Telangana

News May 8, 2024

ఖమ్మం: మండుటెండలోనూ.. తగ్గేదేలే!

image

మండుటెండను లెక్కచేయకుండా లోక్​ సభకు పోటీ చేసే అభ్యర్థులతో పాటు ప్రధానపార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి 4 రోజులే టైం ఉండడంతో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్​ అభ్యర్థి రాఘురాంరెడ్డి, బీఆర్ఎస్​ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి వినోదరావులు తమ గెలుపుకు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

News May 8, 2024

పట్టభద్రుల స్థానానికి 14 నామినేషన్లు

image

వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మంగళవారం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, తెలంగాణ సకల జనుల పార్టీ నందిపాటి జానయ్య, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్ పార్టీ ఈడ శేషగిరిరావు, శ్రమజీవి పార్టీ జాజుల భాస్కర్, యువతరం పార్టీ నుంచి బండారు నాగరాజు నామినేషన్లు సమర్పించారు. అలాగే, మిగతా వారు స్వతంత్రులుగా నామినేషన్ వేశారు.

News May 8, 2024

HYD: బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి

image

HYD బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

News May 8, 2024

HYD: బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి

image

HYD బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

News May 8, 2024

ADB: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి

image

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. కుబీర్ మండలం పాంగ్రా గ్రామానికి చెందిన ఉట్నూరు దత్తాత్రి(46) ఆదివారం చేపల వేటకని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం లింగా గ్రామ శివారులో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తికి దత్తాత్రి మృతదేహం కనిపించింది. దీంతో భైంసా రూరల్ ఎస్సై ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

News May 8, 2024

HYD: ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలి: రోనాల్డ్ రాస్

image

ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. GHMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతం వారైనా, ఇతర రాష్ట్రాల వాసులైనా నగరంలో ఓటు ఉన్నవారు, ఇక్కడే ఓటు వేయాలని సూచించారు. రెండు ప్రాంతాల్లో ఓటు హక్కును కలిగి ఉండటం చట్ట విరుద్ధమని, అలాంటి వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

News May 8, 2024

ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షల వలస ఓటర్లు !

image

పాలమూరు అంటేనే వలసలకు చిరునామాగా పేరొందిన జిల్లా. ఈ జిల్లా నుంచి సుదూర ప్రాంతాలైన ముంబై, పుణె, సోలాపూర్, భీమండి ప్రాంతాలతోపాటు హైదరాబాద్, ఇతర ప్రధాన పట్టణాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కొందరు కుటుంబాలతో సహా అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో సుమారు 3.5 లక్షల మంది వలస ఓటర్లు ఉన్నట్లు అధికారుల అంచనా వేశారు.

News May 8, 2024

HYD: ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలి: రోనాల్డ్ రాస్ 

image

ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. GHMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతం వారైనా, ఇతర రాష్ట్రాల వాసులైనా నగరంలో ఓటు ఉన్నవారు, ఇక్కడే ఓటు వేయాలని సూచించారు. రెండు ప్రాంతాల్లో ఓటు హక్కును కలిగి ఉండటం చట్ట విరుద్ధమని, అలాంటి వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

News May 8, 2024

MBNR-13,221, NGKL-8,465 మంది ఓటర్ల తొలగింపు

image

ఉమ్మడి జిల్లాలో చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగిస్తూ తుది జాబితాను విడుదల చేశారు. MBNR లోక్ సభ పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 6,713 మంది పురుషులు, 6,508 మంది స్త్రీలు మొత్తం కలిపి 13,221 మంది ఓట్లు తీసేశారు. NGKL లోక్ సభ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. 4,480 మంది పురుషులు, 3,983 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు మొత్తం 8,465 మందిని జాబితా నుంచి తొలగించారు.

News May 8, 2024

BJP, BRS కావాలనే రైతు భరోసా ఆపించాయి: మంత్రి కోమటిరెడ్డి

image

బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలకు రైతులు బలవుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీయాల కోసం నోటికాడి బుక్కను లాక్కోవడం సరికాదని ఆయన ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం చెప్పిన టైమ్​కు రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసింది. ‘అకౌంట్లలో డబ్బులు పడ్తున్నాయని రైతులు సంతోషపడే లోపలే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిధులు ఆపేలా కుట్రలు చేయడం బాధాకరం’ అని మంత్రి అన్నారు