Telangana

News May 9, 2024

పాకిస్తాన్ పుల్వామా మత రాజకీయాలే బీజేపీ ఎజెండా!

image

పాకిస్తాన్‌ను బూచిగా చూపి పదేళ్లుగా బీజేపీ రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ చిన్న దేశం.. ఒక్క జాఫట్ కొడితే 25 ఏళ్లు వాడు మన తెరువు రాడు అని అన్నారు. పాకిస్తాన్, పుల్వామా, మత రాజకీయం తప్పితే బీజేపీ చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు.

News May 9, 2024

BREAKING.. WGL: కారు బోల్తా.. కాంగ్రెస్ నాయకురాలు మృతి

image

కారు బోల్తా పడి కాంగ్రెస్ నాయకురాలు మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం నిమ్మగూడెం వద్ద కారు బోల్తా పడి మహాముత్తారం మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు జాడి కీర్తిబాయి మృతి చెందింది. ఆమె భర్త రాజయ్యకు తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 9, 2024

BREAKING.. KNR: కారు బోల్తా.. కాంగ్రెస్ నాయకురాలు మృతి

image

కారు బోల్తా పడి కాంగ్రెస్ నాయకురాలు మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం నిమ్మగూడెం వద్ద కారు బోల్తా పడి మహాముత్తారం మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు జాడి కీర్తిబాయి మృతి చెందింది. ఆమె భర్త రాజయ్యకు తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News May 9, 2024

KTDM: ఎన్నికలు బహిష్కరిస్తాం: ఆదివాసీలు 

image

పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటును బహిష్కరిస్తున్నామని గరిమెళ్ళపాడు గ్రామానికి చెందిన ఆదివాసీలు బ్యానర్ల ద్వారా తమ సమస్యలను విన్నవించారు. దీనిపై స్పందించిన పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు వారిని కలిసి మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో ఓటు బహిష్కరిస్తున్నామని ప్రకటించినట్లు వారు చెప్పారు. ఏళ్ల నాటి తమ భూములపై హక్కులు, ఐటీడీఏ నర్సరీలో ఉద్యోగాలు కల్పించాలని అధికారులను కోరారు.

News May 9, 2024

హైదరాబాద్‌ను విశ్వనగరం చేశాం: CM రేవంత్

image

HYD అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుందని‌ CM రేవంత్ అన్నారు. గురువారం సరూర్‌నగర్‌ జనజాతరలో‌ ఆయన ప్రసంగించారు. ‘నగరం ప్రశాంతంగా ఉంది. IT, ఫార్మా కంపెనీలను కాంగ్రెస్ తీసుకొచ్చినందుకే విశ్వనగరంగా‌ పేరు వచ్చింది. అటువంటి హైదరాబాద్‌లో BJP విషం చిమ్మాలని చూస్తోంది. మతం పేరుతో రాజకీయం చేస్తోంది. ఇలా అయితే పెట్టుబడులు వస్తాయా. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయా’ అనేది ప్రజలు ఆలోచించాలని CM సూచించారు.

News May 9, 2024

హైదరాబాద్‌ను విశ్వనగరం చేశాం: CM రేవంత్

image

HYD అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుందని‌ CM రేవంత్ అన్నారు. గురువారం సరూర్‌నగర్‌ జనజాతరలో‌ ఆయన ప్రసంగించారు. ‘నగరం ప్రశాంతంగా ఉంది. IT, ఫార్మా కంపెనీలను కాంగ్రెస్ తీసుకొచ్చినందుకే విశ్వనగరంగా‌ పేరు వచ్చింది. అటువంటి హైదరాబాద్‌లో BJP విషం చిమ్మాలని చూస్తోంది. మతం పేరుతో రాజకీయం చేస్తోంది. ఇలా అయితే పెట్టుబడులు వస్తాయా. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయా’ అనేది ప్రజలు ఆలోచించాలని CM సూచించారు.

News May 9, 2024

కార్యాలయాలకు సెలవు: జిల్లా కలెక్టర్ హరి చందన

image

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల పోలింగ్ రోజు 13న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్న విద్యా సంస్థలు, కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల నిమిత్తం ఈ నెల 12వ తేదీ సైతం సెలవుదినంగా ప్రకటించారు.

News May 9, 2024

జహీరాబాద్: MP ఎన్నిక.. అంతుచిక్కని ఓటరు నాడి..!

image

జహీరాబాద్ ఎంపీ ఎన్నికల ఫలితంపై ప్రధాన పార్టీల్లో ఆందోళన మొదలైంది. సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులకు ఓటర్ నాడి అంతు చిక్కక తలలు పట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ క్లారిటీ ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో నమ్ముకున్న కార్యకర్తలే ఎటు ఓటు వేస్తారన్న ఆలోచనలో కొంత మంది ఉన్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సవాల్‌గా మారిందని టాక్. 

News May 9, 2024

రేపు సిరిసిల్లకు మాజీ సీఎం కేసీఆర్

image

మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం సిరిసిల్లలో పర్యటించనున్నట్లు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్ షోలో పాల్గొంటారని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News May 9, 2024

మిర్చి బజ్జీలు చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

image

కొడకండ్ల మండలంలోని ఏడునూతుల గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ హోటల్ ఎర్రబెల్లి మిర్చి బజ్జీలు చేసి సందడి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.