Telangana

News May 8, 2024

ఖమ్మం జిల్లాలో వర్షం బీభత్సం

image

ఖమ్మం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం నుంచి ప్రతిరోజు ఈదురుగాలులు, వడగళ్ల వర్షం కురుస్తుంది. దీంతో చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లుతోంది. పలుచోట్ల ఇళ్ల కప్పులు లేచిపోవడమే కాక విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలడంతో ఆస్తి నష్టం జరుగుతోంది. మంగళవారం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో 309 విద్యుత్ స్తంభాలు, తొమ్మిది ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.

News May 8, 2024

దుబ్బాకలో చెల్లని నోటు.. మెదక్‌ పార్లమెంట్‌లో చెల్లుతదా: కేసీఆర్‌

image

వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మెదక్‌లో KCR రోడ్‌షో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపింది. మెదక్‌ జిల్లా, ప్రభుత్వ వైద్యకళాశాల, రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటును గుర్తుచేసిన KCR.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త హామీలు ఇవ్వకపోగా BRS మంజూరు చేసిన వాటిని రద్దు చేస్తోందని విమర్శించారు. ‘BJP అభ్యర్థి రఘునందన్ మాట్లాడేవన్ని అబద్ధాలే. దుబ్బాకలో చెల్లని నోటు మెదక్‌లో చెల్లుతదా’ అని ప్రశ్నించారు.

News May 8, 2024

HYD: నేడు చంచల్‌గూడ జైలుకు KTR.. క్రిశాంక్‌తో ములాఖత్‌

image

HYD చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న BRS పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ క్రిశాంక్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR పరామర్శించనున్నారు. ఈ మేరకు ములాఖత్‌ కోసం జైలు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యూలర్‌ మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేశాడనే కేసులో క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు ఈనెల 1న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

News May 8, 2024

వరంగల్: తారాస్థాయికి ప్రచారం!

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఇంకా 3 రోజులే సమయం ఉండటంతో ప్రజలతో మమేకమడం అభ్యర్థులకు కష్టంగా మారింది. WGL లోక్‌సభ పరిధిలో 18.24 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా, సర్వే ఏజెన్సీలపై ఆధారపడుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అభ్యర్థుల వాయిస్‌లతో ఓటర్లకు సందేశాలు పంపిస్తున్నారు. ‘హలో.. మీ ఓటు ఎవరికీ?’ అని ఫోన్లకు కాల్ చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.

News May 8, 2024

HYD: నేడు చంచల్‌గూడ జైలుకు KTR.. క్రిశాంక్‌తో ములాఖత్‌

image

HYD చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న BRS పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ క్రిశాంక్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR పరామర్శించనున్నారు. ఈ మేరకు ములాఖత్‌ కోసం జైలు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యూలర్‌ మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేశాడనే కేసులో క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు ఈనెల 1న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

News May 8, 2024

నిర్మల్: ఉద్యోగాల పేరిట బురిడీ

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను ఓ మహిళ మోసం చేసిన ఘటన నిర్మల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ. 2-10లక్షల వరకు వసూలు చేసింది. ఆమె ఇచ్చిన ఆర్డర్ కాపీలతో ఉద్యోగాల్లో చేరేందుకు వెళ్లగా జరిగిన మోసం తెలుసుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే నకిలీ చెక్కులు రాసిచ్చి తప్పించుకుని తిరుగుతోందని బాధితులు వాపోతున్నారు.

News May 8, 2024

నేడు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

image

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా వస్తున్నారు. ఆర్మూర్‌‌లో సాయంత్రం 5 గంటలకు, నిజామాబాద్‌ నెహ్రూపార్క్ చౌరస్తాలో రాత్రి 7గంటలకు నిర్వహించే కార్నర్ సమావేశాల్లో ప్రసంగిస్తారు. అంతకు ముందు గోల్‌హమ్మన్ చౌరస్తా నుంచి ఆర్యసమాజ్, పెద్దబజార్, ఆజాం రోడ్డు, పోస్టాఫీస్ మీదుగా నెహ్రూపార్క్ వరకు రోడ్డు షో ఉంటుంది. సీఎం ఇప్పటికే రెండు సార్లు పర్యటించగా ఇది మూడోది.

News May 8, 2024

MBNR: ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ ఉదయం ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు అడ్డాకుల సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 8, 2024

ఆందోల్: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

image

పిడుగు పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆందోల్ మండలం ఎర్రారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల సమాచారం.. గ్రామానికి చెందిన బోయిని పాపయ్య(50) గ్రామ శివారులో పశువులను మేపుతున్నారు. సాయంత్రం తిరిగి వస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో పాపయయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

News May 8, 2024

BREAKING: HYD: బాచుపల్లి ప్రమాదంలో మృతులు వీరే..!

image

HYD బాచుపల్లి PS పరిధి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు మృతిచెందగా నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. కాగా మృతులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు చెందిన తిరుపతి(20), శంకర్(22), రాజు(25), ఖుషి, రామ్ యాదవ్(34), గీత (32), హిమాన్షు(4)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను జేసీబీల సహాయంతో వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు బాచుపల్లిలోని మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.