India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి తరఫున ఖమ్మంలో నేడు సినీ హీరో వెంకటేశ్ ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన ఇప్పటికే ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనతో భేటి అయ్యారు. సాయంత్రం 5 గంటలకి ఖమ్మంలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదుట నేడు పలువురు ఆందోళన చేపట్టారు. తన ప్రమేయం లేకుండా అబార్షన్తో పాటు గర్భసంచి తోలగించారంటూ తన బంధువులతో ఆస్పత్రి ప్రధానద్వారం ముందు కూర్చుని బాధితురాలు నిరసన తెలిపింది. ఆస్పత్రి డాక్టర్, యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి విద్యార్ధి సంఘం నేతలు మద్దతు తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటిలాగే తటస్థంగా ఉంది. సోమవారం రూ.6,725 పలికిన క్వింటా పత్తి .. ఈరోజు సైతం రూ.6,725 ధరే పలికింది. రైతులు తమ సరుకులను మార్కెట్ తరలించే సమయంలో పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకుని తమ సరుకులను మార్కెట్కు తీసుకురావాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మహిళల పోలింగ్ శాతం తగ్గితే ఫలితాలపై ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. NLG లోక్ సభ పరిధిలో 17,18,954 ఓట్లకుగానూ 8,76,538 మహిళా ఓటర్లున్నారు. BNG లోక్ సభ పరిధిలో 17,98,704 ఓట్లకు గాను 9,04,250 మంది మహిళా ఓటర్లు ఉండడం విశేషం. ఈ రెండు లోక్ సభ స్థానాల్లో అభ్యర్థుల తల రాతలు మార్చే శక్తి మహిళా ఓటర్లకే ఉందన్న
చర్చ జోరుగా సాగుతుంది.
మనోహరాబాద్ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ మహమ్మద్ సాహెల్ (24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. సాహెల్ మూడు సంవత్సరాల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించకపోగా.. వేరే సంబంధం చూసి పెళ్లికి నిశ్చయించారు. దాంతో మనస్తాపానికి గురైన సాహెల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న పాలకూరి అశోక్ కుమార్ తన మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్యను పెంచేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే GO-46 బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా జూన్లో నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ తక్షణమే ప్రకటించేలా పోరాడుతానని పేర్కొన్నారు.
HYD ప్రజలకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా రామోజీ ఫిలిం సిటీ పాసెస్ అందుబాటులోకి తేనున్నట్లుగా పేర్కొన్నారు. రామోజీ ఫిలిం సిటీలోని సినీ, ప్రకృతి అందాలను వీక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా.. మెట్రో అధికారులు ఎలాంటి ఫెసిలిటీలతో ఫిలిం సిటీ పాస్ అందిస్తారని సర్వత్రా ఆసక్తిగా మారింది.
HYD ప్రజలకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా రామోజీ ఫిలిం సిటీ పాసెస్ అందుబాటులోకి తేనున్నట్లుగా పేర్కొన్నారు. రామోజీ ఫిలిం సిటీలోని సినీ, ప్రకృతి అందాలను వీక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా.. మెట్రో అధికారులు ఎలాంటి ఫెసిలిటీలతో ఫిలిం సిటీ పాస్ అందిస్తారని సర్వత్రా ఆసక్తిగా మారింది.
పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అనువర్తించిన గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుందన్నారు.
మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ గెలుపును ఆకాంక్షిస్తూ అమెరికా కాలిఫోర్నియా పట్టణంలో పలువురు యువకులు ఫ్లెక్సీతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు బలరాం నాయక్ అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బలరాం నాయక్ను మహబూబాబాద్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.