India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర స్వల్పంగా తగ్గింది. మార్కెట్లో సోమ, మంగళవారాలలో క్వింటా పత్తి ధర రూ.7,700 పలకగా బుధవారం రూ.7,800 అయింది. ఈరోజు రూ.10 తగ్గి, రూ.7790కి చేరింది. వర్షాకాలం నేపథ్యంలో రైతులు నాణ్యమైన సరుకులు మార్కెట్ కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత ధరలు పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహ కల్పలో వరద ముంపు ప్రాంతాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. అన్ని శాఖల అధికారులు నివేదికను కోరారు. కేంద్ర బృందం అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉన్నారు.
మద్యం అమ్మకూడదని మునుగోడు నియోజకవర్గంలోని సింగారం గ్రామస్థులు తీర్మానించి ర్యాలీ తీశారు. స్వచ్ఛందంగా బెల్టు షాపులను మూసివేసిన వారిని సన్మానించారు. గ్రామంలో మద్యం అమ్మకాలను వందశాతం నిర్మూలించి అందరికీ ఆదర్శంగా ఉంటామని గ్రామస్థులు తెలిపారు. కాగా నియోజకవర్గాన్ని మద్య రహితంగా మార్చాలని MLA రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామానికి చెందిన స్రవంతి డిగ్రీ చదువుతోంది. కాగా, బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ధర్మపురి ఎస్ఐ మహేశ్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం మహబూబ్ నగర్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.
జూరాల జలాశయంలోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 11 గేట్లు, జలవిద్యుదుత్పత్తి ద్వారా 1.10 లక్షల క్యూసెక్కులు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయంలో నీటినిల్వ 8.531 TMCల మేర ఉంది. ఆలమట్టి జలాశయంలోకి 64 వేల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 40 వేలు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయంలోకి 40 వేలు చేరుతుండగా, దిగువకు 19 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన నిర్మల్లో చోటుచేసుకుంది. పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన శంభు(35)ను కుటుంబ కలహాల కారణంగా అతడి తమ్ముడు శివ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (నార్ముల్) ఎన్నికలు తారస్థాయికి చేరాయి. అన్ని కోణాలలో ఆర్థిక స్తోమత, బలం, బలగం ఉన్న ఉన్నత స్థాయి అభ్యర్థులు పోటీ పడుతుండడంతో చివరి నిమిషం వరకు ఎన్నికల ఉత్కంఠగానే కొనసాగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికలను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం మెదక్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.