India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారతీయ జనతా పార్టీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ఖానాపూర్కు రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి ,రాష్ట్ర నాయకులు రితిష్ రాథోడ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక జంగల్ హనుమాన్ ఆలయం నుంచి ఖానాపూర్ బస్టాండ్ వరకు నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై ఆయన పర్యటనను జయప్రదం చేయాలని కోరారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)-2024కు మొత్తం 43,557 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కు 17,608 మంది, పేపర్-2కు 25,959 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కు అత్యధికంగా NGKL జిల్లా నుంచి 4,453 మంది, పేపర్-2కు అత్యధికంగా 7,688 మంది MBNR నుంచి దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
రఘురాంరెడ్డిని ఎంపీగా గెలిపిస్తే ఖమ్మం ప్రజలను తన కుతూరు లాగా జాగ్రత్తగా చూసుకుంటారని సినీ హీరో వెంకటేశ్ అన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైనవారు డైలాగ్ చెప్పాలని కోరగా, ‘డైలాగ్లు సినిమాలకే పరిమితం. ఇప్పుడంతా ఒకటే డైలాగ్. 13న పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. రఘురాం రెడ్డికి ఓటెయ్యాలి. అంతే..!’ అని తనదైన శైలిలో చెప్పారు
పార్లమెంట్ ఎన్నికలకు ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు మే 8న సాయంత్రం 5 గంటల లోపు IDOC లోని ఫేసిలీటేశన్ సెంటర్ లో ఓటు వేయాలని ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి యం నగేష్ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలట్ కొరకు ఇదివరకే ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారు రేపు సాయంత్రంలోగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో కలిపి ఏకంగా 53,80,594 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,10,36,044 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో ఇతరులు 1138 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 51 శాతం ఉన్నట్లుగా పేర్కొన్నారు. 48 శాతం మహిళా ఓటర్లు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు వారిని ఆకట్టుకునేలా ప్రచారాలు చేస్తున్నారు.
HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో కలిపి ఏకంగా 53,80,594 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,10,36,044 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో ఇతరులు 1138 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 51 శాతం ఉన్నట్లుగా పేర్కొన్నారు. 48 శాతం మహిళా ఓటర్లు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు వారిని ఆకట్టుకునేలా ప్రచారాలు చేస్తున్నారు.
అకాల వర్షం రాజధానిని అతలాకుతలం చేసింది. సాయంత్రం మొదలైన గాలివాన మిడ్నైట్ వరకు ముప్పుతిప్పలు పెట్టింది. విరిగి పడుతున్న చెట్ల కొమ్మలు, పొంగుతున్న మ్యాన్హోల్స్, కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ను దాటి ఎట్టకేలకు ఇళ్లకు చేరిన ఉద్యోగుల బాధ వర్ణణాతీతం. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో GHMC సిబ్బంది, HYD ట్రాఫిక్ పోలీసులు ఎంతో కష్టపడ్డారు. భారీ వర్షంలో తడుస్తూనే వరదను నాలాలకు మళ్లించారు. మీ సేవలకు సలాం.
అకాల వర్షం రాజధానిని అతలాకుతలం చేసింది. సాయంత్రం మొదలైన గాలివాన మిడ్నైట్ వరకు ముప్పుతిప్పలు పెట్టింది. విరిగి పడుతున్న చెట్ల కొమ్మలు, పొంగుతున్న మ్యాన్హోల్స్, కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ను దాటి ఎట్టకేలకు ఇళ్లకు చేరిన ఉద్యోగుల బాధ వర్ణణాతీతం. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో GHMC సిబ్బంది, HYD ట్రాఫిక్ పోలీసులు ఎంతో కష్టపడ్డారు. భారీ వర్షంలో తడుస్తూనే వరదను నాలాలకు మళ్లించారు. మీ సేవలకు సలాం.
BRS అధినేత, మాజీ సీఎం KCR రోడ్ షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ZHB లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన రోడ్ షో, బస్సు యాత్ర పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. ఆయన ప్రసంగం మొదలు పెట్టినప్పటి నుంచి ముగిసే వరకు నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్లకు సంబంధించిన కంట్రోల్ యూనిట్స్ సప్లమెంటరీ సెకండ్ ర్యాండమైజేషన్ను మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రెండో ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రక్రియ నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.