Telangana

News May 8, 2024

దుబ్బాక: ఇంటి గోడలకు నీళ్లు కొడుతుండగా.. కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటికి నీరు పడుతున్న క్రమంలో కరెంట్ షాక్‌తో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం పెద్దచీకోడ్ గ్రామంలో జరిగింది. దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు కొత్త ఇళ్లు కట్టుకుంటున్నారు. ఈ క్రమంలో గోడలకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 8, 2024

NZB: ఆడబిడ్డ పుడితే రూ. 2వేల డిపాజిట్

image

తాడ్వాయి మండలంలోని ఎండ్రియల్‌ గ్రామానికి చెందిన ఓ యువ జంట తమ 10వ వివాహ
వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తమ నిర్ణయంతో ఆడపిల్లకు గౌరవం చేకూరుతుందని దంపతులు రెడ్డిగారి శ్రావణలక్ష్మి,
తిరుపతిరెడ్డిలు చెబుతున్నారు. జనవరి ఒకటి 2024 నుంచి గ్రామంలో జన్మించిన
ప్రతి ఆడపిల్లకి తమ వంతు సహాయంగా తపాలాఖాతా తెరిచి ఒక్కొక్కరికి రూ. 2వేల
నగదును డిపాజిట్‌ చేయనున్నట్లు చెప్పారు. 

News May 8, 2024

బండి సంజయ్ గెలుపు ముందే నిర్ణయమైంది: మోదీ

image

కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని బరిలోకి దింపిందని వేములవాడ సభలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఎలాంటి దర్యాప్తు చేయలేదని చెప్పారు. పీవీ నరసింహరావుకి భారతరత్న ప్రకటించి బీజేపీ గౌరవించిందని తెలిపారు.

News May 8, 2024

జైపూర్‌లో చిరుత పులి అడుగుల గుర్తింపు

image

జైపూర్ మండలంలోని కుందారం జైపూర్ క్రాస్ రోడ్డు సమీప అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. అడవిలో చిరుతపులి అడుగులు గుర్తించినట్లు అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్ కుమార్ తెలిపారు. కుందారం సమీపంలోని అటవీ సంస్థ నీలగిరి ప్లాంటేషన్ వద్ద రెండు రోజుల క్రితం సంచరించిన చిరుత పులి పాదముద్రలు గుర్తించామని పేర్కొన్నారు.

News May 8, 2024

నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌పై బీఆర్ఎస్ గురి..!

image

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సీటుపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఆర్ఎస్పీకి మద్దతుగా ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ కల్వకుర్తి, అచ్చంపేటలో పర్యటించనున్నారు. ఇక్కడ గెలుపుపై సానుకూల పవనాలు ఉన్నట్లు పార్టీ నాయకులు అంటున్నారు.

News May 8, 2024

మోదీని ఓడించి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం: ఆకునూరి మురళీ

image

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోదీని గద్దె దింపుదామని మాజీ ఐఏఎస్ అధికారి, జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళీ అన్నారు. ఓటర్ల చైతన్య బస్సు యాత్ర బుధవారం గజ్వేల్ పట్టణానికి చేరుకుంది. ప్రజా సంక్షేమాన్ని, సుస్థిర అభివృద్ధిని గాలికి వదిలి అధికారం కొరకు విద్వేషాలు రెచ్చగొడుతూ, సమాజాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్న మోదీని ఓడించాలన్నారు.

News May 8, 2024

నిలిచిన నీరు.. రంగంలోకి GHMC ఉన్నతాధికారులు

image

HYDలోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పలుచోట్ల కనీసం రోడ్లపై నడవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ రంగంలోకి దిగారు. నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, త్వరత్వరగా చర్యలు చేపట్టాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

News May 8, 2024

నిలిచిన నీరు.. రంగంలోకి GHMC ఉన్నతాధికారులు

image

HYDలోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పలుచోట్ల కనీసం రోడ్లపై నడవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ రంగంలోకి దిగారు. నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, త్వరత్వరగా చర్యలు చేపట్టాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

News May 8, 2024

HYD: విద్యుత్ శాఖ సిబ్బంది సేవలకు సలాం..!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల పరిధిలో వర్ష బీభత్సం, ఈదురు గాలులకు రాత్రి అనేక చోట్ల కరెంట్ స్తంభించి పోయింది. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. పలు చోట్ల కరెంట్ తీగలు తెగిపడ్డాయి. అనేక చోట్ల విధ్వంసకర పరిస్థితి ఏర్పడింది. విషయాన్ని తెలుసుకున్న విద్యుత్ శాఖ ఇంజినీర్లు, లైన్ మెన్, సిబ్బంది, అధికారులు అర్ధరాత్రి నిద్రహారాలు మాని ప్రజలకు కరెంట్ పునరుద్ధరించడంలో నిమగ్నమయ్యారు.

News May 8, 2024

HYD: విద్యుత్ శాఖ సిబ్బంది సేవలకు సలాం..!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల పరిధిలో వర్ష బీభత్సం, ఈదురు గాలులకు రాత్రి అనేక చోట్ల కరెంట్ స్తంభించి పోయింది. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. పలు చోట్ల కరెంట్ తీగలు తెగిపడ్డాయి. అనేక చోట్ల విధ్వంసకర పరిస్థితి ఏర్పడింది. విషయాన్ని తెలుసుకున్న విద్యుత్ శాఖ ఇంజినీర్లు, లైన్ మెన్, సిబ్బంది, అధికారులు అర్ధరాత్రి నిద్రహారాలు మాని ప్రజలకు కరెంట్ పునరుద్ధరించడంలో నిమగ్నమయ్యారు.