Telangana

News May 10, 2024

సిరిసల్ల: బావిలో పడ్డ వ్యక్తి మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గడ్డి రమేష్(42) ఈనెల 8న మద్యం సేవించి ఇంటికి వస్తున్న క్రమంలో వ్యవసాయ బావిలో పడ్డాడు. భార్య స్వప్న వెతకగా ఆయన ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు బావిలో శవమై తేలాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేశారు.

News May 10, 2024

HYD: అశ్లీల నృత్యాలు.. ఆఫ్టర్ 9 పబ్ సీజ్

image

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 8లో ఉన్న ఆఫ్టర్ 9 పబ్‌ని అమీర్‌పేట ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా ఎలాంటి అనుమతి లేకుండా పబ్ కొనసాగుతోందని దర్యాప్తులో తేలింది. కొద్దిరోజుల కిందట పోలీసులు చేసిన దాడిలో 162 మంది యువతీ యువకులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యాజమాన్యం పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే.

News May 10, 2024

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన హామీ

image

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ జిల్లా వాసులకు సంచలన హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాబోయే 3 సంవత్సరాలలో SLBC సొరంగం పనులు పూర్తి చేస్తానని నల్గొండ ప్రజలకు హామీ ఇచ్చారు. నల్లొండలో ప్రతీ ఎకరాకు నీళ్లిచ్చి మీ రుణం తీర్చుకుంటానని తెలిపారు. మీరు ఇచ్చిన విజయాలకు సార్థకత చేకూర్చేందుకు ప్రతి నిమిషం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు.

News May 10, 2024

మధిర: ఉరివేసుకుని యువతి మృతి..

image

మధిర పట్టణంలోని అన్నపూర్ణ మెస్ పక్కన విజయవాడ నుంచి వచ్చిన ఓ యువతి (22) అద్దెకు నివాసం ఉంటోంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్కే ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణ సహకారంతో మధిర టౌన్ ఎస్ఐ సహకారంతో మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 10, 2024

రేపు పటాన్ చెరుకు సీఎం రేవంత్ రెడ్డి

image

రేపు పటాన్‌‌‌చెరుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా పటాన్‌చెరు పట్టణంలో రోడ్ షో నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహాం వద్ద కార్నర్ మీటింగ్‌లో మాట్లాడనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్‌ను పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ రోడ్ షోను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

News May 10, 2024

DK అరుణను సీఎం అవమానించారు: మోదీ

image

MBNRలో కాంగ్రెస్, BRS పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. నారాయణపేట‌ బీజేపీ సభలో‌ ఆయన ప్రసంగించారు. DK అరుణపై‌ ముఖ్యమంత్రి‌ అవమానకరమైన భాష మాట్లాడుతున్నారు. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజలు సమాధానం చెప్పాలని మోదీ అభ్యర్థించారు. మోదీ చౌకీదార్‌గా ఉండగా ఎవరి హక్కులు లాక్కోలేరు. డీకే అరుణకు వేసే ప్రతి ఓటు నేరుగా నా దగ్గరికి వస్తుంది’ అని అన్నారు.

News May 10, 2024

BREAKING.. హుజూరాబాద్ బస్టాండ్‌లో అమానవీయ ఘటన

image

హుజూరాబాద్ బస్టాండ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోజుల వ్యవధి గల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదివెళ్లారు. కాగా, చనిపోయి చీమలు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, రెండ్రోజుల క్రితం వదిలివెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 10, 2024

మహాముత్తారం: అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

image

మహాముత్తారం మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జాడి కీర్తిబాయ్ గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె పార్థివ దేహానికి మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ శుక్రవారం నివాళులు అర్పించారు. అనంతరం కీర్తిబాయి అంతిమయాత్రలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొని పాడె మోశారు.

News May 10, 2024

MBNR: ‘ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక’

image

13న జరిగే పార్లమెంట్ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక అని MBNR కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. మక్తల్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘మనం ఎన్నో ఎన్నికలను చూసి ఉంటాం.. కానీ సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికకు చాలా తేడా ఉన్నది. ఈ ఎన్నిక కేవలం వంశీచంద్ రెడ్డికి ఇంకో అభ్యర్థికి మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. పాలమూరు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన ఎన్నిక’ అని అన్నారు.

News May 10, 2024

రేపు సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్: సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఉత్వర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13 సాయంత్రం 6 గంటల వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.