India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా గద్వాల జిల్లా మల్దకల్లో 13.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కోస్గిలో 12.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో 12.8 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా మదనపూర్ లో 4.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా బొల్లంపల్లిలో 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెజ్లింగ్ ఎంపికలు ఈ నెల 30న ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు SGF జిల్లా కార్యదర్శి నర్సింలు తెలిపారు. అండర్-14,17 విభాగాల్లో ఎంపికలు ఉంటాయని, అండర్-14 విభాగానికి జనవరి 1, 2011, అండర్-17 విభాగానికి జనవరి1, 2008 తర్వాత జన్మించిన వారే అర్హులన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఒరిజినల్ బోనఫైడ్తో హాజరు కావాలన్నారు.
పర్యాటక రంగానికి కేరాఫ్ మన హైదరాబాద్. విదేశీయులు సైతం నిత్యం నగరాన్ని సందర్శిస్తుంటారు. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, 7 టూంబ్స్, ట్యాంక్బండ్, పాతబస్తీలోని చెక్కు చెదరని పురాతన కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి, నూతన సెక్రటేరియట్ నగరంలో కొత్త టూరిస్ట్ స్పాట్లుగా పేరొందాయి. మరి HYDలో మీకు నచ్చిన బెస్ట్ స్పాట్ ఏంటో కామెంట్ చేయండి.
పర్యాటక రంగానికి కేరాఫ్ మన హైదరాబాద్. విదేశీయులు సైతం నిత్యం నగరాన్ని సందర్శిస్తుంటారు. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, 7 టూంబ్స్, ట్యాంక్బండ్, పాతబస్తీలోని చెక్కు చెదరని పురాతన కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి, నూతన సెక్రటేరియట్ నగరంలో కొత్త టూరిస్ట్ స్పాట్లుగా పేరొందాయి. మరి HYDలో మీకు నచ్చిన బెస్ట్ స్పాట్ ఏంటో కామెంట్ చేయండి.
ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి మూలమలుపు వద్ద ఓ డీసీఎం వ్యాను టైర్లు ఊడిపోగా.. పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డికి చెందిన ఆయిల్ లోడుతో వ్యాన్ జగిత్యాలకు వెళుతోంది. రాగట్లపల్లి మూలమలుపు వద్దకు రాగానే డివైడర్కు తగిలిన డీసీఎం వ్యాన్ వెనుక టైర్లు ఊడిపోయి ఓ వైపు ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అప్రమత్తతో డీసీఎం వేగాన్ని అదుపు చేసి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఉండవెల్లి మండలం పరిధిలో గల ప్రాగుటూరులో ఫ్రైడే డ్రై కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇంటి పరిసర ప్రదేశాల్లో నీటిని ఎక్కువ కాలం నిల్వలేకుండా ఉంచుకోవాలని కోరారు. దోమలను నివారించడానికి ఇది సరైన మార్గమని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్కు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. టూరిస్ట్ డే సందర్భంగా జిల్లాలోని ప్రాంతాలను ఈరోజు గుర్తు చేసుకుందాం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పతో పాటు వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్, లక్నవరం, బొగత, పాండవుల గుట్ట, పాకాల, భద్రకాళి ఆలయం, మల్లూరు, భీమునిపాదం మొదలైనవి. అడవులు, కాకతీయులు ఏలిన ప్రాంతం కావడంతో పర్యాటకం వెలుగొందుతోందని చెప్పొచ్చు.మరి మీకు ఎక్కువగా వెళ్లిన ప్రాంతాన్ని కామెంట్ చేయండి.
మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలం పోరండ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతల లక్ష్మారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. వారితో పాటు ఉపాధ్యాక్షుడు నీలం సుదర్శన్, నాయకులు గొల్ల లక్ష్మణ్, గడ్డం రమేష్, బొజ్జ పర్శయ్య తదితరులున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలకు పార్లమెంట్ స్థాయి సంఘం ఛైర్మన్ పదవులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్లుగా, పలువురిని స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమించింది. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డికి ఇంధనం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవులు దక్కాయి.
గత ప్రభుత్వంలో నర్సంపేటకు మంజూరు చేసిన మిర్చి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి శుక్రవారం పెద్ది బహిరంగ లేఖను రాశారు. నర్సంపేటకు మంజూరైన మిర్చి పరిశోధన కేంద్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో రైతులకు అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.