India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఫార్మసీ, బీపీఈడీ పరీక్ష ఫలితాలు విడదలయ్యాయని యూనివర్శిటీ పరీక్షల నియంత్రణాధికారి డా. శ్రీరంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ 1,2,7,8వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు, బీపీఈడీ 1, 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలు వెబ్సైట్ www.satavahana.ac.inలో అందుబాటులో ఉన్నాయన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎల్బీనగర్ ప్రాంతానికి ఏం చేయలేదని BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి రోడ్ షో ప్రోగ్రాంలో అన్నారు. కానీ.. కొడంగల్ ప్రాంతానికి రూ.3,500 కోట్లు కేటాయించారని, తెలంగాణలో కొడంగల్ ఒక్కటే ఉందా..? అని ప్రశ్నించారు. చైతన్యపురి, దిల్సుఖ్నగర్ సంతోషిమాత టెంపుల్ నుంచి భవానీనగర్, విద్యుత్ నగర్, హనుమాన్ నగర్, ఇంద్రనగర్లో రోడ్ షో నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎల్బీనగర్ ప్రాంతానికి ఏం చేయలేదని BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి రోడ్ షో ప్రోగ్రాంలో అన్నారు. కానీ.. కొడంగల్ ప్రాంతానికి రూ.3,500 కోట్లు కేటాయించారని, తెలంగాణలో కొడంగల్ ఒక్కటే ఉందా..? అని ప్రశ్నించారు. చైతన్యపురి, దిల్సుఖ్నగర్ సంతోషిమాత టెంపుల్ నుంచి భవానీనగర్, విద్యుత్ నగర్, హనుమాన్ నగర్, ఇంద్రనగర్లో రోడ్ షో నిర్వహించారు.
కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలు, అవినీతిపై విచారణ చేయనున్న జ్యుడీషియల్ కమిషన్ ఛైర్మన్గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డకు రానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన మేడిగడ్డ వద్దకు చేరుకోనున్నారు. భోజన విరామం అనంతరం గంటన్నర పాటు జస్టిస్ ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.
ఎంపీ ఎన్నికల్లో మహిళలు కీలకం కానున్నారు. నిజామాబాద్ జిల్లాలో మహిళల ఓట్లు రాబట్టేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ (U)లో మెుత్తం 3,04,317 మంది ఓటర్లుండగా అందులో మహిళలు 1,57,519 మంది ఓటర్లున్నారు. నిజామాబాద్ (R)లో 1,36,618, బాల్కొండలో 1,22,068, బోధన్లో 1,16,719, ఆర్మూర్ 1,13,401, బాన్సువాడలో 1,03,051 మంది మహిళా ఓటర్లున్నారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల శిక్షతోపాటు జరిమానా విధిస్తూ సోమవారం RR జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు APP తెలిపిన వివరాలు.. HYD మీర్పేట్ PS పరిధిలో గతంలో ఓ బాలికను కొందరు అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం ప్రధాన నిందితుడు చనిపోగా సహకరించిన కృష్ణకు కోర్టు శిక్ష విధించింది.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల శిక్షతోపాటు జరిమానా విధిస్తూ సోమవారం RR జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు APP తెలిపిన వివరాలు.. HYD మీర్పేట్ PS పరిధిలో గతంలో ఓ బాలికను కొందరు అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం ప్రధాన నిందితుడు చనిపోగా సహకరించిన కృష్ణకు కోర్టు శిక్ష విధించింది.
బోథ్ మండలంలోని దనోరా గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలను కలుస్తూ గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాసేపు చిన్నారులతో క్యారం ఆడి ఎమ్మెల్యే సందడి చేశారు. ఎంపీగా ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
భువనగిరి లోక్ సభ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. గత ఎన్నికల్లో పది మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉండగా.. ఈసారి ఏకంగా 34 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తుండడం విశేషం. ఎవరికి నష్టం చేస్తారోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి భువనగిరి లోకసభ పరిధిలో 39 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మణుగూరు పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. PV కాలనీకి చెందిన విజయలక్ష్మి (42) భార్యభర్తల మధ్య గొడవల నేపథ్యంలో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతిరాలి భర్త సింగరేణి ఉద్యోగి, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.