India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు, ముఖ్య నేతలకు ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. ప్రచారానికి వెళ్లి ఓట్లు వేయమని అడుగుతున్న అభ్యర్థులకు ఓటర్లు తెలివిగా సరే అంటూ తలూపుతున్నారు. ప్రచారానికి వెళ్లిన అన్ని పార్టీల వారికి ఇదే విధమైన సమాధానాలు వస్తుండడంతో ఇంతకు ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారో తెలియక ఇటు అభ్యర్థులు.. అటు ముఖ్యమైన నేతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
CM రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్(VHP) ప్రతినిధులు ఎన్నికల అధికారిని గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందుత్వం, హిందూ విశ్వాసాలు, హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు, సీతా మాతపై విమర్శలు చేయడం VHP తప్పుబడుతోందన్నారు. తుక్కుగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్య శ్రీరామజన్మభూమి అక్షింతలను అవమానపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
CM రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్(VHP) ప్రతినిధులు ఎన్నికల అధికారిని గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందుత్వం, హిందూ విశ్వాసాలు, హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు, సీతా మాతపై విమర్శలు చేయడం VHP తప్పుబడుతోందన్నారు. తుక్కుగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్య శ్రీరామజన్మభూమి అక్షింతలను అవమానపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
HYD చాలా సున్నితమైన ప్రాంతమని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా ఛానెల్ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ‘పదేళ్లు పాలించిన TDP, కాంగ్రెస్, BRS ప్రభుత్వాలు హైదరాబాద్లో మత కల్లోహాలు లేకుండా కాపాడాయి. ఈ రోజు BJP ఇక్కడ నాలుగు సీట్లు గెలవడం కోసం మైనార్టీల్లో, మెజార్టీ వర్గాల్లో అభద్రత, భయాన్ని రేకెత్తించడం ఎంతవరకు సమంజసం? పెట్టుబడులను గుజరాత్ తరలించడానికే BJP కుట్ర చేస్తోంది’ అంటూ CM ఆరోపించారు.
HYD చాలా సున్నితమైన ప్రాంతమని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా ఛానెల్ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ‘పదేళ్లు పాలించిన TDP, కాంగ్రెస్, BRS ప్రభుత్వాలు హైదరాబాద్లో మత కల్లోహాలు లేకుండా కాపాడాయి. ఈ రోజు BJP ఇక్కడ నాలుగు సీట్లు గెలవడం కోసం మైనార్టీల్లో, మెజార్టీ వర్గాల్లో అభద్రత, భయాన్ని రేకెత్తించడం ఎంతవరకు సమంజసం? పెట్టుబడులను గుజరాత్ తరలించడానికే BJP కుట్ర చేస్తోంది’ అంటూ CM ఆరోపించారు.
✒ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
✒NGKL: తేనెటీగల దాడిలో యువకుడు మృతి
✒సమస్యలపై గళం వినిపిస్తా..MPగా ఆశీర్వదించండి:బర్రెలక్క
✒రేపు పాలమూరుకు మోదీ, ప్రియాంక గాంధీ
✒NGKL: అక్రమ సంబంధం.. భార్యను చంపిన భర్త
✒ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి:CPM
✒NRPT: వాహనాల తనిఖీల్లో రూ.2,76,500 సీజ్
✒పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై అధికారుల ఫోకస్
✒కాంగ్రెస్లో పలువురు చేరికలు
మోసపూరిత హామీలను ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ సీఎం KCR అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం లేదని, రైతు రుణమాఫీ చేయలేదని, మహిళలకు పెంచిన పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయట్లేమని ఫైర్ అయ్యారు.
కరీంనగర్ గడ్డ ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ఉద్యమాల గడ్డ అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో రోడ్ షోలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి నాంది వేసిందే కరీంనగర్ అని తెలిపారు. కరీంనగర్ ప్రజలు తనను కడుపులో పెట్టి చూసుకున్నారని.. కరీంనగర్ లేకుంటే తెలంగాణ ఉద్యమానికి ఉనికి లేదని తెలిపారు. కరీంనగర్ అంటే తనకు ఎంతో ప్రేమ అని కేసీఆర్ చెప్పారు.
MP ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ప్రధాని మోదీ హైదరాబాద్కు వస్తున్నారు. కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, మాధవీలతకు మద్దతుగా ఆయన ఎల్బీస్టేడియంలో BJP జనసభలో ప్రసంగిస్తారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సా. 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీస్టేడియం చుట్టూ ఆంక్షలు విధించారు. BJR విగ్రహం, AR పెట్రోల్ పంప్ దారి మూసివేస్తారు. ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.
వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. రైలు ఎక్కేందుకు స్టేషన్కు వచ్చిన ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మంచిర్యాలకు చెందిన మొహమ్మద్ ఇక్బాల్(58)గా పోలీసులు, రైల్వే సిబ్బంది గుర్తించారు. వరంగల్ నుంచి మంచిర్యాలకు వెళ్లేందుకు నవజీవన్ రైలు ఎక్కుతుండగా ఈ విషాద సంఘటన జరిగింది.
Sorry, no posts matched your criteria.