Telangana

News May 5, 2024

Elections: హాట్‌ ఫేవరేట్‌గా సికింద్రాబాద్‌

image

MP ఎన్నికల్లో సికింద్రాబాద్ హాట్ ఫేవరేట్‌గా మారింది. కిషన్ రెడ్డి, పద్మారావు, దానం పోటీలో ఉండటం అంచనాలు పెంచింది. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడ జాతీయ పార్టీలదే హవా. ఒకే ఒక్కసారి తెలంగాణ ప్రజాసమితి(1971) గెలిచింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా BRS ఖాతా తెరవలేదు. ఈసారి పజ్జన్న‌ నిలబడటంతో‌ టగ్ ఆఫ్ వార్‌‌ అని టాక్. BJP, INC గెలుపుపై ధీమాతో ఉన్నారు. ప్రజానాడీ‌ ఎటువైపనేది ఉత్కంఠగా మారింది.

News May 5, 2024

సీనియర్ సిటిజెన్స్ ఆలోచించి ఓటు వేయాలి: డీకే అరుణ

image

సమస్యలు తెలిసి అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్స్ ఆలోచించి ఓటు వేయాలని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు అభివృద్ధి కోసం వయో వృద్ధులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నానని, ఎన్నికలలో బిజెపికి ఓటు వేసి తనను గెలిపించాలని డీకే అరుణ అభ్యర్థించారు.

News May 5, 2024

ADB: రాహూల్ గాంధీ మాట్లాడిన ముఖ్యాంశాలివే ..!

image

నిర్మల్‌లో నిర్వహించిన జనసభలో రాహుల్ గాంధీ మాట్లాడిన ముఖ్యాంశాలు. ★ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన చేసి తీరుతాం ★త్వరలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం
★ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చిన మోదీ ప్రభుత్వం ★రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకం ★కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం ★ఉపాధి హామీ కింద రోజుకు 400 కూలీ ఇస్తాం ★ప్రతి మహిళ అకౌంట్‌‌లో ఏడాదికి రూ.లక్ష వేస్తాం.

News May 5, 2024

NLG: రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు 

image

నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. చందంపేట మండలం తెల్దేవరపల్లిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వేములపల్లి మండలం బుగ్గబాయిగూడెం , మాడ్గులపల్లి, నాంపల్లి, తిప్పర్తి మండలంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. కట్టంగూర్, చందంపేట, పీఏపల్లి మండలం కోదాండాపురం, నిడమనూరు, హాలియా, ఇబ్రహీంపేట, కనగల్ తదితర మండలాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 5, 2024

ఖమ్మంలో హీరో వెంకటేశ్ పర్యటన రూట్ మ్యాప్

image

ఖమ్మంలో హీరో వెంకటేశ్ క్యాంపెయిన్ షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఎల్లుండి సాయంత్రం 5గంటలకు మయూరి సెంటర్, పాత బస్టాండ్, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు కొత్తగూడెంలో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు.

News May 5, 2024

MBNR, NGKL ఎంపీ బరిలో ఏడుగురు మహిళలు

image

లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడుగురు మహిళలు పోటీలో ఉన్నారు. MBNR నుంచి డీకే అరుణ, గోవిందమ్మ, విజయ, సరోజనమ్మ బరిలో నిలవగా.. NGKL నుంచి బర్రెలక్క(కర్నె శిరీష), గీత, భారతి పోటీలో ఉన్నారు. కాగా వీరిలో శిరీష(స్వతంత్ర) అత్యంత పిన్న వయస్సు(25) కాగా.. డీకే అరుణ(BJP) ఎక్కువ వయస్సు(64) ఉన్న అభ్యర్థులుగా ఉన్నారు.

News May 5, 2024

HYDలో రికార్డ్ బ్రేక్.. 90.68 మి.యూ విద్యుత్ వినియోగం

image

గ్రేటర్ HYDలో రికార్డ్ స్థాయి విద్యుత్ వినియోగం నమోదైనట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మే 4న 90.68 మిలియన్ యూనిట్లకు దాటినట్లు పేర్కొన్నారు. 2023లో ఇదే రోజు 59.98 మిలియన్ యూనిట్లు మాత్రమే నమోదయిందని, కానీ.. ఈ ఏడాది దాదాపు 51 శాతం అధికంగా విద్యుత్ వినియోగం నమోదయినట్లు వెల్లడించారు. ఈ వేసవిలో ఎంత డిమాండైనా తట్టుకునేనుందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందన్నారు.

News May 5, 2024

HYDలో రికార్డ్ బ్రేక్.. 90.68 మి.యూ విద్యుత్ వినియోగం

image

గ్రేటర్ HYDలో రికార్డ్ స్థాయి విద్యుత్ వినియోగం నమోదైనట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మే 4న 90.68 మిలియన్ యూనిట్లకు దాటినట్లు పేర్కొన్నారు. 2023లో ఇదే రోజు 59.98 మిలియన్ యూనిట్లు మాత్రమే నమోదయిందని, కానీ.. ఈ ఏడాది దాదాపు 51 శాతం అధికంగా విద్యుత్ వినియోగం నమోదయినట్లు వెల్లడించారు. ఈ వేసవిలో ఎంత డిమాండైనా తట్టుకునేనుందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందన్నారు.

News May 5, 2024

170 చలివేంద్రాలు ఏర్పాటు చేశాం: HMWSSB

image

వేసవి తాపంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు HYD జలమండలి సిద్ధమైంది. వివిధ అవసరాల కోసం బయటకి వచ్చే సామాన్య ప్రజలు, ప్రయాణికులు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు నగరంలో ప్రధాన ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైతు బజార్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లు తదితర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేస్తోంది. ఇందు కోసం GHMC పరిధిలో 170 చలివేంద్రాలు ఏర్పాటు చేశామని ఆదివారం తెలిపారు.

News May 5, 2024

170 చలివేంద్రాలు ఏర్పాటు చేశాం: HMWSSB

image

వేసవి తాపంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు HYD జలమండలి సిద్ధమైంది. వివిధ అవసరాల కోసం బయటకి వచ్చే సామాన్య ప్రజలు, ప్రయాణికులు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు నగరంలో ప్రధాన ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైతు బజార్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లు తదితర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేస్తోంది. ఇందు కోసం GHMC పరిధిలో 170 చలివేంద్రాలు ఏర్పాటు చేశామని ఆదివారం తెలిపారు.