India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రేవంత్రెడ్డి ఆటో డ్రైవర్లను మోసం చేశారని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. HYD శంషాబాద్లో సోమవారం భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా గెలవగానే ఆటో డ్రైవర్లను ఆదుకుంటానని, ఆటో డ్రైవర్లకు బ్యాంకు రుణాలతో పాటు ఆవాస్ యోజన పథకం కింద సొంతింటి కల సాకారం చేస్తానని హామీ ఇచ్చారు.
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఆ పార్టీ ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు నల్గొండలోని లక్ష్మీ గార్డెన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించనున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన కోటగిరి మండలం ఎత్తొండలో చోటుచేసుకుంది. ఎస్సై వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగయ్య (50)భార్య లక్ష్మికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై దంపతుల మధ్య గొడవలు జరిగేవి. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న నాగయ్య ముక్కు, మర్మాంగాలపై దాడి చేసి హతమార్చింది.
ఆదిలాబాద్కి చెందిన ఓ ఉపాధ్యాయుడు తన భార్యకోసం ఆన్లైన్లో రూ.700 విలువైన చీరను బుక్ చేస్తే గుడ్డ పీలికలు వచ్చిన వైనం వెలుగుచూసింది.
ప్రముఖ కంపెనీ యాప్లో నచ్చిన చీరను ఆర్డర్ చేసి భార్యను ఆశ్చర్యపరుద్దామని అనుకున్నారు. డెలివరీబాయ్ వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్లగా.. విప్పి చూస్తే చిరిగిన పీలికలు కనిపించడంతో దంపతులు అవాక్కయ్యారు. డెలీవరీ ఏజెన్సీ దగ్గరకు వెళ్లి నిలదీస్తే తమకేం తెలియదంటూ చేతులెత్తేశారు.
జిల్లాలో రానున్న ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ రైతులను సమాయత్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచింది. సీజన్లో వరి 5.15 లక్షల ఎకరాలు, పత్తి 5.70 లక్షల ఎకరాల్లో వ్యవసాయ శాఖ అధికారులు సాగు అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాలో పత్తి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి ఊరిలో సన్న రకాలు 2.35లక్షల ఎకరాలు, దొడ్డు రకాలు 2.80 లక్షల్లో ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేశారు.
లోక్సభ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై దృష్టి కేంద్రీకరించాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరీంనగర్లో పర్యటించనున్నారు. బుధవారం ప్రధాని మోదీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున వేములవాడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. గురువారం BRS అధినేత కేసీఆర్ కరీంనగర్లో పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ తరఫున ప్రచారంలో పాల్గొంటారు.
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడి చేసి హతమార్చిన సంఘటన బిజినేపల్లి మండలంలో చోటుచేసుకుంది. SI నాగశేఖర్ రెడ్డి వివరాలు.. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ, నాగయ్య భార్య భర్తలు. వీరు వ్యవసాయ పనులు చేస్తూ జీవించేవారు. వీరిద్దరూ మద్యానికి బానిసయ్యారు. సోమవారం మధ్యాహ్నం కూలీ పనులకు వెళ్లి వచ్చి గొడవ పడ్డారు. భర్త నిద్రపోయాక నాగయ్య మెడపై భార్య గొడ్డలితో నరికింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
హిందూ ధర్మం, మోదీపై అద్దంకి దయాకర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ను సోమవారం బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్, మజ్లిస్ అధినేత, ఎంఐఎం హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీపై ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ పసిపిల్లలను సైతం వదిలిపెట్టకుండా ఓట్ల రాజకీయం ప్రచారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
హిందూ ధర్మం, మోదీపై అద్దంకి దయాకర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ను సోమవారం బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్, మజ్లిస్ అధినేత, ఎంఐఎం హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీపై ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ పసిపిల్లలను సైతం వదిలిపెట్టకుండా ఓట్ల రాజకీయం ప్రచారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. ఖమ్మం జిల్లాలోని కామంచికల్లు గ్రామానికి చెందిన సీపీఐ నాయకుడు గండ్ర లక్ష్మయ్య (75) వడదెబ్బతో మృతి చెందారు. పాల్వంచ రామవరం ఏరియాకు చెందిన ఈదులూరి కన్నయ్య (48) తాపీ మేస్త్రి పని చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. అలాగే పెద్ద గోపవరం గ్రామానికి చెందిన పశువుల కాపరి రాసమంటి వెంకటకృష్ణ (45) వడదెబ్బతో మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.