Telangana

News May 7, 2024

కరీంనగర్: 18-39 ఏళ్ల వారే కీలకం!

image

కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయడంలో యువ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి యువ ఓటర్ల పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 29 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 45% పైగా 18-39 ఏళ్లు ఉన్న వారే కావడంతో తమకు అనుకూలంగా మళ్లించుకునే దిశగా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.

News May 7, 2024

HYD: ‘గడిచిన 24 గంటల్లో రూ.15,70,000 నగదు సీజ్’

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా HYDలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.15,70,000 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.7,57,711 విలువ గల ఇతర వస్తువులు, 127.58 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, 11 మందిపై కేసులు నమోదు చేశామని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News May 7, 2024

HYD: ‘గడిచిన 24 గంటల్లో రూ.15,70,000 నగదు సీజ్’

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా HYDలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.15,70,000 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.7,57,711 విలువ గల ఇతర వస్తువులు, 127.58 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, 11 మందిపై కేసులు నమోదు చేశామని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News May 7, 2024

KMM: బీఫామ్ అందుకున్న తీన్మార్ మల్లన్న

image

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల MLC ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేయగా.. ఈరోజు CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. పట్టభద్రులు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

News May 7, 2024

తీన్మార్ మల్లన్నకు బీ-ఫామ్ అందజేసిన సీఎం

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సీఎం రేవంత్ రెడ్డి బీ-ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తామని, తనను గెలిపించేందుకు పట్టభద్రులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. శాసనమండలిలో పట్టభద్రుల గొంతుకనై గళం విప్పుతానన్నారు.

News May 7, 2024

వేములవాడకు మోదీ రాక.. ఆలయంలో భద్రతా చర్యలు

image

సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి బుధవారం ప్రధాని మోదీ రానున్నారు. ఈ సందర్భంగా మంగళవారం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రక్షణ చర్యల్లో భాగంగా రెండు గంటల పాటు భక్తులను పోలీసులు దర్శనానికి అనుమతించలేదు. అనంతరం భక్తులు యధావిధిగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. మూడు రోజుల నుంచి పోలీస్ సిబ్బంది మోదీ రక్షణ చర్యల నిమిత్తం ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

News May 7, 2024

HYD: ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పీజీ

image

HYD తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏడాది పాటు ఈ కోర్స్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మే 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యూనివర్సిటీకి వచ్చి ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని, మిగతా వివరాలకు https://www.efluniversity.ac.in సంప్రదించాలని పేర్కొన్నారు.

News May 7, 2024

HYD: ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పీజీ

image

HYD తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏడాది పాటు ఈ కోర్స్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మే 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యూనివర్సిటీకి వచ్చి ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని, మిగతా వివరాలకు https://www.efluniversity.ac.in సంప్రదించాలని పేర్కొన్నారు.

News May 7, 2024

యాదగిరిగుట్టకు ఈ నెల 9న @KTR

image

యాదగిరిగుట్టకు ఈ నెల 9న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను గెలిపించాలని కోరుతూ.. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ముందుగా పట్టణంలో బైక్ ర్యాలీ ఉంటుందని, అనంతరం కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తారని అన్నారు. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారుు.

News May 7, 2024

సీఎం రేవంత్ రెడ్డి నర్సాపూర్ పర్యటన రద్దు

image

నర్సాపూర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు నిర్వహించాల్సిన పర్యటన రద్దయింది. ఈరోజు సాయంత్రం 5 గం.కు జనజాతర సభ నిర్వహించేందుకు సీఎం రావాల్సి ఉండగా.. రద్దు చేశారు. ఈనెల 9న ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభను రద్దు చేశారు. నేడు సీఎం సభ, 9న రాహుల్ గాంధీ సభ‌లను రెండు రోజుల నిర్వహించడం ఇబ్బందిగా ఉండడంతో.. రద్దు చేసినట్లు సమాచారం.