Telangana

News May 9, 2024

ADB: ఎన్నికల సమరానికి.. ఇక మూడు రోజులే !

image

సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడటంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టిసారించాయి. ADB, PDPL లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, BRS, BJP మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయి సమావేశాలు, బహిరంగ సభలు, కూడలి సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం మూడు రోజులు ఉండడంతో అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది.

News May 9, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 4 రోజులు మోస్తరు వర్ష సూచన ఉందని జగిత్యాల పరిశోధన స్థానం ఏడీఆర్ డా.జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి ధాన్యం తడవకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా బుధవారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో 42.3 డిగ్రీల సెల్సియస్, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 40.8, KNR జిల్లా జమ్మికుంటలో 40.7, సిరిసిల్ల జిల్లా నామాపూర్‌లో 40.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

News May 9, 2024

NZB: ఎన్నికల సమరానికి.. ఇక మూడు రోజులే !

image

సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడటంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టిసారించాయి. NZB, ZHB లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, BRS, BJP మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయి సమావేశాలు, బహిరంగ సభలు, కూడలి సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం మూడు రోజులు ఉండడంతో అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది.

News May 9, 2024

HYD: ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియ విజయవంతం చేసిన స్ఫూర్తితోనే పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని హైదరాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

News May 9, 2024

HYD: స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.6.5 లక్షలు లూటీ

image

స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.6.5 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచేశారు. నగరానికి చెందిన గృహిణి(64) ఫేస్ బుక్‌లో ట్రేడింగ్‌లో మంచి లాభాలు వస్తాయనే ప్రకటన చూసి ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొదటగా కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.6.50 లక్షల వరకు యాప్‌లో పెట్టుబడి పెట్టారు. లాభాలు వచ్చిన విత్ డ్రా చేసుకోవడానికి రాకపోవడంతో మోసపోయి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 9, 2024

HYD: స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.6.5 లక్షలు లూటీ

image

స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.6.5 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచేశారు. నగరానికి చెందిన గృహిణి(64) ఫేస్ బుక్‌లో ట్రేడింగ్‌లో మంచి లాభాలు వస్తాయనే ప్రకటన చూసి ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొదటగా కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.6.50 లక్షల వరకు యాప్‌లో పెట్టుబడి పెట్టారు. లాభాలు వచ్చిన విత్ డ్రా చేసుకోవడానికి రాకపోవడంతో మోసపోయి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 9, 2024

NLG: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు

image

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. బుధవారం మరో 12 మంది అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందనకు నామినేషన్లు అందజేశారు. దీంతో నామినేషన్లు వేసిన వారి సంఖ్య 41కి చేరింది.

News May 9, 2024

ఖమ్మం: 2 రోజులు మద్యం దుకాణాలు బంద్

image

ఖమ్మం లోక్ సభ ఎన్నికల వేళ మందుబాబులకు మరోసారి బ్యాడ్ న్యూస్ వినిపించింది. మే 13న పోలింగ్ జరగనుండగా.. మే 11న సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సాయంత్రం 6 గంటల వరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని వైన్ షాపులు, బార్లు మూసేయాలని అధికారులు అదేశించారు. ఈ రెండు రోజులతో పాటు.. కౌంటింగ్ రోజైన జూన్ 4వ తేదీన కూడా మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని అధికారులు ముందే ఆదేశాలు జారీ చేశారు.

News May 9, 2024

HYD: 24 గంటల్లో రూ.28.43 లక్షలు స్వాధీనం

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.28,43,735 నగదు, రూ.5,55,605 విలువైన ఇతర వస్తువులు, 33.50 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆరుగురిపై FIR  నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.22.5 కోట్ల నగదు, రూ.17.93 కోట్ల విలువైన వస్తువులు, 26.83 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.

News May 9, 2024

HYD: 24 గంటల్లో రూ.28.43 లక్షలు స్వాధీనం

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.28,43,735 నగదు, రూ.5,55,605 విలువైన ఇతర వస్తువులు, 33.50 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆరుగురిపై FIR  నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.22.5 కోట్ల నగదు, రూ.17.93 కోట్ల విలువైన వస్తువులు, 26.83 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.