Telangana

News May 9, 2024

NZB: ఒకే రోజు 2 మీటింగ్లు.. కాంగ్రెస్‌లో ఫుల్ జోష్

image

NZB జిల్లాలో CM రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. NZB లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డికి మద్దతుగా ఆయన బుధవారం ఆర్మూర్, NZBలో ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేవంత్ తన ప్రసంగాలతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని సూచించారు.

News May 9, 2024

పార్లమెంట్ ఎన్నికలపై ముందస్తు భద్రత చర్యలు: ఎస్పీ

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్థులను కట్టడి చేసేందుకు జిల్లా పోలీసు కార్యాచరణ రూపొందించి, నిఘా పెంచి అన్ని కోణాల్లో దృష్టి సారించామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 693 మంది పాత నేరస్థులు, రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని తెలిపారు.

News May 9, 2024

పోస్టల్ బ్యాలెట్ గడువు పొడగింపు: కలెక్టర్ సంతోష్

image

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే వారికి ఈ నెల 10 వరకు గడువును పొడిగించినట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కలెక్టరేట్ ఐడీవోసీ లో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు.

News May 9, 2024

ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి , శంకర నంద్ మిశ్రాలతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో రిటర్నింగ్ అధికారి సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియకు దగ్గర పడుతున్నందున నిబంధనలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

News May 9, 2024

రేపు ఒక్కరోజే వరంగల్ మార్కెట్ ఓపెన్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు(గురువారం) ప్రారంభం కానుంది. నేడు అమావాస్య, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు సెలవు ప్రకటించారు. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. ఉదయం నుంచి మార్కెట్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
గమనిక: శుక్రవారం నుంచి మార్కెట్‌కు వరుసగా 6 రోజులు సెలవులు రానున్నాయి.

News May 9, 2024

నేడు ఆదిలాబాద్ జిల్లాకు మాజీ గవర్నర్ రాక

image

బీజేపీ ఎంపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి ఈ నెల 9న ఆదిలాబాద్ జిల్లాకు మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రానున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గురువారం పట్టణంలోని కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్న సమావేశానికి ఆమె హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి స్టార్ క్యాంపెనర్‌గా ఆమె జిల్లాకు
వస్తున్నట్లు వెల్లడించారు.

News May 9, 2024

హామీలు ఇచ్చి మోసం చేసిన కవిత, అర్వింద్: రేవంత్ రెడ్డి

image

నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఎంపీలుగా కల్వకుంట్ల కవిత, అర్వింద్ ధర్మపురి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం రాత్రి ఆయన నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. వందరోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తామని మాట తప్పిన కవితను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించారిని విమర్శించారు. ఇక ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఐదేళ్లుగా అర్వింద్ మోసం చేశారని ఆరోపించారు.

News May 8, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> చందనగర్ లో 24 గంటలుగా కరెంట్ లేదని బస్తీ వాసుల ఆందోళన
> కాచిగూడలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
> నల్లగుట్టలో మహిళలపై దాడి.. జైలు శిక్ష
> గుడిమల్కాపూర్‌లో కిషన్ రెడ్డి ప్రచారం
> కూకట్‌పల్లిలో సహాయక చర్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్
> గచ్చిబౌలి, నల్లగండ్ల పార్కుల్లో విరిగిపడ్డ చెట్లు
> నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం

News May 8, 2024

హైదరాబాద్‌లో ‘భలే దొంగలు’

image

‘భలే దొంగలు’ సినిమా వలే చోరీల బాటపట్టిన ప్రేమ జంట కటకటాల పాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. అల్వాల్‌లో సువర్ణ అనే మహిళ మెడలోని చైన్‌‌ను ఆదివారం బైక్‌పై వచ్చిన ఇద్దరు అపహరించారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు చింతల్‌లో నివసించే తరుణ్ (23), సౌమ్య(19)గా గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు. జల్సాల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌ చేసినట్లు వెల్లడించారు.

News May 8, 2024

హైదరాబాద్‌లో ‘భలే దొంగలు’

image

చోరీల బాటపట్టిన ప్రేమ జంటను అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల ప్రకారం.. అల్వాల్‌హిల్స్‌‌‌లో సువర్ణ అనే మహిళ మెడలోని చైన్‌‌ను ఆదివారం బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగిలించారు. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు చింతల్‌లో నివసించే తరుణ్ (23), సౌమ్య(19)గా గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు. జల్సాల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌ చేసినట్లు వెల్లడించారు.