Telangana

News May 9, 2024

NZB: బ్రాండ్ బాటిళ్లలో చీప్ లిక్కర్.. వైన్స్ సీజ్

image

హయ్యర్ బ్రాండ్‌ బాటిళ్లలో చీప్ లిక్కర్ కలుపి అమ్ముతున్న ఓ వైన్స్‌ను గురువారం పోలీసులు సీజ్ చేశారు. నిజామబాద్‌లోని పరమేశ్వరి వైన్స్‌లో స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్ గురువారం సోదాలు నిర్వహించారు. 37 ఫుల్ బాటిళ్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకొని, వైన్స్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ దాడిలో SHO దిలీప్, SIలు మల్లేశ్, సుష్మిత, సింధు, సిబ్బంది ఉన్నారు.

News May 9, 2024

మోదీ, ఆరూరి రమేశ్‌కు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలి: కావ్య

image

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ ప్రజలు మోదీ, ఆరూరి రమేశ్‌కు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. హన్మకొండలో బీసీ సంఘం సమావేశంలో కావ్య మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల బతుకులు చీకటి మయమవుతాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికలు తెలంగాణకు, గుజరాత్‌కు మధ్య జరుగుతున్న యుద్ధమని తెలిపారు.

News May 9, 2024

బండి సంజయ్‌పై కేసీఆర్ సటైర్లు!

image

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మాజీ సీఎం కేసీఆర్ ఛలోక్తులు విసిరారు. కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ మాట్లాడే భాష ఏ భాషనో కూడా మనకు అర్థం కాదని అన్నారు. పార్లమెంటులో ఎప్పుడైనా బండి సంజయ్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. మళ్లీ అలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపడం అవసరమా? అని కరీంనగర్ ప్రజలను ప్రశ్నిస్తున్నామన్నారు.

News May 9, 2024

NGKL: అక్రమ సంబంధం.. భార్యను చంపిన భర్త

image

భర్త చేతిలో భార్య మృతి చెందిన HYD వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. NGKL జిల్లా ఉయ్యాలవాడ చెందిన సతీష్, స్వాతి దంపతులు. భర్త ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఈనెల 6న భార్య సతీష్‌తో గొడవ పడగా.. స్వాతి గొంతునులిమి చంపి ఫ్యానుకు ఉరేసి, పారిపోయాడు. స్వాతి పేరెంట్స్ ఆస్తి పిల్లల పేరా చేయాలని డిమాండ్ చేశారు. స్వాతి డెడ్ బాడీ ఖననం చేయకుండా ఉంచారు. భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

News May 9, 2024

12 జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు నల్లగొండలో శిక్షణ

image

WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో పిఓ, ఏపీఓలు, పోలింగ్ సిబ్బందిది ముఖ్యపాత్ర అని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి 12 జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

News May 9, 2024

ధాన్యం అమ్మిన రైతులకు రూ.584 కోట్లు చెల్లింపు

image

NLG జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటివరకు రూ.584 కోట్లు చెల్లించినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు. కష్టం మిల్లింగ్ రైస్, యాసంగి ధాన్యం కొనుగోలుపై గురువారం తన ఛాంబర్ లో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు గాను 370 దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, వీటి ద్వారా ఇప్పటి వరకు 661 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.

News May 9, 2024

మెదక్ జిల్లాలో మొగోడు దొరకలేదా: CM రేవంత్

image

‘నీలం మధు మీద పోటీకి KNR జిల్లా నుంచి వెంకట్రాంరెడ్డిని తీసుకొచ్చారు, మెదక్ జిల్లాలో BRS నుంచి పోటీ చేసే మొగోడు దొరకలేదా’ అని CM రేవంత్ రెడ్డి, KCRను ప్రశ్నించారు. నేడు నర్సాపూర్లో నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ కోసం రైతుల భూములు గుంజుకున్నోడు వెంకట్రాంరెడ్డి అని ఆరోపించారు. దుబ్బాక ప్రజల చెవిలో పువ్వులు పెట్టిన రఘునందన్‌ను ఎన్నికల్లో ఓడగొట్టి మధును గెలిపించాలని అన్నారు.

News May 9, 2024

పాకిస్తాన్ పుల్వామా మత రాజకీయాలే బీజేపీ ఎజెండా!

image

పాకిస్తాన్‌ను బూచిగా చూపి పదేళ్లుగా బీజేపీ రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ చిన్న దేశం.. ఒక్క జాఫట్ కొడితే 25 ఏళ్లు వాడు మన తెరువు రాడు అని అన్నారు. పాకిస్తాన్, పుల్వామా, మత రాజకీయం తప్పితే బీజేపీ చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు.

News May 9, 2024

BREAKING.. WGL: కారు బోల్తా.. కాంగ్రెస్ నాయకురాలు మృతి

image

కారు బోల్తా పడి కాంగ్రెస్ నాయకురాలు మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం నిమ్మగూడెం వద్ద కారు బోల్తా పడి మహాముత్తారం మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు జాడి కీర్తిబాయి మృతి చెందింది. ఆమె భర్త రాజయ్యకు తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 9, 2024

BREAKING.. KNR: కారు బోల్తా.. కాంగ్రెస్ నాయకురాలు మృతి

image

కారు బోల్తా పడి కాంగ్రెస్ నాయకురాలు మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం నిమ్మగూడెం వద్ద కారు బోల్తా పడి మహాముత్తారం మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు జాడి కీర్తిబాయి మృతి చెందింది. ఆమె భర్త రాజయ్యకు తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.