Telangana

News May 5, 2024

మంచిర్యాల: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

image

మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సతీశ్ ఈరోజు ఉదయం వ్యాయామంలో భాగంగా స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. తాండూరు మండలానికి చెందిన ఆయన రెబ్బెన పరిధిలో విధులు నిర్వహించినట్లు మండల వాసులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

News May 5, 2024

వడదెబ్బ మృతులకు ప్రభుత్వ సాయం

image

ఈ వేసవిలో నానాటికీ ఎండలు పెరుగుతున్నాయి. పలువురు వడదెబ్బ బారిన పడి చికిత్స పొందుతుండగా ఇంకొందరు మృత్యువాత పడుతున్నారు. అయితే, వడదెబ్బ మృతుల్లో పేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా పరిహారం అందుతుంది. ఇందుకోసం ప్రతీ మండలానికి త్రిసభ్య కమిటీని నియమించగా.. వీరు విచారణ జరిపి నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తారు. అక్కడ పరిశీలన అనంతరం రూ.50 వేలు పరిహారం మంజూరు చేస్తారు.

News May 5, 2024

భద్రాద్రి: ఒకే వీధి.. తండ్రిది AP.. కుమారుడిది తెలంగాణ

image

ఒకే వీధిలో ఉన్న ఆ తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. ఉమ్మడి APలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. విజభన తర్వాత ఆయన ఇల్లు మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చింది. మరోవైపు అదే వీధిలో రోడ్డుకు అటువైపున ఆయన కుమారుడు ఇల్లు కట్టుకుంటుండగా అది ఏపీలోని అరకు లోక్‌సభ స్థానంలో ఉండటం విశేషం.

News May 5, 2024

పటాన్‌చెరు: అనుమానాస్పదంగా శిశువు మృతి

image

45 రోజుల ఆడశిశువు మృతి చెందింది. పటాన్‌చెరు SI వెంకట్ వివరాలు.. మహరాష్ట్రకు చెందిన జ్ఞానేశ్వర్, స్వప్న దంపతులు ఉపాధి కోసం ఇస్నాపూర్‌ వచ్చారు. పనిమీద జ్ఞానేశ్వర్ సొంతూరు వెళ్లాడు. శనివారం రాత్రి పాలు తాగి పడుకున్న పాప తెల్లారేసరికే చలనం లేకుండా పడిఉంది. పాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

News May 5, 2024

KMM: ఎన్నికల ప్రచారానికి 6 రోజులే గడువు

image

ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచార పర్వానికి 6 రోజులే గడువుంది. 13న పోలింగ్ జరగనుండగా 2 రోజుల ముందుగా 11న సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీల అధినేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సభలు, కార్యక్రమాలకు ఇబ్బందిగా మారాయని అభ్యర్థులు చెబుతున్నారు. అనుకున్న స్థాయిలో ప్రచార షెడ్యూల్ పూర్తి చేయలేకపోతున్నారు.

News May 5, 2024

హోం ఓటింగ్‌కు 1,026 మందే దరఖాస్తు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో హోం ఓటింగ్(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు మొత్తం 1028 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ లోక్ సభ స్థానం పరిధిలో 539 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్దులు 296 మంది, దివ్యాంగులు 243 మంది ఉన్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో 487 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్ధులు 228, దివ్యాంగులు 259 మంది ఉన్నారు.

News May 5, 2024

NLG: మిగిలింది వారం రోజులే

image

లోక్ సభ ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతోంది. జనంలోకి వెళ్లేందుకు అభ్యర్థులకు వారం రోజులే మిగిలి ఉంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. పోలింగ్ కు 48 గంటల ముందే ప్రచారం ముగియనున్నందున ఈ లోపు ఎక్కడెక్కడ అయితే ముఖ్యమైన సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

News May 5, 2024

PU డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు ఈనెల 16 నుంచి నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం పరీక్షల టైం టేబుల్ విడుదల చేశారు. 2వ, 4వ సెమిస్టర్ పరీక్ష ఉదయం 9:30 నుంచి మ.12:30 గంటల వరకు, 5, 6వ సెమిస్టర్ విద్యార్థులకు మ.2 గంటల నుంచి సా. 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడాలన్నారు.

News May 5, 2024

KNR: వివాహిత ఆత్మహత్య

image

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మత్తారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పారుపల్లికి చెందిన జెల్ల రాజేశ్వరి(25) కడుపు నొప్పితో భాదపడుతుంది. ఆస్పత్రుల్లో చూపించుకొని, మందులు వాడినా నయం కాలేదు.  దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భర్త సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News May 5, 2024

హుజూర్‌నగర్: ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ ఫలితాల్లో తప్పడంతో విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన హుజూర్‌నగర్‌‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విద్యార్థి (17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఏప్రిల్ 29న ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి, మెరుగైన వైద్యం ఖమ్మం.. అక్కడి హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.