India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలోని మున్సిపాలిటీలు, నల్గొండ కార్పొరేషన్ పరిధిలో ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,66,437 మంది ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. మహిళలు 3,44,661 మంది, పురుషులు 3,23,647 మంది, ఇతరులు 129 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. జాబితా విడుదల కావడంతో వార్డుల వారీగా ఓటర్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది.

వన్యప్రాణుల వేట కోసం దుండగులు వేసిన ఉచ్చు ఒక పాడిఆవు ప్రాణాలను బలితీసుకుంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన కారె సాయికుమార్ అనే రైతు తన ఆవును మేత కోసం జాన్కంపేట్ శివారులోకి తీసుకెళ్లారు. అడవిపందుల కోసం పేలుడు మందును పశువులకు పెట్టే తవుడులో ముద్దలుగా చేసి ఉంచారు. మేత మేస్తున్న క్రమంలో ఆవు ఆ తవుడు ముద్దను తినగానే ఒక్కసారిగా నోట్లోనే పేలుడు సంభవించి ఆవు నోటిభాగం తీవ్రంగా ఛిద్రమై మృతి చెందింది.

నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు శనివారం మహిళా రిజర్వేషన్లను ప్రకటించనున్న నేపథ్యంలో పోటీ చేసే ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. ఏ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందోనని కార్పొరేటర్, కౌన్సిలర్ ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్, BJP, BRSపార్టీల నేతలు తమ వారిని నిలబెట్టించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

నిజామాబాద్ ITI కాలేజ్ గ్రౌండ్ వద్ద ఎండు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు నిన్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు 2వ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు. నిందితుడు షేక్ అఫ్రోజ్ అలియాస్ రోడ్డ అఫ్రోజ్ నుంచి 210 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. MH నుంచి గంజాయి తీసుకుని వచ్చి NZBలో అమ్ముతుంటాడని, ఇతడిపై వివిధ PS లలో గంజాయికి సంబంధించిన కేసులు 13కు పైగా ఉన్నాయన్నారు.

జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు శనివారం ఖరారు కానున్నాయి. కలెక్టరేట్లో కలెక్టర్ ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో ఖరారు చేస్తుండగా, మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ప్రకటించనున్నారు. రిజర్వేషన్ల లెక్క తేలనుండటంతో జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఖమ్మం జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతితో పాటు, 7-10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.

రేపు మేడారంలో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. సచివాలయాన్ని దాటి తొలిసారిగా కేబినెట్ సమావేశం జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సమావేశంలో మేడారం మాస్టర్ ప్లాన్పై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్ల అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ నేడు కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో ఆయన బ్రేక్ఫాస్ట్ సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ చేపట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది.

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఎన్నికల నగారా మోగకముందే పలు సర్వే సంస్థలు రంగప్రవేశం చేసి ఆశావాహులను చుట్టుముడుతున్నాయి. ‘ఓటర్ల నాడి మాకు తెలుసు’ అంటూ నమ్మబలుకుతున్నాయి. పార్టీ టికెట్ల వేటలో ఉన్న అభ్యర్థులకు ఈనివేదికలు ఆయుధాలుగా మారుతాయని ఆశ చూపుతున్నాయి. మరోవైపు జిల్లా యంత్రాంగం వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల కసరత్తును వేగవంతం చేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

HYDలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ బాలాపూర్లో శనివారం తెల్లవారుజామున 254కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారంలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది.
Sorry, no posts matched your criteria.