India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మధిర పట్టణంలోని అన్నపూర్ణ మెస్ పక్కన విజయవాడ నుంచి వచ్చిన ఓ యువతి (22) అద్దెకు నివాసం ఉంటోంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్కే ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణ సహకారంతో మధిర టౌన్ ఎస్ఐ సహకారంతో మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రేపు పటాన్చెరుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా పటాన్చెరు పట్టణంలో రోడ్ షో నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహాం వద్ద కార్నర్ మీటింగ్లో మాట్లాడనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ను పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ రోడ్ షోను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
MBNRలో కాంగ్రెస్, BRS పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. నారాయణపేట బీజేపీ సభలో ఆయన ప్రసంగించారు. DK అరుణపై ముఖ్యమంత్రి అవమానకరమైన భాష మాట్లాడుతున్నారు. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజలు సమాధానం చెప్పాలని మోదీ అభ్యర్థించారు. మోదీ చౌకీదార్గా ఉండగా ఎవరి హక్కులు లాక్కోలేరు. డీకే అరుణకు వేసే ప్రతి ఓటు నేరుగా నా దగ్గరికి వస్తుంది’ అని అన్నారు.
హుజూరాబాద్ బస్టాండ్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోజుల వ్యవధి గల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదివెళ్లారు. కాగా, చనిపోయి చీమలు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, రెండ్రోజుల క్రితం వదిలివెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహాముత్తారం మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జాడి కీర్తిబాయ్ గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె పార్థివ దేహానికి మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ శుక్రవారం నివాళులు అర్పించారు. అనంతరం కీర్తిబాయి అంతిమయాత్రలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొని పాడె మోశారు.
13న జరిగే పార్లమెంట్ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక అని MBNR కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. మక్తల్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘మనం ఎన్నో ఎన్నికలను చూసి ఉంటాం.. కానీ సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికకు చాలా తేడా ఉన్నది. ఈ ఎన్నిక కేవలం వంశీచంద్ రెడ్డికి ఇంకో అభ్యర్థికి మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. పాలమూరు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన ఎన్నిక’ అని అన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఉత్వర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13 సాయంత్రం 6 గంటల వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.
BRS పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మక్తల్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదు. పాలమూరు-రంగారెడ్డి KCR ధనదాహానికి బలైంది. జిల్లా నుంచి కృష్ణా జలాలు వెళ్తున్నా.. ఇక్కడి భూములు ఎడారి చేశారు. ఇక్కడి కొందరు ఢిల్లీ సుల్తానులకు బానిసలయ్యారు. డీకే అరుణ ఢిల్లీ సుల్తానుల పంచన చేరింది’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నకిరేకల్లోని ఎర్పాటు చేసిన జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో చేరుకోనున్నారు. జనజాతర సభకు ఇప్పటికే కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఈ సభలో ఏఐసీసీ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
నేను బ్రతక లేక రాజకీయాలు చేయట్లేదు.. ప్రజలకు ఏదో ఒక సహాయం చేయాలనే రాజకీయాలు చేస్తున్నాను.. అని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఖమ్మం సాయి గణేష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.