Telangana

News May 6, 2024

HYDకు అగ్రనేతలు..!

image

లోక్‌సభ ఎన్నికలకు మరో వారమే సమయం ఉండడంతో రాజధానికి అగ్రనేతలు తరలివస్తున్నారు. ఇప్పటికే అమిత్‌షా, రేవంత్ రెడ్డి ప్రచారం చేయగా ఈనెల 9న సరూర్‌నగర్‌లో రాహుల్ గాంధీ సభ ఉండనుంది. 10న ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే రానున్నారు. అదే రోజు LB స్టేడియంలో పీఎం మోదీ సభ ఉంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, అన్నామలై ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక ఈనెల 11న KCR భారీ బహిరంగ సభ ఉండనుందని BRS శ్రేణులు తెలిపాయి.

News May 6, 2024

ఖమ్మం: 8 రోజులపాటు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

image

ఈ నెల 7 నుంచి 14 వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు వర్ష సూచన, ఎండ తీవ్రత దృష్ట్యా హమాలీ కార్మికుల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని 8 రోజులపాటు బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి యథావిధిగా మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు.

News May 6, 2024

NRPT: చిరుత పులి మృతి

image

ఓ చిరుత పులి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నందిపాడు- చింతలకుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలం వద్ద చిరుత పులి కళేబరం కనిపించింది. గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత రెండు రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని, వైద్య పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు.

News May 6, 2024

NLG: డిగ్రీ ప్రవేశాలకు నేటి నుంచి దోస్త్

image

ఉమ్మడి జిల్లాలోని 75 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ విధానంలో నేటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మూడు దశల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇవి పూర్తయిన తర్వాత జూలై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. దరఖాస్తులు, వెబ్ ఆప్షన్స్, సీట్ల కేటాయింపు ఆన్లైన్లోనే ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో అన్ని డిగ్రీ కళాశాలలో కలిపి 26,040 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

News May 6, 2024

MBNR: పీయూ పరిధిలో డిగ్రీ కళాశాలల వివరాలు

image

పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల వివరాలు
✓ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు – 23
✓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలు – 57
✓ ఎస్సీ డిగ్రీ కళాశాలలు – 3
✓ ఎస్టీ డిగ్రీ కళాశాలలు – 3
✓ బీసీ డిగ్రీ కళాశాలలు – 4
✓ స్వయం ప్రతిపత్తి – 1
✓ మొత్తం డిగ్రీ కళాశాలలు – 91 ఉన్నాయి.
ఇందులో ప్రవేశాలకు నేటి నుంచి ఈనెల 25 వరకు మొదటి విడత “దోస్త్” రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం అయ్యాయి.

News May 6, 2024

వరంగల్: నీట్‌కు 5,087 మంది విద్యార్థులు హాజరు

image

వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా ముగిసినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంజుల దేవి ప్రకటనలో తెలిపారు. మొత్తం 5,205 మంది విద్యార్థులకు గాను 5,087 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

News May 6, 2024

ఆసిఫాబాద్: సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని గురుడుపేట్‌లో భీమ్‌రావు(30)అనే వ్యక్తి మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News May 6, 2024

HYD: రాష్ట్రంలో ఆ నాలుగు ఇక్కడే..!

image

TGలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నాలుగు నియోజకవర్గాలు రాజధాని పరిధిలోనే ఉండడం గమనార్హం. 37,80,453 మంది ఓటర్లతో మల్కాజిగిరి ఫస్ట్ ఉండగా 29,39,057మంది ఓటర్లతో చేవెళ్ల సెకెండ్ ప్లేస్‌లో ఉంది. ఇక 22,17,305మంది ఓటర్లతో HYD థర్డ్, 21,20,550 మంది ఓటర్లతో సికింద్రాబాద్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాయి. కాగా రాష్ట్రమంతా మహిళా ఓటర్లు ఎక్కువుంటే ఈ నాలుగింటిలో మాత్రం పురుషులు ఎక్కువున్నారు.

News May 6, 2024

HYD: రాష్ట్రంలో ఆ నాలుగు ఇక్కడే..!

image

TGలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నాలుగు నియోజకవర్గాలు రాజధాని పరిధిలోనే ఉండడం గమనార్హం. 37,80,453 మంది ఓటర్లతో మల్కాజిగిరి ఫస్ట్ ఉండగా 29,39,057మంది ఓటర్లతో చేవెళ్ల సెకెండ్ ప్లేస్‌లో ఉంది. ఇక 22,17,305మంది ఓటర్లతో HYD థర్డ్, 21,20,550 మంది ఓటర్లతో సికింద్రాబాద్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాయి. కాగా రాష్ట్రమంతా మహిళా ఓటర్లు ఎక్కువుంటే ఈ నాలుగింటిలో మాత్రం పురుషులు ఎక్కువున్నారు.

News May 6, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. పత్తి జండా పాట క్వింటా రూ.7,150, నాన్ ఎసీ మిర్చి ధర క్వింటా రూ.18,000, ఏసీ మిర్చి ధర రూ.20,200 జెండా పాట పలికినట్లు అధికారులు వెల్లడించారు. వారం రోజులుగా రూ.50 నుంచి 300 వరకు హెచ్చుతగ్గుల మధ్య ధర కొనసాగుతోంది. ఏసీ మిర్చికి స్వల్పంగా ధర పెరుగుతోంది.