Telangana

News May 7, 2024

గద్వాల: ఎలక్షన్ డ్యూటీలో ఏ చిన్న తప్పు జరగొద్దూ: కలెక్టర్

image

ఉద్యోగులు ఎలక్షన్ డ్యూటీలో ఏ ఒక్క చిన్న తప్పు ఆస్కారం లేకుండా డ్యూటీ చేయాలని కలెక్టర్ బీఎన్ సంతోష్ కుమార్ అన్నారు. సోమవారం గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి చౌరస్తా ఏకశిలా పాఠశాలలో పీఓ, ఏపిఓ, ఓపిఓలకు పలుసూచనలు చేశారు. ఎలాంటి సందేహాలు ఉన్నా శిక్షణ తరగతిలోనే ట్రైనింగ్ మాస్టర్లచే సందేహాన్ని నివృత్తి చేసుకోవాలన్నారు. ఆర్డీవో, తహసీల్దార్లు పాల్గొన్నారు.

News May 7, 2024

సంగారెడ్డి: 7, 8 తేదీల్లో అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ

image

ఎన్నికల నిర్వహణ కోసం అదరపు పోలింగ్ సిబ్బందికి ఈనెల 7, 8 తేదీల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. శిక్షణలో పోలింగ్ సిబ్బంది సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పారు. శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.

News May 7, 2024

నేడు ఖమ్మం జిల్లాలో హీరో వెంకటేశ్ పర్యటన

image

సినీ హీరో వెంకటేశ్ నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. పర్యటన వివరాలను రఘురామి రెడ్డి వెల్లడించారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఖమ్మం మయూరి సెంటర్, పాత బస్టాండ్, జడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ రోడ్ వరకు రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ ఉంటుందని వెల్లడించారు.రాత్రి 8 గంటలకు కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు.

News May 7, 2024

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

WGL- KMM- NLG పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అనిశెట్టి దుప్పలపల్లిలోని గోదాంలో ఏర్పాట్లకై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన సోమవారం గోదామును పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు 4 హాల్స్ తయారు చేయాలని, ప్రతిహాలులో 25 టేబుల్స్ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.

News May 6, 2024

HYD: అరుదైన సర్జరీ.. బాలిక‌కు ప్రాణం పోశారు!

image

గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీని సక్సెస్​గా చేసి, పేషంట్​ ప్రాణాలు కాపాడారు. నాందేడ్​ (MR)కుచెందిన సంధ్య (11) అనే బాలిక బ్లడ్‌ప్రెషర్​, తలనొప్పి, మైకం, చెమట, వాంతులు తదితర ఆరోగ్య సమస్యలతో గాంధీలో అడ్మిట్​ అయింది. స్కానింగ్​ తదితర వైద్య పరీక్షలు నిర్వహించిన పీడియాట్రిక్​ సర్జరీ వైద్యులు బాలిక కిడ్నీలపైన రెండు కణితిలు ఉన్నట్లు గుర్తించారు. లాపరోస్కోపిక్‌తో తొలగించి ఆమె ప్రాణాలు కాపాడారు.

News May 6, 2024

HYD: అరుదైన సర్జరీ.. బాలిక‌కు ప్రాణం పోశారు!

image

గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీని సక్సెస్​గా చేసి, పేషంట్​ ప్రాణాలు కాపాడారు. నాందేడ్​ (MR)కు చెందిన సంధ్య (11) అనే బాలిక బ్లడ్‌ప్రెషర్​, తలనొప్పి, మైకం, చెమట, వాంతులు తదితర ఆరోగ్య సమస్యలతో గాంధీలో అడ్మిట్​ అయింది. స్కానింగ్​ తదితర వైద్య పరీక్షలు నిర్వహించిన పీడియాట్రిక్​ సర్జరీ వైద్యులు బాలిక కిడ్నీలపైన రెండు కణితిలు ఉన్నట్లు గుర్తించారు. లాపరోస్కోపిక్‌తో తొలగించి ఆమె ప్రాణాలు కాపాడారు.

News May 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!

image

✏NGKL:తెలకపల్లిలో వైద్యం వికటించి..వ్యక్తి మృతి
✏NRPT:అక్రమంగా తరలిస్తున్న 16,560 లీటర్ల మద్యం పట్టివేత
✏ఎర్రవల్లి:వాహనం ఢీకొని మహిళ మృతి
✏కల్వకుర్తి:MLA కసిరెడ్డి వాహనానికి ప్రమాదం.. ఒకరి మృతి
✏WNPT:BJPకి పలువురు రాజీనామా
✏ప్రారంభమైన డిగ్రీ అప్లికేషన్లు..PU పరిధిలో 29,740 సీట్లు
✏EVM పై సిబ్బందికి అవగాహన
✏అచ్చంపేట:మాజీ ఎమ్మెల్యే గువ్వలకు నిరసన సెగ
✏ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి:TPUS

News May 6, 2024

యువత రాజకీయాల్లోకి రావాలి: KCR

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నల్గొండ కలెక్టరేట్లో ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేయనున్నారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆయన పార్టీ బీ ఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నిక కచ్చితంగా గెలవబోతున్నామని, నీ వెంట పార్టీ యంత్రాంగం, నాయకత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. విద్యావంతులు, నిజాయితీ పరులు, యువత రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందన్నారు.

News May 6, 2024

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏడు కంపెనీల కేంద్రబలగాలు: SP

image

NLG:పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏడు కంపెనీల కేంద్ర బలగాలు, 2600 మంది జిల్లా సిబ్బందితో ఎన్నికల నిర్వహణ పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతి యుతంగా,నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

News May 6, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా..

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు.. దిగ్వాల్ 45.9, నాగపూర్ 45.5, సిద్దిపేట 45.4, రేగోడు, చిట్యాల 45.2, పోడ్చన్ పల్లి 45.1, రేబర్తి, లకుడారం 45.0, ఆరంజ్ అలర్ట్ దూల్మిట్ట 44.9, తుక్కాపూర్, కిష్టారెడ్డిపేట 44.8, రాఘవాపూర్, మెదక్, కొల్చారం 44.6, కల్హేర్, బెజ్జంకి 44.5, పాతూరు, దామరంచ, హుస్నాబాద్, ప్రగతి ధర్మారం 44.2 సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.