Telangana

News January 11, 2026

నిజామాబాద్: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు సాయి ప్రసన్న

image

జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారిని సాయి ప్రసన్న ఎంపికైంది. సబ్ జూనియర్ 32 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడంతో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో సాయి ప్రసన్న పాల్గొననుంది.

News January 11, 2026

నిజామాబాద్: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు సాయి ప్రసన్న

image

జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారిని సాయి ప్రసన్న ఎంపికైంది. సబ్ జూనియర్ 32 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడంతో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో సాయి ప్రసన్న పాల్గొననుంది.

News January 11, 2026

ఫ్యూచర్ సిటీ భూములు.. రైతులకు ఇవ్వాలని డిమాండ్!

image

గత ప్రభుత్వం సేకరించిన 19,333 ఎకరాల ఫార్మా సిటీ భూములను ప్రస్తుత ప్రభుత్వం ‘ఫ్యూచర్ సిటీ’గా మార్చడం న్యాయపరమైన వివాదాలకు దారితీస్తోంది. ఒక నిర్దిష్ట ‘ప్రజా ప్రయోజనం’ కోసం సేకరించిన భూమిని ఇతర వాణిజ్య అవసరాలకు మళ్లించడంపై 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిర్దేశిత ప్రాజెక్టును రద్దు చేసినప్పుడు, ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది.

News January 10, 2026

వరంగల్ చౌరస్తాలో దారి తప్పిన బాలుడు

image

వరంగల్ నగరంలో శనివారం సాయంత్రం వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ఓ బాలుడు ఒంటరిగా తిరుగుతూ కనిపించాడు. పేరు అడగగా తన పేరు ‘రేయాన్’ అని మాత్రమే చెప్పాడు. చిరునామా, కుటుంబ వివరాలు చెప్పలేకపోయాడని పోలీసులు చెప్పారు. బాలుడిని గుర్తించిన వారు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని లేదా ఇంతజారుగంజ్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

News January 10, 2026

అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలకృష్ణ

image

అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ప్రకటించారు. అన్విత గ్రూప్ రూపొందించిన బ్రాండ్ ఫిల్మ్స్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంతో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో బాలకృష్ణ చేసిన సేవలు సమాజానికి ఆదర్శమని అచ్యుతరావు అన్నారు.

News January 10, 2026

NZB: సంక్రాతి సెలవులకు ఊర్లకు వెళ్లే వారికి ముఖ్య సూచనలు

image

సంక్రాంతి సెలవులకు సొంత గ్రామాలకు వెళ్లే వారికి నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ముఖ్య సూచనలు చేశారు. ఖరీదైన వస్తువులు, డబ్బు, బంగారం బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. ఊర్లకు వెళ్లే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దన్నారు. ఇంటికి బలమైన తాళాలు, సెంట్రల్ లాకింగ్ ఉపయోగించాలన్నారు. సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు.

News January 10, 2026

ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందించాలి: Dy.CM భట్టి

image

తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని Dy.CM భట్టి విక్రమార్క కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన భేటీలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే కేంద్ర లక్ష్యాన్ని అభినందిస్తూనే, రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. విభజన హామీలు,పెండింగ్ నిధులపై కూడా చర్చించారు.

News January 10, 2026

రాష్ట్ర అండర్-17 ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా నల్గొండ వాసి

image

అనుముల మండలంలోని హాలియా పట్టణానికి చెందిన చింతలచెరువు తేజు తెలంగాణ రాష్ట్ర అండర్-17 ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 12 నుంచి 16 వరకు హరియాణాలో జరిగే 69వ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఆయన జట్టుకు నాయకత్వం వహించనున్నారు. గత నవంబర్‌లో నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను తేజుకు ఈ గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో రాణించాలని పలువురు ఆకాంక్షించారు.

News January 10, 2026

ప్రజావాణికి పెద్ద శంకరంపేటలో కలెక్టర్ హాజరు

image

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం (జనవరి 12) పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజలకు దూరభారం, ఖర్చులు తగ్గించేందుకు ఈ వినూత్న విధానం చేపట్టామని, ప్రతి వారం ఒక మండలంలో కలెక్టర్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 10, 2026

పండక్కి ఊరెళ్తున్నారా?.. జాగ్రత్తలు తప్పనిసరి: సీపీ సునీల్ దత్

image

ఖమ్మం: సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. విలువైన నగదు, బంగారాన్ని వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని కోరారు. ఇంటికి తాళం వేసినప్పుడు ఇరుగుపొరుగు వారికి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రి గస్తీ ముమ్మరం చేశామని, అనుమానితులు కనిపిస్తే వెంటనే ‘100’కు డయల్ చేయాలని తెలిపారు.