Telangana

News May 11, 2024

MDK: కాసేపట్లో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెర..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం కొన్ని గంటల్లో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ చేయాలని ఆయా పార్టీలను ఎలక్షన్ కమిషనర్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

News May 11, 2024

ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముగిసిన ప్రచారం

image

ఖమ్మం జిల్లాలోని సమస్యాత్మకమైన పలు నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం సాయంత్రం 4గంటలకు ముగిసింది. ఇన్నిరోజులు జోరుగా మోగిన మైకులు మూగబోయాయి. మే 13న పోలింగ్ జరగనుంది.

News May 11, 2024

మెదక్: జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సా.6 గంటల నుండి 14న 6 గంటల వరకు జిల్లాలో 144 CrPC సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి పేర్కొన్నారు. జిల్లాలో ఎవరు కూడా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా తిరగవద్దని, జిల్లాలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.

News May 11, 2024

MBNR: BRS రాష్ట్రాన్ని దోపిడీ చేసింది: డిప్యూటీ సీఎం బట్టి

image

పదేళ్లు అధికారంలో ఉన్న BRS రాష్ట్రాన్ని దోపిడీ చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. గద్వాల జిల్లా అయిజలో శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. BRS నేతలు కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్లు దోచుకున్నారని, ప్రభుత్వ ఖజానాకు రూ. 7లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. BRS రాష్ట్రాని దోచుకుంటే, BJP దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టారని విమర్శించారు.

News May 11, 2024

MBNR: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

image

మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరానికి గాను ప్రవేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి గండీడ్ మండల పరిధిలోని ఆయా గ్రామాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News May 11, 2024

ఖమ్మం జిల్లాలో ఓటర్ స్లిప్ పంపిణీ పూర్తి: విపి గౌతమ్

image

ఖమ్మం జిల్లాలో ఓటర్ స్లిప్ పంపిణీ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి విపి గౌతమ్ అన్నారు. స్లిప్‌లు రాని వారు ఓటు హక్కు రద్దైనట్లు భావించకూడదని, ఓటర్ స్లిప్ సమాచార నిమిత్తమే ఓటర్ స్లిప్ రాని వాళ్ళు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లి ఓటు వేయొచ్చని చెప్పారు. 48 గంటల్లో స్టార్ క్యాంపెయినర్ లా వచ్చిన వారు వాళ్ళ ప్రాంతానికి వెళ్లిపోవాలన్నారు. అటు నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.

News May 11, 2024

MDK: RTC బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

నారాయణఖేడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న RTC బస్సులో ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. నాగధర్ గ్రామానికి చెందిన వడ్ల అంజయ్య సికింద్రాబాద్ బస్సు ఎక్కగా.. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కోలపల్లి శివారులో గుండెపోటు రాగా బస్సు సీటులోనే మృతి చెందాడు. డ్రైవర్ బస్సును నిలిపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.

News May 11, 2024

MHBD: బీజేపీ, బీఆర్ఎస్‌ల మాటలు నమ్మొద్దు: బలరాం నాయక్

image

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే అధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని, ప్రజలు తనకు అండగా నిలవాలన్నారు.

News May 11, 2024

ఎంపీగా ఉండి అభివృద్ధిని పట్టించుకోని అర్వింద్: జీవన్ రెడ్డి

image

ఐదేళ్ళు అధికార పార్టీ ఎంపీగా ఉండి అభివృద్ధిని పట్టించుకోని అర్వింద్ ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బూటకపు హామీలిస్తున్నారని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ సమస్యల పట్ల అర్వింద్ కు అవగాహన చిత్తశుద్ది లేదన్నారు. అర్వింద్ కవితను ఆదర్శంగా తీసుకుని పనిచేశారని, ఆయన ఎవరికీ అందుబాటులో లేరని,
ప్రజా సమస్యలు గాలికొదిలేశారని ఆరోపించారు.

News May 11, 2024

NZB: నేటి సాయంత్రం నుంచి 144 సెక్షన్: CP

image

పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని CP కల్మేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రోజు సాయంత్రం తర్వాత నిజామాబాదు పార్లమెంటులో ఓటు లేని బయటి ప్రాంతాల వ్యక్తులెవరూ ఉండకూడదన్నారు. ఈ మేరకు
లాడ్జీలు, ఫంక్షన్ హాల్స్‌కు నోటీసులిచ్చామన్నారు.