Telangana

News May 10, 2024

చెప్పులు కుట్టిన ఎమ్మెల్యే కుంభం

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వలిగొండలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పులు కుడతూ ఓట్లగిగారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ ప్రచారంలో పాశం సత్తి రెడ్డి, ఉపేందర్, బోస్ పాల్గొన్నారు.

News May 10, 2024

HYD: వారి ఓటును వారికి వేసుకోలేరు!

image

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి ఓటు వారికి వేసుకోలేరు. HYD MP అసదుద్దీన్ ఓవైసీ నివాసం చేవెళ్ల పార్లమెంట్ పరిధి రాజేంద్రనగర్. ఇక్కడ MIM పోటీలో లేదు. దీంతో వేరే పార్టీకి ఓటు వేయక తప్పదు. HYD బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నివాసం మల్కాజిగిరి పార్లమెంట్ ఈస్ట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్. HYD కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మహమ్మద్ సమీర్ నివాసం SEC పార్లమెంట్ పరిధి జూబ్లీహిల్స్‌లో ఓటు వేయాలి.

News May 10, 2024

3 రోజులు మద్యం షాపులు బంద్: జిల్లా కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈనెల 11నుంచి 13వరకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.

News May 10, 2024

NZB: డీకంపల్లి పెద్దమ్మ గుడిలో దొంగల బీభత్సం

image

ఆలూర్ మండలం డికంపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెద్దమ్మ గుడి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుడి తాళాన్ని బద్దలు కొట్టి అమ్మవారి ముక్కుపుడక, బంగారు ఆభరణాలు, వెండి కన్నులు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News May 10, 2024

జూబ్లీహిల్స్: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాలు.. సూర్యాపేట(D) కోదాడ సమీపంలోని రామచంద్రాపురానికి చెందిన బాలుడు యూసుఫ్‌గూడలో చదువుకుంటున్నాడు. అతడికి సమీప ప్రాంతంలో నివసించే పదో తరగతి బాలిక పరిచయమైంది. మార్చి 26న బాలిక ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిపై పోక్సో కేసు నమోదైంది.

News May 10, 2024

మెదక్: తుదిదశకు ప్రచారం.. ఓట్ల వేటలో నాయకులు

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారం పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను గుర్తించి షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మెదక్ స్థానంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టి గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

News May 10, 2024

మహబూబాబాద్: చింతగడ్డ తండాలో గుప్త నిధుల తవ్వకాలు

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం చింతగడ్డ తండాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. తన పొలంలో గుప్తనిధులు ఉన్నాయని, అక్కడ తవ్వకాలు జరపాలని కొంతమంది తనను అడిగారని, తాను నిరాకరించినట్లు రైతు వెంకటేశ్ తెలిపారు. ఈ క్రమంలో గురువారం పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లగా పెద్దగుంత తీసి ఉన్నట్లు గమనించాడు. JCBతో తవ్వకాలు చేపట్టినట్లు గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News May 10, 2024

బాలికపై అత్యాచారం.. పొక్సో కేసు నమోదు

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాలు.. సూర్యాపేట(D) కోదాడ సమీపంలోని రామచంద్రాపురానికి చెందిన బాలుడు యూసుఫ్‌గూడలో చదువుకుంటున్నాడు. అతడికి సమీప ప్రాంతంలో నివసించే పదో తరగతి బాలిక పరిచయమైంది. మార్చి 26న బాలిక ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిపై పొక్సో కేసు నమోదైంది.

News May 10, 2024

జూబ్లీహిల్స్: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాలు.. సూర్యాపేట(D) కోదాడ సమీపంలోని రామచంద్రాపురానికి చెందిన బాలుడు యూసుఫ్‌గూడలో చదువుకుంటున్నాడు. అతడికి సమీప ప్రాంతంలో నివసించే పదో తరగతి బాలిక పరిచయమైంది. మార్చి 26న బాలిక ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిపై పోక్సో కేసు నమోదైంది.

News May 10, 2024

MBNR: కార్మికురాలిపై అత్యాచారం.. వ్యాపారిపై కేసు

image

ఓ కార్మికురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. MBNR జిల్లాకు చెందిన దంపతులు ఉపాధి కోసం శంషాబాద్‌కు వచ్చి బతుకుతున్నారు. ఈ క్రమంలోనే అహ్మద్‌నగర్‌కు చెందిన తుక్కు వ్యాపారి ఖలీల్‌ పరిచయమయ్యాడు. ఈనెల 25న పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఆమెను బైక్‌పై వదిలేస్తానని చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈమేరకు బాధితుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేశారు.