Telangana

News May 9, 2024

HYD: అమ్మాయిని చేరదీసి.. వ్యభిచార ఊబిలోకి దింపింది!

image

HYD యూసుఫ్‌గూడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు..కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లి దాడి చేశారు. ఇద్దరు యువతులు,ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో 14ఏళ్ల బాలిక ఉండగా నిర్వాహకురాలు లక్ష్మిని విచారించారు. చిన్నప్పుడే బాలికను తీసుకొచ్చి పెంచి, బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపినట్లు తెలిపింది. చిన్నారిని రక్షించారు.

News May 9, 2024

ZHB: MP ఎన్నిక.. అంతుచిక్కని ఓటరు నాడి..!

image

జహీరాబాద్ ఎంపీ ఎన్నికల ఫలితంపై ప్రధాన పార్టీల్లో ఆందోళన మొదలైంది. సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులకు ఓటర్ నాడి అంతు చిక్కక తలలు పట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ క్లారిటీ ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. నమ్ముకున్న కార్యకర్తలే ఎటు ఓటు వేస్తారన్న ఆలోచనలో కొంత మంది ఉన్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి జహీరాబాద్ సవాల్‌గా మారిందని టాక్.

News May 9, 2024

MBNR: ప్రతి సెక్షన్లో 88 మందిని మాత్రమే చేర్చుకోవాలి !

image

MBNR: 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం కళాశాలలో మంజూరైన ప్రతి సెక్షన్లో 88 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. అదనపు సెక్షన్లు అవసరం అవుతే తప్పనిసరిగా ఇంటర్ బోర్డ్ అనుమతి తీసుకోవాలని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని ఉల్లంఘించిన కళాశాలలకు జరిమానాతో పాటు గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని అన్నారు.

News May 9, 2024

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 41కి చేరిన నామినేషన్లు

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. నిన్న మరో 12 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా.. నామినేషన్లు వేసిన వారి సంఖ్య 41కి చేరింది. ఈరోజు మరికొన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా.. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

News May 9, 2024

HYD: బాచుపల్లి గోడ కూలిన ఘటనలో ఆరుగురు అరెస్ట్

image

HYD బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీశ్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేశ్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నామని పోలీసులు తెలిపారు.

News May 9, 2024

HYD: బాచుపల్లి గోడ కూలిన ఘటనలో ఆరుగురు అరెస్ట్

image

HYD బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీశ్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేశ్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నామని పోలీసులు తెలిపారు.

News May 9, 2024

మామునూరు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై బీజేపీ వివక్ష: బండ ప్రకాశ్

image

మామునూరు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై బీజేపీ పదేళ్లు వివక్ష చూపిందని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. పరకాలలో మీడియాతో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామన్నారు. బీజేపీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవమానించారన్నారు.

News May 9, 2024

కరీంనగర్: తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలిసేలా!

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు 3 రోజులు మాత్రమే మిగిలింది. పోలింగ్‌కు 48 గంటల ముందే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 11న సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను కలిసేలా తమ ప్రచారం తీరును మార్చుకుంటున్నారు.

News May 9, 2024

తానూర్: వడదెబ్బతో ఉపాధి కూలి మృతి

image

ఉపాధి హామీ పనులకు వెళ్లి వడ దెబ్బకు గురైన కూలి మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. బోసి గ్రామానికి చెందిన పర్వార్ విఠ్ఠల్ (60) బుధవారం కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి తిరిగి రాగా.. అస్వస్థతకు గురై పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వడ దెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

News May 9, 2024

పోలీసులు అతిగా పోవద్దు.. వచ్చేది మా ప్రభుత్వమే: KCR

image

పోలీసులు అతిగా పోవద్దని, వచ్చేది మా ప్రభుత్వమేనని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాత్రి పటాన్‌చెరు పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో BRS అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రసంగించారు. పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తించాలని, రాజకీయాల్లో వేలు పెట్టొద్దన్నారు. తెలంగాణ కోసం నా ప్రాణమైన బలి పెడతాను కానీ అన్యాయం జరగనీయం అన్నారు. బడే బాయ్ చోటే బాయ్ కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.