కుక్క వెంకటేశ్ అంత్యక్రియల్లో పాల్గొని అక్కడే ఉండిపోయింది. అంత్యక్రియలు చేసిన చోట తిరుగుతూ స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ శునకాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఓ పెంపుడు కుక్క తన విశ్వాసం చాటుకుంది. HYD మేడ్చల్ పరిధి కిష్టాపూర్లో ఉండే కొడతల వెంకటేశ్ (45) శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. అయితే యజమాని చనిపోవడంతో పెంపుడు కుక్క వెంకటేశ్ అంత్యక్రియల్లో పాల్గొని అక్కడే ఉండిపోయింది. అంత్యక్రియలు చేసిన చోట తిరుగుతూ స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ శునకాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండల పరిధిలోని నగరం తాండ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరం తండా గ్రామానికి చెందిన కేతావత్ స్వామి అనే వ్యక్తికి ఒక సంవత్సరం క్రితం వివాహం జరిగింది. అతని తాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో ఖర్చులు, అతని పెళ్లి ఖర్చులతో అప్పు కావడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఇకపై ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు పార్లమెంట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎన్నికల నియమాలు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠినచర్యలు ఉంటాయని అధికారుల హెచ్చరించారు. సోమవారం ఓటింగ్ ప్రక్రియ మొదలుకానుంది .
లోక్ సభ ఎన్నిక నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోందని ఉమ్మడి జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పారు. మే13 సాయంత్రం 6.30 నిమిషాల వరకు 144 సెక్షన్ ఉంటుందని వివరించారు.
బావిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ రోడ్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. తెలుపు రంగు పుల్ బనియన్, బ్లూ రంగు చెక్స్ డిజైన్ గీతల లుంగీతో మృతదేహాం ఉందన్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే ములుగు పోలీసులను సంప్రదించాలని కోరారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం కొన్ని గంటల్లో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ చేయాలని ఆయా పార్టీలను ఎలక్షన్ కమిషనర్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
తెలంగాణ గొంతుకైనా BRSను లేకుండా చేయాలని కాంగ్రెస్, BJP కలిసి ప్లాన్ వేశాయని మాజీ మంత్రి KTR ఆరోపించారు. HYD యూసుఫ్గూడలో ఈరోజు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, BJP కలిసి ముందు BRSను లేకుండా చేయాలని, ఆ తర్వాత మనం గొడవపడదామని బండి సంజయ్ అన్న ఓ వీడియోను ఆయన సభలో చూపించారు. ఆ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, కానీ ఎన్నికలు రాగానే ఢిల్లీ, గుజరాత్ నుంచి నేతలు వస్తున్నారన్నారు.
Sorry, no posts matched your criteria.