India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో శ్వేతారెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. శ్వేతా రెడ్డి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిరుపేదల పక్షపాతిగా ప్రజల కోసం పోరాడిన గొప్ప ప్రజాపోరాట యోధుడిని ఈ దేశం కోల్పోయిందన్నారు. విలువలు,సిద్ధాంతాల కోసం తన రాజకీయ ప్రస్థానాన్ని చివరి వరకు కొనసాగించిన సీతారం ఏచూరి ఆదర్శప్రాయులని తెలిపారు.ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈరోజు ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఒడిస్సా రాజధాని భువనేశ్వర్లో ఆయన మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో సమావేశమయ్యారు. షెడ్యూల్డ్ తెగల సమస్యలపై సమావేశం నిర్వహించి, పలు కీలక విషయాల గురించి చర్చించారు. ఆయనకు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
భారత్-ఇరాన్ పర్యాటక సహకారమే లక్ష్యంగా ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో సాంస్కృతిక, చారిత్రక, సహజ వైవిధ్యాన్ని తెలిపేలా ఇరాన్ టూరిజం శాఖ హైదరాబాద్లోని ఓ హోటల్లో గురువారం రోడ్షో నిర్వహించింది. ఇరాన్ టూరిజం ఉపమంత్రి అలీ అస్గర్ షాల్బాఫియాన్, తెలంగాణ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. జనవరి 2024 నుంచి భారతీయులకు ప్రతీ 6 నెలల్లో 15 రోజుల పాటు వీసా రహిత ప్రయాణాన్ని ఇరాన్ ప్రకటించింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గురువారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా కానాయిపల్లి 31.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా గట్టులో 30.5 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాల్ 29.5 డిగ్రీలు, నారాయణపేట జిల్లా గుండుమల్ లో 29.0 ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 29.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలం జలాశయంలో 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 1,38,833 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,24,017 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని వివరించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎంల)ను భద్రపరిచిన గోదాములను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను కలెక్టర్ పరిశీలించారు.
వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయంలో 5నెలలు (1-4-2024 నుంచి 10-9-2024) వరకు భక్తులు అమ్మవారికి సమర్పించిన 65 క్వింటాళ్ల ఒడి బియ్యంను బుధవారం బహిరంగ వేలం నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ బహిరంగ వేలంలో ముగ్గురు పాటదారులు పాల్గొనగా రూ.1,05,000కు రమేశ్ హెచ్చు పాటదారుగా టెండర్ పొందారన్నారు. ఈ బహిరంగ వేలం దేవాదాయ శాఖ పరిశీలకుడు సంజీవరెడ్డి, ఈఓ శేషు భారతి, తదితరులున్నారన్నారు.
నాగార్జునసాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పట్టడంతో క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 71,001 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 43,334 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.70 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.1486 టీఎంసీల నీరు ఉన్నట్లు తెలిపారు.
సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరమగ్గాల పరిశ్రమకు త్వరలో పనులు రానున్నాయి. స్వశక్తి సంఘాల మహిళలకు చీరల కోసం రూ.1.30 కోట్ల చీరల ఆర్డర్లు ఇవ్వబోతున్నట్లు సీఎం ఇటీవల ప్రకటించడంతో నేతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పాత బకాయిలు కూడా విడుదల అవుతుండటంతో పరిశ్రమకు మంచి రోజులు వస్తున్నాయని నేతన్నలు భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.