Telangana

News September 13, 2024

కరీంనగర్: కూరగాయలకు భారీగా పెరిగిన ధరలు

image

మొన్నటి వరకు శ్రావణమాసం, ప్రస్తుతం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూరగాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో కూరగాయల రేట్లు భారీగానే పెరిగాయి. బెండకాయ కిలో రూ.60-70, సొరకాయ రూ.60, పచ్చిమిర్చి రూ.80, కొత్తిమీర ఏకంగా కిలో రూ.200 వరకు పలుకుతోంది. ఏ కూరగాయల ధరలు చూసినా మండిపోతున్నాయి. వర్షాల కారణంగా కూరగాయలు రావట్లేదని వ్యాపారస్థులు చెబుతున్నారు.

News September 13, 2024

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన దీప్తి

image

ప్యారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పథకం సాధించిన పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జివాంజి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. కాంస్య పథకం సాధించిన దీప్తిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, కోచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

News September 13, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} నేలకొండపల్లి మండలంలో పంట నష్టంపై సర్వే

News September 13, 2024

గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష

image

HYD సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం సౌత్ ఈస్ట్ & ఈస్ట్ జోన్లలో పర్యటించారు. ఈనెల 17న జరగనున్న గణేశ్ నిమజ్జనం, 19న జరగనున్న మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులు మానసికంగా ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించి శాంతి భద్రతలు కాపాడాలని అన్నారు. అలాగే వేడుకల్లో భాగంగా ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం గురించి పలు సూచనలు చేశారు.

News September 13, 2024

గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష

image

HYD సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం సౌత్ ఈస్ట్ & ఈస్ట్ జోన్లలో పర్యటించారు. ఈనెల 17న జరగనున్న గణేశ్ నిమజ్జనం, 19న జరగనున్న మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులు మానసికంగా ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించి శాంతి భద్రతలు కాపాడాలని అన్నారు. అలాగే వేడుకల్లో భాగంగా ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం గురించి పలు సూచనలు చేశారు.

News September 13, 2024

MDK: హత్యాయత్నం కేసులో నిందితునికి 7ఏళ్లు జైలు

image

హాత్యాయత్నం కేసులో నేరస్థుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష రూ.5వేల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధాకృష్ణ చౌహన్ గురువారం తీర్పు ఇచ్చారు. సదాశివపేట మండలం కోనాపూర్‌కు చెందిన యాదయ్య పక్కన స్థలంలో వీరయ్య పగిలిన కల్లు సీసాలు వేసేవాడు. ఇదేంటని అడిగినందుకు యాదయ్యపై వీరయ్య కత్తితో హత్యాయత్నం చేశారు. నేరం రుజువు కావడంతో వీరయ్యకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

News September 13, 2024

HYD: రూ.2.94 కోట్ల బంగారం సీజ్..!

image

HYD నగర శివారు శంషాబాద్ ORR ఏరియాలో 3.98 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. దీని విలువ దాదాపుగా రూ.2.94 కోట్లు ఉంటుందని వెల్లడించారు. విదేశానికి చెందిన ఈ బంగారం.. కోల్‌కతా నుంచి తీసుకొస్తుండగా HYD నగరంలో పట్టుబడింది. కారు సీటు వెనక బ్రౌన్ టేపు వేసి, బంగారం దాచినట్లు అధికారులు తెలిపారు.

News September 13, 2024

ఓయూలో ఈనెల 21న అఖిల భారత మహిళా విద్యావేత్తల సదస్సు

image

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈనెల 21న అఖిల భారత మహిళా విద్యావేత్తల సదస్సు జరగనుందని కాన్ఫరెన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ మంచుకొండ శైలజ తెలిపారు. సదస్సును ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. సదస్సుకు NHRC అధ్యక్షురాలు విజయ భారతి సయాని తదితరులు హాజరవుతారని పేర్కొంది. ఈ సదస్సులో వికసిత భారత్ నిర్మాణంలో మహిళా విద్యావేత్తల పాత్ర తదితర అంశాలపై ప్రముఖులు మాట్లాడనున్నట్లు తెలిపింది.

News September 13, 2024

ఆర్మూర్: 108 రకాల నైవేద్యాలతో వినాయకుడి పూజ

image

ఆర్మూర్ పట్టణంలోని మహాలక్మి కాలనీలో గల శ్రీ మహాలక్ష్మి గణేశ్ మండలి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 108 రకాల నైవేద్యాలతో వినాయకుడి పూజలు నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కాలనీలోని మహిళలు 108 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించి ప్రత్యేకంగా అలంకరించారు. కాలనీవాసులు పెద్దఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

News September 13, 2024

ఆదిలాబాద్: రూ.818కే విద్యుత్ మీటర్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పేదవారికి తక్కువ ధరకే ప్రభుత్వం విద్యుత్ మీటర్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేనివారు ఈ నెల 15 వరకు నూతన మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 500 వాట్స్‌కి రూ.938, 250 వాట్స్‌కి రూ.818 చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ కార్యాలయాలు, ఉపకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.