India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బోనాల పండుగకు 2 నెలల ముంగిట HYDలో విషాదం నెలకొంది. లష్కర్లోనే ఫేమస్ పోతరాజు చనిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న దినేశ్ ఆదివారం రాత్రి కన్నుమూసినట్లు తెలిసింది. సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఉండే ఈ పోతరాజు 15 ఏళ్ల నుంచి ఉజ్జయిని టెంపుల్ వద్ద గంభీరమైన ఆకారంతో భక్తులకు కనిపించేవారు. ఎన్నో ఏళ్లుగా వేషం వేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్లోనూ నటించారు. దినేశ్ మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు.
బోనాల పండుగకు 2 నెలల ముంగిట HYDలో విషాదం నెలకొంది. లష్కర్లోనే ఫేమస్ పోతరాజు చనిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న దినేశ్ ఆదివారం రాత్రి కన్నుమూసినట్లు తెలిసింది. సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఉండే ఈ పోతరాజు 15 ఏళ్ల నుంచి ఉజ్జయిని టెంపుల్ వద్ద గంభీరమైన ఆకారంతో భక్తులకు కనిపించేవారు. ఎన్నో ఏళ్లుగా వేషం వేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్లోనూ నటించారు. దినేశ్ మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు.
HNK జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురానికి చెందిన కుమారస్వామి, అతని కూతురు శ్రీవిద్య పురుగు మందు తాగి <<13193945>>ఆత్మహత్యాయత్నానికి<<>> పాల్పడ్డ విషయం తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. కూతురు చదువు విషయమై ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశంలో పురుగు మందు సేవించిన తండ్రి మృతి చెందాడు. కూతురి పరిస్థితి విషమం కావడంతో పరకాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. వేసవి ఎండ ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఎక్కువయ్యాయి. కిలో చికెన్ రూ.280కి విక్రయిస్తున్నారు. ఈ ప్రభావం నాటు కోడి మాంసంపైనా పడింది. గత వారం వరకు రూ.450 ఉన్న నాటు కోడి మాంసం ఈ వారం రూ.500లకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలో సాధారణ రోజుల్లో 40 టన్నులు, పెళ్లిళ్ల సీజన్లో 50 టన్నుల వరకు కోడిమాంసం వినియోగం ఉంటోంది. ఆదివారమైతే అది 120 టన్నులు అవుతోంది.
నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు పడిపోతున్నాయి. సోమవారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 123.1741 టీఎంసీలకు చేరింది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ కాగా.. అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉంది.
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవలిలోని 44వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ రహదారి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందిందని వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నేను పక్కా లోకల్ అభ్యర్థినని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూడలేకనే, నేను నాన్ లోకల్ అంటూ కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని సుధీర్ కుమార్ మండిపడ్డారు.
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నిరసన తగిలింది. అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎస్ఎల్బీసీ, నక్కలగండి నిర్వాసితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి తమ సమస్యలు పట్టించుకోలేదని గ్రామస్థులు నిలదీయడంతో ప్రచారం మధ్యలో ఆపేసి వెళ్లిపోయారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామశివారులోని మంజీరానది నీటికుంటలో పడి సోమవారం బాలుడు మృతిచెందారు. కోడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబం నీటికుంటలో స్నానం చేసేందుకు దిగారు. ఈ క్రమంలో దుర్గేష్ (16) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హన్మకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురంలో విషాదం చోటుచేసుకుంది. పురుగు మందు తాగి తండ్రి, కూతురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో తండ్రి కుమారస్వామి(43) మృతి చెందగా.. కూతురు శ్రీవిద్య(16) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, శ్రీవిద్యను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.