Telangana

News May 7, 2024

జనగామ: బాలుడికి బైక్ ఇచ్చిన యజమానికి జైలు శిక్ష

image

బాలుడికి బైకు ఇచ్చిన యజమానికి జైలు శిక్ష పడిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. ఈ నెల 2న నర్మెట్టలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా.. రఘునాథపల్లి మండలం మేకలగట్టుకి చెందిన 15 ఏళ్ల బాలుడు బైకు నడుపుతూ పట్టుబడ్డాడు. బైకు ఇచ్చిన యజమాని ధరావత్ ప్రవీణ్‌పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టులో హాజరుపర్చగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ రూ.1000 జరిమానా, 2 రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్సై తెలిపారు.

News May 7, 2024

NLG: భారీ వర్షం.. ఇదీ పరిస్థితి..!

image

జిల్లాలో అకాల వర్షాలు రైతన్నలకు అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా సాగుతున్న మామిడి, అరటి తోటల పై ఈదురుగాలుల ప్రభావం పడింది. జిల్లాలోని సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూరు ఎస్, పెన్పహాడ్, మద్దిరాల, నాగారం తదితర మండలాల్లో ఎక్కువగా మామిడి తోటలకు నష్టం చేకూరింది. మామిడికాయలు తెంపే సమయంలో ఈదురుగాలులు వీచడంతో కాయలు అధికంగా నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

News May 7, 2024

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,332 కేసులు నమోదు

image

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,332 కేసుల్లో రూ.9,39,42,041 కోట్ల నగదుతో సహా మొత్తం రూ.41,81,11,904 విలువ చేసే బంగారు ఆభరణాలు, మద్యం సీసాలు, డ్రగ్స్ సీజ్ చేశారు. వీటిలో 8652 గ్రాముల బంగారం, 48,900 గ్రాముల వెండి, 48,810 లీటర్ల మద్యం పట్టుబడింది. రూ.50 లక్షలకు పైగా విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News May 7, 2024

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,332 కేసులు నమోదు

image

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,332 కేసుల్లో రూ.9,39,42,041 కోట్ల నగదుతో సహా మొత్తం రూ.41,81,11,904 విలువ చేసే బంగారు ఆభరణాలు, మద్యం సీసాలు, డ్రగ్స్ సీజ్ చేశారు. వీటిలో 8652 గ్రాముల బంగారం, 48,900 గ్రాముల వెండి, 48,810 లీటర్ల మద్యం పట్టుబడింది. రూ.50 లక్షలకు పైగా విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News May 7, 2024

MBNR: పెరిగిన దూకుడు.. క్లైమాక్స్‌కు ఎన్నికల ప్రచారం!

image

ఎన్నికల ప్రచారాలు క్లైమాక్స్ దశకు చేరుకుంటున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న MBNR, NGKLపార్లమెంటు నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గెలుపునకు మాత్రం BJP, కాంగ్రెస్, BRS అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడుతున్నారు. ఈనెల11 వరకూ ప్రచారం ముగియనుండటంతో, ప్రచారంలో దూకుడుగా వెళుతున్నారు. ఇంటింటికి వెళుతూ ప్రతి ఓటరును కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు.

News May 7, 2024

BREAKING: HYD: అల్వాల్‌లో MURDER

image

HYD అల్వాల్‌లో దారుణ హత్య ఘటన ఈరోజు వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అల్వాల్ పరిధి భారతినగర్‌లో అర్ధరాత్రి బావమరిది యుగంధర్‌ను బావ సుబ్రహ్మణ్యం బండరాయితో కొట్టి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న యుగంధర్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. సుబ్రహ్మణ్యం పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

News May 7, 2024

BREAKING: HYD: అల్వాల్‌లో MURDER

image

HYD అల్వాల్‌లో దారుణ హత్య ఘటన ఈరోజు వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అల్వాల్ పరిధి భారతినగర్‌లో అర్ధరాత్రి బావమరిది యుగంధర్‌ను బావ సుబ్రహ్మణ్యం బండరాయితో కొట్టి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న యుగంధర్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. సుబ్రహ్మణ్యం పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

News May 7, 2024

బీఫార్మసీ, బీపీఈడీ ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఫార్మసీ, బీపీఈడీ పరీక్ష ఫలితాలు విడదలయ్యాయని యూనివర్శిటీ పరీక్షల నియంత్రణాధికారి డా. శ్రీరంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ 1,2,7,8వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు, బీపీఈడీ 1, 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలు వెబ్‌సైట్ www.satavahana.ac.inలో అందుబాటులో ఉన్నాయన్నారు.

News May 7, 2024

HYD: తెలంగాణలో కొడంగల్ ఒక్కటే ఉందా?: లక్ష్మారెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎల్బీనగర్ ప్రాంతానికి ఏం చేయలేదని BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి రోడ్ షో ప్రోగ్రాంలో అన్నారు. కానీ.. కొడంగల్ ప్రాంతానికి రూ.3,500 కోట్లు కేటాయించారని, తెలంగాణలో కొడంగల్ ఒక్కటే ఉందా..? అని ప్రశ్నించారు. చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత టెంపుల్ నుంచి భవానీనగర్, విద్యుత్ నగర్, హనుమాన్ నగర్, ఇంద్రనగర్‌లో రోడ్ షో నిర్వహించారు.

News May 7, 2024

HYD: తెలంగాణలో కొడంగల్ ఒక్కటే ఉందా?: లక్ష్మారెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎల్బీనగర్ ప్రాంతానికి ఏం చేయలేదని BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి రోడ్ షో ప్రోగ్రాంలో అన్నారు. కానీ.. కొడంగల్ ప్రాంతానికి రూ.3,500 కోట్లు కేటాయించారని, తెలంగాణలో కొడంగల్ ఒక్కటే ఉందా..? అని ప్రశ్నించారు. చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత టెంపుల్ నుంచి భవానీనగర్, విద్యుత్ నగర్, హనుమాన్ నగర్, ఇంద్రనగర్‌లో రోడ్ షో నిర్వహించారు.