Telangana

News April 3, 2025

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు…

image

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 36.6°C నమోదు కాగా, జమ్మికుంట 36.5, మానకొండూర్ 36.4, రామడుగు 36.2, వీణవంక 36.0, ఇల్లందకుంట 35.8, గన్నేరువరం 35.7, కరీంనగర్ 35.6, హుజూరాబాద్ 35.2, శంకరపట్నం, చిగురుమామిడి 35.1, చొప్పదండి 34.8, తిమ్మాపూర్ 34.5, కరీంనగర్ రూరల్ 34.0, కొత్తపల్లి 33.4, సైదాపూర్ 33.3°C గా నమోదైంది.

News April 3, 2025

అత్తాపూర్‌లో 7 ఏళ్ల బాలుడి హత్య

image

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని దుండగులు మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్యకు గురైన బాలుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బాలుడి హత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.

News April 3, 2025

అత్తాపూర్‌లో 7 ఏళ్ల బాలుడి హత్య

image

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని దుండగులు మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్యకు గురైన బాలుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బాలుడి హత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.

News April 3, 2025

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు IAF నుంచి పత్రం

image

ఆదిలాబాద్ పట్టణంలో నూతన ఎయిర్‌పోర్ట్‌ మంజూరు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. AIRPORT నిర్మాణానికి ప్రభుత్వం పంపిన వినతి పత్రాన్ని అంగీకరిస్తున్నామని, త్వరలో ఎయిర్‌పోర్ట్‌ వద్ద రోడ్లు, బిల్డింగ్ తదితర భవనాలను నిర్మిస్తామని పత్రంలో పేర్కొంది. దీంతో ఎయిర్‌పోర్ట్‌ కోసం పోరాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీ గోడం నగేష్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 3, 2025

NLG: 7 నుంచి పదో తరగతి పరీక్షల మూల్యాంకనం

image

పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 2న సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. బుధవారం జరిగిన పరీక్షకు మొత్తం 18,666 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 18,628 మంది హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. 99.79 శాతం హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. పదో తరగతి పరీక్షలు ముగియడంతో ఈ నెల 7వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం జరగనున్నది.

News April 3, 2025

ఖమ్మం మార్కెట్‌కు భారీగా మిర్చి

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం మిర్చి పోటెత్తింది. నాలుగు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవడంతో 70వేలకు పైగా మిర్చి బస్తాలతో మార్కెట్‌ నిండిపోయింది. మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గడమే కాక.. కొద్దిరోజులుగా మరింత పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరవై రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2వేల మేర ధర తగ్గింది.

News April 3, 2025

నర్సాపూర్: కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేసిన అంగన్వాడీ సిబ్బంది

image

నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మండలంలోని కాగజ్ మద్దూర్ అంగన్వాడీ కేంద్రంలో కుళ్లినగుడ్లను పంపిణీ చేయడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. కుళ్లినగుడ్ల పంపిణీ పై ప్రశ్నిస్తే తమపై దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారిణిని వివరణ కోరగా విచారణ చేపడతామని తెలిపారు.

News April 3, 2025

నిజామాబాద్: జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. బుధవారం గోపనపల్లెలో 37.6℃ నమోదైంది. వైల్పూర్ 37.3, మోస్రా 37.2, పెర్కిట్ 37, కోటగిరి 36.8, వేంపల్లి 36.6, యర్గట్ల, యడపల్లి 36.5, లక్ష్మాపూర్ 36.3, మల్కాపూర్ 36.2, ముప్కాల్, నిజామాబాద్ 36.1, ఆలూరు, బాల్కొండ 36, మెండోరా, భీంగల్, ఇస్సాపల్లి 35.9, మగ్గిడి 35.7℃ నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి.

News April 3, 2025

NZB: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. SHARE IT.

News April 3, 2025

అడ్డాకుల: అవసరాలకు డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య

image

చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. అడ్డాకుల మం. పొన్నకల్‌కి చెందిన శివ(32) కూలీపనులు చేస్తూ జీవిస్తున్నారు. అవసరానికి తల్లితో అప్పుడప్పుడు డబ్బులు తీసుకునేవాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి తల్లితో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన శివ సోలార్ గేట్ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదైంది.