Telangana

News April 5, 2025

NZB: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 7వ స్నాతకోత్సవం

image

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి 7వ స్నాతకోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ముఖ్య అతిథిగా గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపతిరావు, GGH సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News April 5, 2025

HYDలో ఏప్రిల్ 6న వైన్స్‌లు బంద్

image

శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6, 2025న ఉ.10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు వైన్స్‌లు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీని పరిధిలోని కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు. 

News April 5, 2025

HYDలో ఏప్రిల్ 6న వైన్స్‌లు బంద్

image

శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6, 2025న ఉ.10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు వైన్స్‌లు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీని పరిధిలోని కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు.

News April 4, 2025

HYD ప్రెస్‌క్లబ్ 2025 డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం

image

హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 2025 డైరీని తన క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం ఆవిష్కరించారు. ప్రెస్‌క్లబ్‌కు స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రిని ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్ నాయుడు, రవికాంత్ రెడ్డి కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. అనంతరం ప్రెస్‌క్లబ్ పాలకమండలి సభ్యులు బట్టిని శాలువాతో సత్కరించారు.

News April 4, 2025

CS శాంతి కుమారికి రైతు కమిషన్ వినతి

image

ములుగు జిల్లాలో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో గిరిజన రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతు హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చట్ట సవరణలు చేయాలని రైతు కమిషన్.. CS శాంతి కుమారికి నివేదిక అందించింది. వ్యవసాయ మార్కెట్, విత్తన చట్టాల్లో మార్పులు, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ పేరులోనూ మార్పులు కోరింది.

News April 4, 2025

వరంగల్‌ CGHSకు సిబ్బందిని నియమించండి: ఎంపీ కావ్య

image

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి రోలి సింగ్‌తో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవల వరంగల్‌కు CGHS వెల్‌నెస్‌ సెంటర్‌ మంజూరైనప్పటికీ వైద్య అధికారులు, పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో సేవలు నిలిచిపోయాయని రోలి సింగ్‌కు వివరించారు. CGHS వెల్‌నెస్ సెంటర్‌ను త్వరగా ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.

News April 4, 2025

అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి: మంత్రి

image

అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, టెక్స్టైల్ పార్క్ లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల MLA అధ్యక్షతన జరిగిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇండ‌స్ట్రీల్లో స్థానికుల‌కే ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

News April 4, 2025

మహబూబ్‌నగర్: ఘనంగా వేడుకలు నిర్వహించాలి: బీజేపీ 

image

మహబూబ్‌నగర్‌లోని బీజేపీ జిల్లా ఆఫీస్‌లో జిల్లా స్థాయి ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి 13 వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, 14 నుంచి 25 వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ, జనగణన, జమిలి ఎన్నికలు, రైతుల సమస్యలపై బూత్ కమిటీలు వేసి చర్చించాలని అన్నారు. 

News April 4, 2025

NLG: TCC కోర్స్ వేసవి శిక్షణ శిబిరం

image

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని మే 1 నుంచి జూన్ 11 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో బొల్లారం బిక్షపతి తెలిపారు. నల్గొండలోని డైట్ ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కర్నాటిక హిందుస్థాని సంగీతం, వుడ్ వర్క్ కోర్సులలో శిక్షణ ఇస్తామన్నారు.  అర్హులైన వారు ఏప్రిల్ 17 నుంచి 29 వరకు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News April 4, 2025

విద్యార్థులకు మెరుగైన విద్య అందించండి: ITDA PO

image

ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీఓ కుష్బూగుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం ఇంద్రవెల్లి బాలికల ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ పాఠశాలను పీఓ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలని సూచించారు.