Telangana

News May 10, 2024

మేనత్తను అవమానిస్తే నవ్వులు చిందిస్తారా..?: DK అరుణ

image

కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మహబూబ్ నగర్ MP అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ధన్వాడలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వీరి మాటలను ఖండించాల్సిన ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి నవ్వులు చిందించడం విస్మయం కలిగించిందన్నారు.

News May 10, 2024

RR: పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ!

image

పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ. ఇది ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డికి తాండూరు అసెంబ్లీ, చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఓటు హక్కు ఉంది. చేవెళ్ల BRS నుంచి పోటీ చేస్తున్న కాసానికి జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఓటు హక్కు ఉంది. దీంతో వారికి వారు ఓటు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

News May 10, 2024

RR: పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ!

image

పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ. ఇది ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డికి తాండూరు అసెంబ్లీ, చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఓటు హక్కు ఉంది. చేవెళ్ల BRS నుంచి పోటీ చేస్తున్న కాసానికి జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఓటు హక్కు ఉంది. దీంతో వారికి వారు ఓటు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

News May 10, 2024

MBNR: ఓటేసి మనమేంటో చూపిద్దాం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని MBNR, NGKL పార్లమెంట్ నియోజకవర్గాల్లో 100 శాతం ఓటింగ్ నమోదయ్యేలా అధికారులు ఇప్పటికే ప్రజల్లో అవగాహన కల్పించారు. ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఓటేసి మనమేంటో చూపిద్దాం. మే 13న తరలిరండి అంటూ అధికారులు పిలుపునిచ్చారు.

News May 10, 2024

MBNR: రెండు రోజుల్లో ముగియనున్న ప్రచారం..

image

సార్వత్రిక సమరం తుది దశకు చేరుకుంది. ఈ నెల 11తో ప్రచారం ముగియనుంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్ధులు సమయం లేదు మిత్రమా’ అంటూ ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. పాంప్లెట్లు, న్యూస్ పేపర్లు, బ్రోచర్లు వంటి ప్రచారాలతో పాటు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాని విస్తృతంగా ప్రచారానికి వినియోగిస్తున్నారు. డిజిటల్ స్క్రీన్లతో వాహనాలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు.

News May 10, 2024

వరంగల్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రంగాపురం గ్రామానికి చెందిన గుర్రం సునీల్(32) ఇంట్లో విద్యుత్ మోటార్‌ను రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టింది. కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News May 10, 2024

HYD: వారి ఓటును వారికి వేసుకోలేరు!

image

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి ఓటు వారికి వేసుకోలేరు. HYD MP అసదుద్దీన్ ఓవైసీ నివాసం చేవెళ్ల పార్లమెంట్ పరిధి రాజేంద్రనగర్. ఇక్కడ MIM పోటీలో లేదు. దీంతో వేరే పార్టీకి ఓటు వేయక తప్పదు. HYD బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నివాసం మల్కాజిగిరి పార్లమెంట్ ఈస్ట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్. HYD కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మహమ్మద్ సమీర్ నివాసం SEC పార్లమెంట్ పరిధి జూబ్లీహిల్స్‌లో ఓటు వేయాలి.

News May 10, 2024

చెప్పులు కుట్టిన ఎమ్మెల్యే కుంభం

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వలిగొండలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పులు కుడతూ ఓట్లగిగారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ ప్రచారంలో పాశం సత్తి రెడ్డి, ఉపేందర్, బోస్ పాల్గొన్నారు.

News May 10, 2024

HYD: వారి ఓటును వారికి వేసుకోలేరు!

image

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి ఓటు వారికి వేసుకోలేరు. HYD MP అసదుద్దీన్ ఓవైసీ నివాసం చేవెళ్ల పార్లమెంట్ పరిధి రాజేంద్రనగర్. ఇక్కడ MIM పోటీలో లేదు. దీంతో వేరే పార్టీకి ఓటు వేయక తప్పదు. HYD బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నివాసం మల్కాజిగిరి పార్లమెంట్ ఈస్ట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్. HYD కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మహమ్మద్ సమీర్ నివాసం SEC పార్లమెంట్ పరిధి జూబ్లీహిల్స్‌లో ఓటు వేయాలి.

News May 10, 2024

3 రోజులు మద్యం షాపులు బంద్: జిల్లా కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈనెల 11నుంచి 13వరకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.