Telangana

News May 9, 2024

HYD: నేడు అంబేడ్కర్ వర్సిటీలో టెలీకాన్ఫరెన్స్

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకడమిక్, అభివృద్ధి కార్యకలాపాలపై మే 9న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఈఎంఆర్అండ్ఆర్సీ డైరక్టర్ ఆచార్య వడ్డాణం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ యూట్యూబ్ ఛానెల్, టీ-శాట్ నిపుణ ద్వారా ఈ టెలీకాన్ఫరెన్స్ ఉంటుందని, విద్యార్థులు, అధ్యయన కేంద్రాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనలన్నారు.

News May 9, 2024

HYD: నేడు అంబేడ్కర్ వర్సిటీలో టెలీకాన్ఫరెన్స్

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకడమిక్, అభివృద్ధి కార్యకలాపాలపై మే 9న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఈఎంఆర్అండ్ఆర్సీ డైరక్టర్ ఆచార్య వడ్డాణం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ యూట్యూబ్ ఛానెల్, టీ-శాట్ నిపుణ ద్వారా ఈ టెలీకాన్ఫరెన్స్ ఉంటుందని, విద్యార్థులు, అధ్యయన కేంద్రాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనలన్నారు.

News May 9, 2024

భువనగిరి: 2 రోజులు మద్యం దుకాణాలు బంద్

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు లేదా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్ ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవన్నారు. ఎక్సైజ్ శాఖ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.

News May 9, 2024

కరీంనగర్: 2 రోజులు మద్యం దుకాణాలు బంద్

image

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుంచి 13 రాత్రి ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు, బార్లను వ్యాపారులు మూసి వేయాలని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు సూచించారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు. నిబంధనలు అతిక్రమించి వ్యాపారం సాగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News May 9, 2024

“కొకపేటలో భూములు కొనడానికి డబ్బులు ఎక్కడివి “

image

మోదీతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు కారుకు పంక్చర్ చేయడంతో పాటు కాళేశ్వరంలో ముంచారని మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బుధవారం వర్గల్ మండల కేంద్రంలో రోడ్ షో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రజలను వంచించి కోట్లు కొల్లగొట్టారని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి కొకపేటలో రూ.వంద కోట్లకుపైగా ఖర్చు పెట్టి భూములు కొనడానికి డబ్బు ఎక్కడివని ప్రశ్నించారు.

News May 9, 2024

HYD: జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

image

రాష్ట్రంలో 2024 -25 విద్యాసంవత్సరానికి గాను జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. నేటి నుంచి ఫస్ట్ ఫేజ్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. కాగా ఈనెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. కాగా జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీలోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు HYDలో అధికారులు స్పష్టం చేశారు.

News May 9, 2024

HYD: జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

image

రాష్ట్రంలో 2024 -25 విద్యాసంవత్సరానికి గాను జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. నేటి నుంచి ఫస్ట్ ఫేజ్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. కాగా ఈనెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. కాగా జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీలోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు HYDలో అధికారులు స్పష్టం చేశారు.

News May 9, 2024

HYD: మాజీ గవర్నర్ తమిళిసై పై ఈసీకి BRS ఫిర్యాదు

image

మాజీ గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌పై ఈసీకి బీఆర్‌ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి జి.కిషన్ రెడ్డికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కాలనీలో తమిళిసై ఎన్నికల ప్రచారం చేశారని, ఆ సమయంలో ఓటర్లకు అయోధ్య రామమందిర నమూనాలను పంపిణీ చేశారన్నారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.

News May 9, 2024

కామారెడ్డి: పోల్‌మేనేజ్‌మెంటుకు రంగం సిద్ధం

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో 3 ప్రధాన పార్టీలు ముఖ్యనేతలను రప్పించి రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, CM రేవంత్ రెడ్డిల బహిరంగ సభను ఈనెల 11న కామారెడ్డిలో ఏర్పాటు చేశారు. పోల్‌మేనేజ్‌మెంట్‌ను పక్కాగా చేపట్టేందుకు అభ్యర్థులు, నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

News May 9, 2024

HYD: మాజీ గవర్నర్ తమిళిసై పై ఈసీకి BRS ఫిర్యాదు

image

మాజీ గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌పై ఈసీకి బీఆర్‌ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి జి.కిషన్ రెడ్డికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కాలనీలో తమిళిసై ఎన్నికల ప్రచారం చేశారని, ఆ సమయంలో ఓటర్లకు అయోధ్య రామమందిర నమూనాలను పంపిణీ చేశారన్నారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.