Telangana

News May 8, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> చందనగర్ లో 24 గంటలుగా కరెంట్ లేదని బస్తీ వాసుల ఆందోళన
> కాచిగూడలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
> నల్లగుట్టలో మహిళలపై దాడి.. జైలు శిక్ష
> గుడిమల్కాపూర్‌లో కిషన్ రెడ్డి ప్రచారం
> కూకట్‌పల్లిలో సహాయక చర్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్
> గచ్చిబౌలి, నల్లగండ్ల పార్కుల్లో విరిగిపడ్డ చెట్లు
> నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం

News May 8, 2024

హైదరాబాద్‌లో ‘భలే దొంగలు’

image

‘భలే దొంగలు’ సినిమా వలే చోరీల బాటపట్టిన ప్రేమ జంట కటకటాల పాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. అల్వాల్‌లో సువర్ణ అనే మహిళ మెడలోని చైన్‌‌ను ఆదివారం బైక్‌పై వచ్చిన ఇద్దరు అపహరించారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు చింతల్‌లో నివసించే తరుణ్ (23), సౌమ్య(19)గా గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు. జల్సాల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌ చేసినట్లు వెల్లడించారు.

News May 8, 2024

హైదరాబాద్‌లో ‘భలే దొంగలు’

image

చోరీల బాటపట్టిన ప్రేమ జంటను అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల ప్రకారం.. అల్వాల్‌హిల్స్‌‌‌లో సువర్ణ అనే మహిళ మెడలోని చైన్‌‌ను ఆదివారం బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగిలించారు. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు చింతల్‌లో నివసించే తరుణ్ (23), సౌమ్య(19)గా గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు. జల్సాల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌ చేసినట్లు వెల్లడించారు.

News May 8, 2024

కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది: CM

image

కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి నిజామాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. మోదీ మనసునిండా రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనే ఉందన్నారు. బీఆరెస్, బీజేపీ ఒక్కటేనన్నారు.

News May 8, 2024

త్వరలో రైతు భరోసా: తుమ్మల

image

రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశం తర్వాత రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని.. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని వ్యాఖ్యానించారు.

News May 8, 2024

దమ్మపేట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

రోడ్డుపై కోతుల కారణంగా మహిళ మృతిచెందిన సంఘటన దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది. గండుగులపల్లికి చెందిన సునీత(24) అనే మహిళ భర్త పిల్లలతో కలిసి ములకలపల్లి వెళ్తుండగా సుదాపల్లి గ్రామశివారులో రోడ్డుపై ఉన్న కోతుల మంద ఒక్కసారిగా దాడికి యత్నించటంతో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ క్రమంలో సునీత తలకు తీవ్రగాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News May 8, 2024

ఖమ్మం: ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి ఘటన బుధవారం కారేపల్లి మండలం పోలంపల్లి వద్ద చోటు చేసుకుంది. ఎస్సై ఎన్.రాజా రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందుకి చెందిన ముళ్లపాటి శ్రీనివాస్(55) పోలంపల్లి సమీపంలో ఇటుక బట్టి నిర్వహిస్తున్నాడు. ట్రాక్టర్ తీసుకొని ఇంటికి వెళుతుండగా పోలంపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో శ్రీనివాసరావుకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News May 8, 2024

రేపు తొర్రూర్‌కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

image

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు తొర్రూరుకు రానున్నారు. బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్‌కి మద్దత్తుగా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఉ.10 గం.లకు జరిగే ఈ సభను విజయవంతం చేయాలని స్థానిక బీజేపీ శ్రేణులు కోరారు. ఇప్పటికే ఆయనకు రాకకు సంబంధించి ఏర్పాట్లు చేశారు.

News May 8, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✏పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే BJP ఇవ్వలేదు:KTR
✏అమలు కానీ హామీలతో కాంగ్రెస్ మోసం చేసింది: మన్నె శ్రీనివాస్ రెడ్డి
✏సోషల్ మీడియా పోస్టులపై నిఘా:SP గైక్వాడ్
✏BRS ప్రభుత్వం ప్రజలకు తీరని అన్యాయం చేసింది: మంత్రి జూపల్లి
✏MBNR-13,221,NGKL-8,465 మంది ఓటర్ల తొలగింపు
✏BJPతోనే అభివృద్ధి సాధ్యం: భారత్ ప్రసాద్
✏’పాలీసెట్ గడువు పెంపు’..APPLY చేసుకోండి
✏EVM స్ట్రాంగ్ రూమ్ ల అధికారుల పరిశీలన

News May 8, 2024

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి

image

ప్రభుత్వం ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీని చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓటమి భయంతో రైతుబంధును ఆపించాయని , రైతుబంధు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు.