India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2019లో జరిగిన ఎన్నికల్లో నామా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 1,60,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పార్టీల వారీగా ఓట్ల వివరాలిలా..
నామా నాగేశ్వరరావు (బీఆర్ఎస్) – 5,67,459,
రేణుకా చౌదరి (కాంగ్రెస్) – 3,99,397,
బోడ వెంకట్ (సీపీఎం) – 57,102,
దేవకి వాసుదేవరావు (బీజేపీ) – 20,488,
నరాల సత్యనారాయణ (జనసేన) – 19,315.
తమిళనాడు BJP అధ్యక్షులు అన్నమలై ఆ పార్టీ అభ్యర్థి డీకే అరుణమ్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. MBNRలో శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మావతి కాలనీ నుండి క్లాక్ టవర్ వరకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అభ్యర్థి డీకే అరుణమ్మతో కలిసి అన్నములై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ.. బీజేపీ శ్రేణులను ఉత్తేజపరిచారు.
గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా బ్రాహణవెల్లంలకు చెందిన నవీన్ హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఉదయం గుండెపోటుతో చనిపోయాడు. అతనికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం వికారాబాద్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్, మజ్లిస్ను తరిమే శక్తి కేవలం బీజేపీకే ఉందన్నారు. బుల్లెట్ ట్రైన్ తొలి స్టాప్ వికారాబాద్లో రాబోతుందన్నారు. రూ.400 కోట్లతో చేవెళ్ల పరిధిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
హనుమకొండ చౌరస్తాలోని ఓ మిర్చి బండి వద్ద కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య మిర్చి బజ్జీలు చేస్తూ సందడి చేశారు. అంతకు ముందు కాజీపేట నుంచి చౌరస్తా వరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే వరంగల్ అభివృద్ధి సాధ్యమని కావ్య అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హన్మంత్ కే జెండగే తెలిపారు. శనివారం ఆయన ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు అందరూ సహకరించాలన్నారు. దివ్యాంగులకు ఇతర ప్రత్యేక అవసరాల వారికీ ఎన్ని వసతులు కల్పించమన్నారు. పార్లమెంట్ పరిధిలో 18లక్షల పై చిలుకు మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి రెండు రోజులపాటు వైన్ షాప్లు బంద్ కానున్నాయి. పోలింగ్ 48 గంటల ముందు మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 13న సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీంతో మద్యం ప్రియులు నేడు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
కామారెడ్డిలో గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైనట్లు రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. అక్కన్నపేట, మిర్జాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న పట్టాల పక్కన మృతదేహం లభ్యమైనట్లు రైల్వే సిబ్బంది సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించిన ఎస్ఐ మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాలోతు కవిత ఉపాధి హామీ పనులు చేశారు. కురవి మండలంలోని పలు గ్రామాల్లో ఈరోజు ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి, తనని గెలిపించాలని కోరారు. ఈ క్రమంలోనే గడ్డపార పట్టి, మట్టి తవ్వి ఉపాధి హామీ పనులు చేశారు. ఆమెతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పనుల్లో పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నక్సలైట్ ఏజెన్సీ ప్రాంతాలల్లో ఈరోజు సా.4 గంటలకే ప్రచారం ముగియనుంది. మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం.. ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సా.4 గంటలకే ప్రచారం ముగియనున్నట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.