Telangana

News April 3, 2025

ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సంక్షేమంలో కరీంనగర్ జిల్లా పురోగతి: వెంకటయ్య

image

ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సంక్షేమంలో కరీంనగర్ జిల్లా పురోగతి సాధించిందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ R&B గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలపై అశ్రద్ధవహిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అమలు చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తే కఠినచర్యలు ఉంటాయన్నారు.

News April 3, 2025

KNR: LRS రిబేట్ సదుపాయం గడువు పొడిగింపు: కలెక్టర్

image

అనధికార లే ఔట్ల క్రమబద్ధీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్‌ 25 శాతం రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మార్చి 31 నాటికి ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు. జిల్లాలోని అర్హులైన వారందరూ ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 3, 2025

సన్న బియ్యం పంపిణీ చేసిన నల్గొండ కలెక్టర్

image

దిండి(గుండ్లపల్లి) మండలం కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఏఎస్పీ మౌనిక ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, కొత్త రేషన్ కార్డుల కోసం ఈ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News April 3, 2025

జడ్చర్లలో జోరుగా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు

image

జడ్చర్ల బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నేడు మార్కెట్ యార్డ్‌లో క్వింటాల్ కందులకు గరిష్ఠంగా 6,879, ఆముదాలు 6,353, వేరుశనగ 6,769, జొన్న 4,011, బొబ్బర్లు 5,656, మొక్కజొన్నలు 2,268, ఆర్ఎన్ఆర్ రకం వడ్లు 2,059, మినుములు 7,316 ధర పలికాయి. నేడు మొత్తంగా మార్కెట్ యార్డ్‌కు 132 మంది రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయానికి తీసుకొచ్చారు.

News April 3, 2025

HYD: సెక్రటేరియట్ ముందు ఇదీ పరిస్థితి 

image

భారీ వర్షం కారణంగా రహదారులపై వర్షపు నీరునిలిచిపోయింది. తెలంగాణ సచివాలయం వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అటు ఖైరతాబాద్ KCP జంక్షన్, సోమాజిగూడలో ప్రధాన రహదారులపై చెట్లు నేలకొరిగాయి. భారీగా ట్రాఫిక్ జామైంది. వాహననదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అత్యవసరం అయితేనే బయటకురండి. SHARE IT

News April 3, 2025

NZB: ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

image

వర్ని(M) జాకోరా, జలాల్పూర్ గ్రామాల్లో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి గురువారం పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని సేకరించారు. ట్రక్ షీట్స్ వచ్చాయా, బిల్ టాగ్ అయ్యిందా అని ఆరా తీశారు.

News April 3, 2025

ఆదిలాబాద్: డాక్టరేట్ అందుకున్న అధ్యాపకుడు విఠల్

image

ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్న జైనథ్ మండలంలోని బాలాపూర్ గ్రామానికి చెందిన పంద్రే విఠల్ డాక్టరేట్ పొందారు. ఈ 8డాక్టరేట్ ను రిప్రొడక్టివ్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీ” అనే అంశంపై పరిశోధినకు గాను ఉత్తరప్రదేశ్ గ్లోకల్ విశ్వ-విధ్యాలయం” ద్వారా అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ శివకృష్ణ, అధ్యాపక బృందం, బంధువులు అభినందించారు.

News April 3, 2025

మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు

image

మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కలెక్టరేట్‌ను పేల్చేస్తామని, కలెక్టర్‌ను చంపేస్తామంటూ ఓ అగంతకుడు మెయిల్ పెట్టారు. ఈ విషయంపై విచారణ జరపాలని కలెక్టర్ గౌతమ్ డీసీపీ పద్మజ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే అంశంపై విచారణ చేస్తున్నారు. కాగా.. కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు నేపథ్యంలో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశమయ్యారు.

News April 3, 2025

25,65,000 రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం: పొంగులేటి

image

ఖమ్మం: 25,65,000 మంది రైతన్నలకు 20 వేల 687 కోట్ల రూపాయలతో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు ₹500 బోనస్ చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. అటు గత వానాకాలం పంటకు దాదాపు 1700 కోట్ల రూపాయలు బోనస్ అందించామని తెలిపారు. సంవత్సరానికి సరిపడా సన్న రకం బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

News April 3, 2025

NGKL: పిడుగుపాటుకు చనిపోయింది వీళ్లే!

image

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో <<15978702>>పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే<<>>. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో వచ్చిన భారీ వర్షంలో పిడుగు పడటంతో మండలంలోని కండ్లకుంట ప్రాంతానికి చెందిన సుంకరి సైదమ్మ (35), వీరమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ గాయపడగా ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.