India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD ప్రజలకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా రామోజీ ఫిలిం సిటీ పాసెస్ అందుబాటులోకి తేనున్నట్లుగా పేర్కొన్నారు. రామోజీ ఫిలిం సిటీలోని సినీ, ప్రకృతి అందాలను వీక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా.. మెట్రో అధికారులు ఎలాంటి ఫెసిలిటీలతో ఫిలిం సిటీ పాస్ అందిస్తారని సర్వత్రా ఆసక్తిగా మారింది.
HYD ప్రజలకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా రామోజీ ఫిలిం సిటీ పాసెస్ అందుబాటులోకి తేనున్నట్లుగా పేర్కొన్నారు. రామోజీ ఫిలిం సిటీలోని సినీ, ప్రకృతి అందాలను వీక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా.. మెట్రో అధికారులు ఎలాంటి ఫెసిలిటీలతో ఫిలిం సిటీ పాస్ అందిస్తారని సర్వత్రా ఆసక్తిగా మారింది.
పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అనువర్తించిన గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుందన్నారు.
మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ గెలుపును ఆకాంక్షిస్తూ అమెరికా కాలిఫోర్నియా పట్టణంలో పలువురు యువకులు ఫ్లెక్సీతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు బలరాం నాయక్ అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బలరాం నాయక్ను మహబూబాబాద్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారంతో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు తగ్గాయి. తేజ రకం మిర్చికి నిన్న క్వింటాకు రూ.17,100 పలకగా, ఈరోజు రూ.16,600కు తగ్గింది. 341 రకం మిర్చి నిన్న రూ.16 వేల ధర పలకగా.. ఈరోజు రూ.13,500 పలికింది. వండర్ హాట్(WH) రకం మిర్చి నిన్నటిలాగే రూ.14వేలు, 5531 రకం మిర్చి నిన్నటిలాగే రూ.12 వేల ధర వచ్చింది. నిన్న రూ.35,500 పలికిన టమాటా మిర్చి ధర ఈరోజు రూ.32వేలకు పడిపోయింది.
సినీ హీరో విక్టరీ వెంకటేశ్ మంగళవారం ఖమ్మానికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఆయనకు పొంగులేటి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం నగరంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
2024-25 విద్యా సం.నికి సంబంధించి డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ సహాయ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. డిగ్రీలో ప్రవేశాల కోసం ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దోస్త్ రిజిస్ట్రేషన్ సంబంధిత అనుమానాల నివృత్తి కోసం ఈ కేంద్రం సేవలను ఉపయోగించుకోవాలని దోస్త్ కోఆర్డినేటర్ నర్సింగరావు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటలకు వేములవాడ పట్టణంలోని జగిత్యాల బైపాస్ రోడ్డులో కోర్టు పక్కన గల మైదానంలో సభ కొనసాగుతుందని చెప్పారు. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచార వాహనాలు వీధుల్లో తిరుగుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారం కొనసాగిస్తున్నారు. మే 13న పోలింగ్ ఉన్నందున 48 గంటల ముందుగానే ప్రచారం ముగించాలి. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల వరకు మైకులు కట్టేయాలి. ఎన్నికల నిబంధనలు ఎవరైనా విస్మరిస్తే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోనుంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చాలా వరకు నోటా వైపు వెళ్లారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు వెయ్యి మంది ఓటర్లు నోటాకు మద్దతు ఇచ్చారు. అత్యధికంగా అచ్చంపేట నియోజకవర్గంలో 2,833 మంది నోటాకు ఓటు వేశారు. అత్యల్పంగా కల్వకుర్తి నియోజకవర్గంలో 661 మంది నోటాకు ఓటు వేశారు.
Sorry, no posts matched your criteria.