India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం సౌత్ ఈస్ట్ & ఈస్ట్ జోన్లలో పర్యటించారు. ఈనెల 17న జరగనున్న గణేశ్ నిమజ్జనం, 19న జరగనున్న మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులు మానసికంగా ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించి శాంతి భద్రతలు కాపాడాలని అన్నారు. అలాగే వేడుకల్లో భాగంగా ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం గురించి పలు సూచనలు చేశారు.
హాత్యాయత్నం కేసులో నేరస్థుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష రూ.5వేల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధాకృష్ణ చౌహన్ గురువారం తీర్పు ఇచ్చారు. సదాశివపేట మండలం కోనాపూర్కు చెందిన యాదయ్య పక్కన స్థలంలో వీరయ్య పగిలిన కల్లు సీసాలు వేసేవాడు. ఇదేంటని అడిగినందుకు యాదయ్యపై వీరయ్య కత్తితో హత్యాయత్నం చేశారు. నేరం రుజువు కావడంతో వీరయ్యకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.
HYD నగర శివారు శంషాబాద్ ORR ఏరియాలో 3.98 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. దీని విలువ దాదాపుగా రూ.2.94 కోట్లు ఉంటుందని వెల్లడించారు. విదేశానికి చెందిన ఈ బంగారం.. కోల్కతా నుంచి తీసుకొస్తుండగా HYD నగరంలో పట్టుబడింది. కారు సీటు వెనక బ్రౌన్ టేపు వేసి, బంగారం దాచినట్లు అధికారులు తెలిపారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈనెల 21న అఖిల భారత మహిళా విద్యావేత్తల సదస్సు జరగనుందని కాన్ఫరెన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ మంచుకొండ శైలజ తెలిపారు. సదస్సును ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. సదస్సుకు NHRC అధ్యక్షురాలు విజయ భారతి సయాని తదితరులు హాజరవుతారని పేర్కొంది. ఈ సదస్సులో వికసిత భారత్ నిర్మాణంలో మహిళా విద్యావేత్తల పాత్ర తదితర అంశాలపై ప్రముఖులు మాట్లాడనున్నట్లు తెలిపింది.
ఆర్మూర్ పట్టణంలోని మహాలక్మి కాలనీలో గల శ్రీ మహాలక్ష్మి గణేశ్ మండలి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 108 రకాల నైవేద్యాలతో వినాయకుడి పూజలు నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కాలనీలోని మహిళలు 108 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించి ప్రత్యేకంగా అలంకరించారు. కాలనీవాసులు పెద్దఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పేదవారికి తక్కువ ధరకే ప్రభుత్వం విద్యుత్ మీటర్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేనివారు ఈ నెల 15 వరకు నూతన మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 500 వాట్స్కి రూ.938, 250 వాట్స్కి రూ.818 చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ కార్యాలయాలు, ఉపకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.
ఇవాళ ఫొటో ఓటరు జాబితాను ఆయా గ్రామపంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాలలో ప్రచురించనున్నట్లు నల్గొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ముసాయిదా ఫొటో ఓటరు జాబితాపై ఈనెల 18న జిల్లా స్థాయిలో ఎన్నికల అథారిటీ, 19న మండల స్థాయిలో MPDOలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఈ నెల 16న మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. వైన్ షాపులతో పాటు రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లను మూసివేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. 16న ఉదయం 6 గంటల నుంచి 17 ఉదయం 6 గంటల ఆదేశాలు పాటించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వరంగల్లోని ఎనుమాముల మార్కెట్కు వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల తెలిపారు. ఈనెల 14న శనివారం వారాంతపు యార్డు బందు, 15న ఆదివారం కాగా, 16న సోమవారం వినాయక నిమజ్జనం సందర్భంగా, 17న మంగళవారం మిలాద్ ఉన్ నబీకి సెలవు ఉందన్నారు. తిరిగి 18న మార్కెట్ పున:ప్రారంభం అవుతుందన్నారు.
కుల,మత సామరస్యతకు ప్రతీకగా, భగవంతుడు సర్వాంతర్యామి అని మరోసారి రుజువైంది. చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్ఠించి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గురువారం గణపతి మండపంలో నిర్వహించిన వేలంపాటలో లడ్డూను గ్రామ ముస్లిం సోదరులు తాజోద్దీన్, మహమ్మద్లు వేలం పాటలో పాల్గొని రూ.15వేలకు గణనాథుని లడ్డూను దక్కించుకున్నారు.
Sorry, no posts matched your criteria.