India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హనుమకొండ జిల్లాలోని నర్సక్కపల్లిలో 1956లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి జన్మించారు. తొలిసారిగా 1994లో శాయంపేట నుండి టీడీపీ ఎమ్మెల్యేగా సిరికొండ ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా, కేసిఆర్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా మధుసూదనాచారి ఉన్నారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యేగా సిరికొండ ఎన్నికై తెలంగాణ తొలి స్పీకర్గా నియమితులయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఉన్న సికింద్రాబాద్ – గుంటూరు రైలుమార్గంలో మొదటి దశ డబ్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. బీబీనగర్ నుంచి గుంటూరు జిల్లా నల్లపాడు జంక్షన్ వరకు 243 కిలోమీటర్ల మేర సింగిల్ రైల్వే లైన్ ఉండడంతో రైలు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతున్నాయి. ఈ మార్గంలో రెండో రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే రైలు రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తొగుట మండలం కన్గల్ గ్రామం చెందిన దొమ్మాట స్వామి(30) రైతు మూడెకరాల భూమి కౌలుకు తీసుకున్నారు. పంట పెట్టుబడితో పాటు సుమారు రూ.8 లక్షలు అప్పు అవ్వగా అప్పు తీర్చే మార్గం లేక పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారంతో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు పెరిగాయి. 341 రకం మిర్చికి నిన్న రూ.15,500 ధర రాగా.. నేడు రూ.16,000కి చేరింది. తేజ మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.18,500 పలికింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చి సైతం గత మూడు రోజులుగా రూ.16,000 ధర పలుకుతూ వస్తుందని వ్యాపారులు తెలిపారు.
జైనూర్లో ఇటీవల ఆదివాసీ మహిళపై అత్యాచారం జరగగా బాధితురాలు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. కాగా బాధితురాలిని ఆదిలాబాద్ బీఎస్పీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ జంగు బాబుతో కలిసి బీఎస్పీ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం హైదరాబాద్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం హైదరాబాద్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.
ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో రూ.లక్ష లోపు 1,69,838 మంది రైతులకి రూ.952.7 కోట్లు రుణాలు, రెండో విడతలో 1,04,113 మందికి రూ.1,025.01కోట్లు, మూడో విడతలో 64,597 మందికి రైతులకు రూ.803.76 కోట్ల రుణాలు మాఫీ చేసింది. వీరందరూ కొత్త రుణాలను అర్హులైనప్పటికీ 40% మంది కూడా రుణాలు తీసుకోలేదు. ఇంకా మాఫీ కానీ రైతులు 2,10,560 మంది ఉండగా.. వీరందరూ రెన్యువల్ చేసేందుకు దూరంగా ఉన్నారు.
తండ్రి మందలించాడని పదోతరగతి విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన మహ్మదాబాద్ మండలంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. దేశాయిపల్లికి చెందిన కృష్ణయ్య కూతురు శ్రీలత(14) ఈనెల 9న తన పుట్టిన రోజు ఉండడంతో తన తల్లి వద్ద రూ.200 తీసుకొని తోటి విద్యార్థులకు చాకెట్లు పంచింది. చాకెట్లు పంచడానికి డబ్బులు ఎక్కడివని శ్రీలతను తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
Sorry, no posts matched your criteria.