Telangana

News May 7, 2024

MNCL: ఉమ్మడి జిల్లాకు రెడ్ అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భానుడు హడలెత్తిస్తున్నాడు. ఈ సీజన్‌లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వాతావరణ శాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, హాజీపూర్, దండేపల్లి మండలాల్లో 46 డిగ్రీలు దాటగా లింగాపూర్, తపాలపూర్, భీమిని మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది.

News May 7, 2024

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

అధిక లాభాలు, ఆన్‌లైన్ ట్రేడింగ్ ముసుగులో కేటుగాళ్లు వేసే వలలో పడి మోసపోవద్దని సీపీ సునీల్‌దత్ ప్రజలకు సూచించారు. ఇటీవల ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట రూ.లక్షలు మోసపోయామంటూ పలువురు తమ వద్దకు వచ్చారని చెప్పారు. అపరిచిత లింకులు, వెబ్ సైట్లను, అప్లికేషన్లను, మెసేజ్‌లను నమ్మకూడదన్నారు. బాధితులు సైబర్ క్రైం హెల్ప్‌లైన్ 1930కు తక్షణమే కాల్ లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయాలన్నారు.

News May 7, 2024

వరంగల్ నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: కావ్య

image

వరంగల్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, వరంగల్ నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలో రాత్రి కడియం కావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పే పార్టీ కాదని, పనులు చేసి చూపించే పార్టీ అని కడియం కావ్య అన్నారు.

News May 7, 2024

వేములవాడకు రూ.500 కోట్లు ప్రకటించాలి: వినోద్ కుమార్

image

కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం రాత్రి వేములవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వారణాసికి వందల కోట్లు కేటాయించారని అన్నారు. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడకు మాత్రం ఎలాంటి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. వేములవాడ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

News May 7, 2024

NZB: NDAకు 250 కి మించి సీట్లు రావు: KCR

image

NDA కూట‌మికి 250కి మించి సీట్లు రావని BRS అధినేత KCR జోస్యం చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రు చౌర‌స్తాలో సోమవారం రాత్రి నిర్వ‌హించిన రోడ్ షోలో KCR పాల్గొని ప్ర‌సంగిస్తూ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ గవ‌ర్న‌మెంట్ రాదన్నారు. ప్రాంతీయ శ‌క్తులే ఏర్పాటు చేసే ప్రభుత్వం వస్తుందని, BRS 14 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్ర రాజ‌కీయాల్లో తెలంగాణ కీల‌కంగా మారుతుందన్నారు.

News May 7, 2024

HYD: రైల్వే స్టేషన్ బోర్డుపై ఎప్పుడైనా ఇది చూశారా?

image

ఆకుపచ్చ రంగు బాక్సులో ఉన్న MSL మార్కింగ్ రైల్వే స్టేషన్ బోర్డు పై ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. HYD చర్లపల్లి స్టేషన్ బోర్డు పై MSL+525.05M అని రాసి ఉంది. దీని అర్థం ఏంటంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి 525.05 మీటర్ల పైన ఉన్నట్లు అని రైల్వే సివిల్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. MSL అనగా మీన్-సి-లెవెల్(సగటు సముద్రమట్టం) అని పేర్కొన్నారు.

News May 7, 2024

HYD: రైల్వే స్టేషన్ బోర్డుపై ఎప్పుడైనా ఇది చూశారా?

image

ఆకుపచ్చ రంగు బాక్సులో ఉన్న MSL మార్కింగ్ రైల్వే స్టేషన్ బోర్డు పై ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. HYD చర్లపల్లి స్టేషన్ బోర్డు పై MSL+525.05M అని రాసి ఉంది. దీని అర్థం ఏంటంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి 525.05 మీటర్ల పైన ఉన్నట్లు అని రైల్వే సివిల్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. MSL అనగా మీన్-సి-లెవెల్(సగటు సముద్రమట్టం) అని పేర్కొన్నారు.

News May 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రత ఎంతంటే?

image

నేడు ఉమ్మడి KNR జిల్లాలో ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా రాయికల్ మం. అల్లీపూర్, వెల్గటూర్ మం. గుల్లకోటలో 46.8°C, బీర్పూర్ మం. కొల్వైలో 46.3°C, ఇబ్రహీంపట్నం మం. గోదురులో 46.1°C, ధర్మపురి మం. నేరెళ్లలో 45.8°C, ముత్తారంలో 46.4°C, సుల్తానాబాద్ మం. సుగ్లంపల్లిలో 46.3°C నమోదయ్యాయి. కమాన్‌పూర్‌లో 45.9°C, జమ్మికుంటలో 46.2°C, వీణవంకలో 45.8°C నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News May 7, 2024

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉంది: కడియం

image

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో నిర్వహించిన మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బీజేపీ ప్రమాదకర ధోరణిని అవలంబిస్తుందని, బీజేపీ దుర్మార్గాలను, ఆకృత్యాలను అడ్డుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కడియం అన్నారు.

News May 7, 2024

నిజామాబాద్ జిల్లా నా గుండెల్లో ఉంటుంది: KCR

image

తాను చచ్చేంత వరకు నిజామాబాద్ జిల్లా తన గుండెల్లో ఉంటుందని KCR అన్నారు. సోమవారం రాత్రి నగరంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. తాను గులాబీ జెండా ఎత్తినప్పటినుంచి తన వెంట నిజామాబాద్ జిల్లా ప్రజలు నడిచారన్నారు. మొదటిసారిగా బీఆర్ఎస్ తరఫున జిల్లా పరిషత్‌ను గెలిపించిన ఘనత కూడా జిల్లాకే దక్కుతుందన్నారు.