India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తానాబాద్ మండలం రేగటి మద్దికుంటలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికలంటే ఓ పండగ! దాదాపు ఇరవై రోజుల పాటు నిత్యం నాయకుల మాటల పోరు ర్యాలీలూ, సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. కానీ,ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో కనిపిస్తున్న ఊర్లలో ఎన్నికల ఊపు కనిపించడం లేదు.
మామిడి చెట్టు పై నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన శంకరపట్నం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. కన్నాపూర్ గ్రామానికి చెందిన నాంపల్లి ఎల్లయ్య ఇంటి ఆవరణంలోని మామిడి చెట్లు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని భార్య కొమురమ్మ తెలిపారు.
ఎస్సీలకు రిజర్వ్ అయిన వరంగల్ లోక్సభ స్థానంలో మొత్తం 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధానంగా కాంగ్రెస్, BRS, BJPల మధ్యే గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, BJP నుంచి అరూరి రమేశ్, BRS నుంచి సుధీర్కుమార్లు తలపడుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం వేళల్లో కల్యాణ మండపాల్లో సమావేశాలు నిర్వహించి గెలిస్తే తామేం చేస్తామో వివరిస్తున్నారు.
2019 ఎన్నికల్లో నల్గొండ MP స్థానంలో ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు. 2018లో ఆ లోక్సభ పరిధిలోని SRPT, KDD, HNR, MLG, సాగర్, NLG, DVK అసెంబ్లీ స్థానాలు BRS విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో SRPT మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఈ క్రమంలో ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పాత ఒరవడికి కట్టుబడి భిన్నమైన తీర్పు ఇస్తారా అనే భావన వ్యక్తం అవుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నూతన టెక్నాలజీ అద్భుతాలు సృష్టిస్తోంది. HYD మహానగరంలోని చార్మినార్, సెక్రటేరియట్, రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి లాంటి పర్యాటక ప్రాంతాల AI ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. AI ద్వారా రూపొందించిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయంటూ నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. HYD నగర కట్టడాల ఫొటోలను నూతనంగా రూపొందించడంలో టెక్నో క్రాంట్లు వారి ప్రతిభను కనబరుస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నూతన టెక్నాలజీ అద్భుతాలు సృష్టిస్తోంది. HYD మహానగరంలోని చార్మినార్, సెక్రటేరియట్, రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి లాంటి పర్యాటక ప్రాంతాల AI ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. AI ద్వారా రూపొందించిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయంటూ నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. HYD నగర కట్టడాల ఫొటోలను నూతనంగా రూపొందించడంలో టెక్నో క్రాంట్లు వారి ప్రతిభను కనబరుస్తున్నారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మూడోరోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 11కు చేరింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ వేయగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.
సీఎం రేవంత్ రెడ్డికి ఆ నాలుగు ఎంపీ స్థానాలు ఎంతో కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో MBNR, NGKL ఎంపీ స్థానాలతో పాటు సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, స్నేహితుడు పోటీ చేస్తున్న భువనగిరి స్థానాలు కీలకంగా మారాయి. వారిని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో BRS నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చేందుకే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. బీజేపీతో పేదలకు ఒరిగిందేమీ లేదని, వారు అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మడం ఖాయమని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.