India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ గొంతుకైనా BRSను లేకుండా చేయాలని కాంగ్రెస్, BJP కలిసి ప్లాన్ వేశాయని మాజీ మంత్రి KTR ఆరోపించారు. HYD యూసుఫ్గూడలో ఈరోజు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, BJP కలిసి ముందు BRSను లేకుండా చేయాలని, ఆ తర్వాత మనం గొడవపడదామని బండి సంజయ్ అన్న ఓ వీడియోను ఆయన సభలో చూపించారు. ఆ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, కానీ ఎన్నికలు రాగానే ఢిల్లీ, గుజరాత్ నుంచి నేతలు వస్తున్నారన్నారు.
తెలంగాణ గొంతుకైనా BRSను లేకుండా చేయాలని కాంగ్రెస్, BJP కలిసి ప్లాన్ వేశాయని మాజీ మంత్రి KTR ఆరోపించారు. HYD యూసుఫ్గూడలో ఈరోజు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, BJP కలిసి ముందు BRSను లేకుండా చేయాలని, ఆ తర్వాత మనం గొడవపడదామని బండి సంజయ్ అన్న ఓ వీడియోను ఆయన సభలో చూపించారు. ఆ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, కానీ ఎన్నికలు రాగానే ఢిల్లీ, గుజరాత్ నుంచి నేతలు వస్తున్నారన్నారు.
రాష్ట్రంలో BJPకి పది సీట్లు ఇస్తే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘రిజర్వేషన్ల రద్దు గురించి నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ SC, ST, BCలను మోసం చేస్తుంది. అంబేడ్కర్కు భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించింది. BJP సర్కారే అంబేడ్కర్కు భారతరత్న ఇచ్చింది’ అని అమిత్ షా పేర్కొన్నారు.
ఈసీ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక శనివారం ఆదేశించారు. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగులను పోలింగ్లో భాగస్వామ్యం చేసేలా, ఆ సందేశం స్పష్టంగా తెలిసేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సదుపాయాలను సరిచూసుకోవాలన్నారు.
ఈసీ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక శనివారం ఆదేశించారు. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగులను పోలింగ్లో భాగస్వామ్యం చేసేలా, ఆ సందేశం స్పష్టంగా తెలిసేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సదుపాయాలను సరిచూసుకోవాలన్నారు.
చేవెళ్ల ప్రాంతంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని AICC ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా తాండూరులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చేవెళ్ల ప్రాంతం ఇందిరాగాంధీకి ప్రేమను పంచిందని తెలిపారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వానికి ప్రజలు సహకరించారని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్ కూడా చేస్తోందని ఆరోపించారు. శనివారం HYDలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్ల నిధులు ఇచ్చామని, తెలంగాణలో 10 ఎంపీ సీట్లు తప్పక గెలుస్తున్నాం. 11 చోట్ల విజయావకాశాలు ఉన్నాయి’’ అని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో రూ.3.05 కోట్ల నగదు, రూ.24.64 లక్షల విలువ చేసే మద్యం, రూ. 3.65 లక్షల విలువ చేసే 14 కిలోల గంజాయి, రూ.29 లక్షల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 126 లైసెన్సు కలిగిన తుపాకులు ఉండగా, వాటిలో 91 తుపాకులను డిపాజిట్ చేశారన్నారు.
మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్ కూడా చేస్తోందని ఆరోపించారు. శనివారం HYDలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్ల నిధులు ఇచ్చామని, తెలంగాణలో 10 ఎంపీ సీట్లు తప్పక గెలుస్తున్నాం. 11 చోట్ల విజయావకాశాలు ఉన్నాయి’’ అని అన్నారు.
భూపాలపల్లిలోని మంజునగర్లోని ఏరియా హస్పిటల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మంజునగర్ బస్టాండ్లో నిల్చున్న ప్రయాణికులను టిప్పర్ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఓటువేసేందుకు స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్లో నిల్చుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Sorry, no posts matched your criteria.