India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.49,303 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.27,846, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.16,050, అన్నదానం రూ.5,407 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన రవీందర్(35) రేగొండ నుంచి కొత్తపల్లికి బైకుపై వెళ్తుండగా భూపాలపల్లి నుంచి వస్తున్న RTC బస్సు ఢీకొట్టింది. దీంతో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన గొల్ల అజయ్ క్రీడల్లో సత్తా చాటాడు. జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు. అజయ్ నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డ కాగా.. తండ్రి దస్తప్ప వ్యవసాయంతో పాటు గొర్రెల కాపరిగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న అజయ్.. చదువుతోపాటు ఇష్టమైన కిక్ బాక్సింగ్లో మెడల్ సాధించి ఔరా అనిపించాడు.
-CONGRATS
ఖమ్మం: గణేష్ నిమజ్జన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఖచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సునీల్ దత్ తెలిపారు. గణేష్ నిమజ్జనం, బందోబస్తు ఏర్పాట్లపై గురువారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ చిన్న సంఘటనకు అస్కారం లేకుండా భక్తులు, సందర్శకులు క్షేమంగా తిరిగి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని, అటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
HYDలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనను సుమోటోగా తీసుకున్న సైబరాబాద్ గచ్చిబౌలి పోలీసులు ఎమ్మెల్యే గాంధీపై కేసు నమోదు చేశారు. A1 ఎమ్మెల్యే గాంధీ సహా, 15 మంది అనుచరుల మీద కేసులు బుక్ చేశారు. 189, 191(2), 191(3), 61, 132, 329, 333,324(4), 324(5) 351(2) సహా ఇతర సెక్షన్ల కింద కేసులు ఫైల్ అయ్యాయని అధికారులు తెలిపారు.
దౌర్జన్యమా, గుండాయిజమా..? ఇందులో ఏది ఇష్టమో చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ గుండాల బెదిరింపులకు BRS సైనికులు భయపడరని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి తామంతా అండగా నిలబడతామన్నారు. మీ అవినీతి దుష్పరిపాలన నుంచి రాష్ట్రంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటామని, మీ భయానక వ్యూహాలు మా సంకల్పానికి ఆజ్యం పోస్తాయన్నారు.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలుపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకీ చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో-చైర్మన్గా మంత్రి దామోదర రాజనర్సింహ నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా ములుగు జిల్లాకు చెందిన సీతక్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవిలు నియమాకం అయ్యారు.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలుపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకీ చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్గా మంత్రి దామోదర రాజనర్సింహ నియామక మయ్యారు. కమిటీ సభ్యులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు నియమాకం అయ్యారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల MLAలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ MP కడియం కావ్య సంతాపం వ్యక్తం చేశారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ మాజీ సభ్యుడిగా సీతారాం ప్రజల పక్షాన పోరాడిన గొప్ప నాయకుడని ఎంపీ వివరించారు. ఏచూరి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వారు చెప్పారు.
కష్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులను కోరారు. గురువారం ఆయన తన చాంబర్లో 2023- 24 కస్టమ్ మిల్లింగ్ రైస్ పై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, ఎఫ్సిఐ అధికారులతో సమీక్షించారు. 2023 -24 ఖరీఫ్, రబీకి సంబంధించిన సీఎంఆర్ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు విధించిందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.