Telangana

News May 6, 2024

బంగ్లా రాజకీయాలకు శాశ్వత సమాధి కట్టాలి: CM రేవంత్ రెడ్డి

image

నడిగడ్డలోని బంగ్లా రాజకీయాలు పొద్దున చెరొకవైపు ఉన్న వారు.. రాత్రయ్యాక ఒకచోటికి చేరుతారని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జనజాతర సభలో మాట్లాడుతూ.. “మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు BRS, BJP ఒకటయ్యాయి, అదే బంగ్లా రాజకీయం ఈ‌ప్రాంతంలో నడుస్తోంది. బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టాలని, కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిని భారీ మెజార్టీతో” గెలిపించాలన్నారు.

News May 6, 2024

HYD: రేపు బీసీల రాష్ట్ర స్థాయి సదస్సు: ఆర్.కృష్ణయ్య

image

ఈనెల 7వ తేదీన HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఎంపీ తెలిపారు. ఆయన బీసీ భవన్‌లో మాట్లాడారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ద్వారా చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, బీసీలకు రాజ్యాంగ హక్కుల కల్పన, కుల గణన డిమాండ్ల పరిష్కారం కోరుతూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News May 6, 2024

HYD: రేపు బీసీల రాష్ట్ర స్థాయి సదస్సు: ఆర్.కృష్ణయ్య

image

ఈనెల 7వ తేదీన HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆయన బీసీ భవన్‌లో మాట్లాడారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ద్వారా చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, బీసీలకు రాజ్యాంగ హక్కుల కల్పన, కుల గణన డిమాండ్ల పరిష్కారం కోరుతూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News May 6, 2024

HYD: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక

image

HYD కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు దిగినా.. పాదచారులకు ఇబ్బందులు కలిగించినా సెక్షన్ 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్ DCP వినీత్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  అయితే ఆదేశాలు బేఖాతరు చేస్తూ బ్రిడ్జిపై మాదాపూర్ SHO మల్లేశ్, మరో ముగ్గురు సీఐలు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. నిబంధనలు పెట్టిన పోలీసులే ఉల్లంఘించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

News May 6, 2024

HYD: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక

image

HYD కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు దిగినా.. పాదచారులకు ఇబ్బందులు కలిగించినా సెక్షన్ 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్ DCP వినీత్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదేశాలు బేఖాతరు చేస్తూ బ్రిడ్జిపై మాదాపూర్ SHO మల్లేశ్, మరో ముగ్గురు సీఐలు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. నిబంధనలు పెట్టిన పోలీసులే ఉల్లంఘించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

News May 6, 2024

ఆదిలాబాద్: గుర్తుతెలియని అస్థిపంజరం లభ్యం

image

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో గుర్తుతెలియని <<13186266>>అస్థిపంజరం <<>>లభ్యమైన విషయం తెలిసిందే. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నిపాని గ్రామానికి చెందిన భూమన్న వారం క్రితం హనుమాన్ మాలధరించి అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అస్థిపంజరం పక్కన పురుగు మందు డబ్బా ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. మృతదేహాన్ని కుక్కలు, అడవి పందులు పీక్కుతిన్నాయి. అస్థిపంజరం ముఖభాగం ఉండటంతో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

News May 6, 2024

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

image

HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో చెన్నై నుంచి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య గురువు కలైమామణి రోజా కణ్ణన్.. వారి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలతో అలరించారు. కామాక్షి స్వరజతి, శోభిల్లు, సప్తస్వర, ఆనంద నర్తన ప్రకాశం, నను పాలింప, మాయామా, ఎందరో మహానుభావులు, మంగళం తదితర అంశాలను.. రోజా కణ్ణన్, రేవత్, అనంత కృష్ణన్, సహన, సెల్వగణేశ్, విజయరాఘవన్ మొదలైన వారు ప్రదర్శించి అలరించారు.

News May 6, 2024

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

image

HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో చెన్నై నుంచి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య గురువు కలైమామణి రోజా కణ్ణన్.. వారి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలతో అలరించారు. కామాక్షి స్వరజతి, శోభిల్లు, సప్తస్వర, ఆనంద నర్తన ప్రకాశం, నను పాలింప, మాయామా, ఎందరో మహానుభావులు, మంగళం తదితర అంశాలను.. రోజా కణ్ణన్, రేవత్, అనంత కృష్ణన్, సహన, సెల్వగణేశ్, విజయరాఘవన్ మొదలైన వారు ప్రదర్శించి అలరించారు.

News May 6, 2024

ఇన్విటేషన్ పేరుతో ఓటింగ్‌కు ఆహ్వానం.. సోషల్ మీడియాలో వైరల్

image

పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 13న జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని వినూత్నంగా ప్రచారం చేపట్టారు. ఇన్విటేషన్ రూపంలో ముద్రించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇన్విటేషన్ పేరుతో ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ పేరుతో ముద్రించారు. ప్రస్తుతం ఆకర్షణగా మారి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

News May 6, 2024

HYD: కాంగ్రెస్‌‌, బీజేపీవి మాయమాటలు: పద్మారావుగౌడ్

image

కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాయమాటలు, దొంగ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సికింద్రాబాద్‌ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి పద్మారావు గౌడ్‌, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోని రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌లో వారు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ప్రజలు KCR వైపే ఉన్నారన్నారు.