Telangana

News May 7, 2024

HYD: మరింత మెరుగ్గా పోల్ క్యూ రూట్ యాప్

image

పోల్ క్యూ రూట్ యాప్‌ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్‌ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు. పోలింగ్ కేంద్రానికి దారి తెలుసుకోవడంతోపాటు అక్కడ ఓటర్లు ఎంతమంది బారులు తీరారనే వివరాలను పొందారు. దానికి తగ్గట్టుగా ఏ సమయంలో వెళ్తే త్వరగా ఓటు వేయొచ్చనే అంచనాతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

News May 7, 2024

HYD: మరింత మెరుగ్గా పోల్ క్యూ రూట్ యాప్

image

పోల్ క్యూ రూట్ యాప్‌ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్‌ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు. పోలింగ్ కేంద్రానికి దారి తెలుసుకోవడంతోపాటు అక్కడ ఓటర్లు ఎంతమంది బారులు తీరారనే వివరాలను పొందారు. దానికి తగ్గట్టుగా ఏ సమయంలో వెళ్తే త్వరగా ఓటు వేయొచ్చనే అంచనాతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

News May 7, 2024

ఖమ్మం: వడగండ్లు మిగిల్చిన కడగండ్లు

image

ఖమ్మం జిల్లాలో వడగండ్ల వాన రైతన్నలను ముంచేసింది. అకాల వర్షం కారణంగా ఉమ్మడి జిల్లాలోని మామిడి, నిమ్మ, బత్తాయి తోటలు వడగండ్ల దాటికి దెబ్బతిన్నాయి. ఐకేపీ కేంద్రాలు, రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

News May 7, 2024

నేడు మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్

image

కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలు, అవినీతిపై విచారణ చేయనున్న జ్యుడీషియల్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డకు రానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన మేడిగడ్డ వద్దకు చేరుకోనున్నారు. భోజన విరామం అనంతరం గంటన్నర పాటు జస్టిస్ ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.

News May 7, 2024

NLG: ‘వందే భారత్’ కింద పడి చనిపోయాడు..! 

image

వందే భారత్ రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. భువనగిరి-పగిడిపల్లి రైల్వే లైన్ మధ్యలో పట్టాలపై వందే భారత్ రైలు కింద పడి రాత్రి ఓ గుర్తుతెలియని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు సుమారు 35 ఏళ్లు ఉంటాడని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 8712568454, 8712658719 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 7, 2024

కేసముద్రం మార్కెట్‌కు 7 రోజుల సెలవు

image

కేసముద్రం మార్కెట్‌కు ఈ నెల 8 నుంచి 14 వరకు 7 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అమర లింగేశ్వర రావు తెలిపారు.
*8-05-2024 అమావాస్య
*9-05-2024 (వ్యాపారుల కోరిక మేరకు)
*10-05-2024 (వ్యాపారుల కోరిక మేరకు)
*11-05-2024 (వారాంతపు సెలవు)
*12-05-2024 (ఆదివారం)
*13-05-2024 ( ఎంపీ ఎన్నికల సందర్భంగా)
*14-05-2024 (వ్యాపారుల కోరిక మేరకు)

News May 7, 2024

HYD: రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి..!

image

రాజధాని పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఒక్కరే ముందుండి శ్రేణుల్లో జోష్ నింపుతూ సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు సర్వేలు చేయించారు. ఈనివేదికల ఆధారంగా సీఎం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. BRSను ఓడించి 3స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచేలా వ్యూహాలు రచించారు.

News May 7, 2024

HYD: రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి..!

image

రాజధాని పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఒక్కరే ముందుండి శ్రేణుల్లో జోష్ నింపుతూ సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు సర్వేలు చేయించారు. ఈనివేదికల ఆధారంగా సీఎం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. BRSను ఓడించి 3స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచేలా వ్యూహాలు రచించారు.

News May 7, 2024

జైపూర్ మండలంలో చిరుత పులి సంచారం

image

జైపూర్ మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని నర్సింగాపూర్, గంగిపల్లి, కుందారం, మద్దులపల్లి అటవీ పరిధిలో చిరుత పులి సంచారాన్ని గుర్తించినట్లు అటవీశాఖ బీట్ అధికారి సతీష్ తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తమ అవసరాల కోసం అడవిలోకి వెళ్లొద్దని ఆయన సూచించారు.

News May 7, 2024

గద్వాల: గర్భంలోనే శిశువు మృతి

image

గర్భంలో శిశువు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లా గట్టు మండలం బోయలగూడెం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన సుజాత (26) వీరేష్ దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సుజాత ప్రస్తుతం 9 నెలల గర్భిణి. సోమవారం పురిటి నొప్పులు రావడంతో గట్టు PHCకి వెళ్లారు. అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సాధారణ ప్రసవం చేశారు. అయితే గర్భంలో మగ శిశువు మృతి చెందాడు.