Telangana

News May 5, 2024

హుజూర్‌నగర్: ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ ఫలితాల్లో తప్పడంతో విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన హుజూర్‌నగర్‌‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విద్యార్థి (17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఏప్రిల్ 29న ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి, మెరుగైన వైద్యం ఖమ్మం.. అక్కడి హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.

News May 5, 2024

HYD: ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో అల్లు అర్జున్

image

HYD ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో సినీ హీరో అల్లు అర్జున్ శనివారం సందడి చేశారు. కారు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన తన డాక్యుమెంట్లను రవాణా శాఖ కార్యాలయంలో అందజేశారు. అల్లు అర్జున్ బీఎండబ్ల్యూ ఐ7 కారుకు నంబర్ కేటాయించినట్లు రవాణా శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు.

News May 5, 2024

ఇది ఆత్మగౌరవానికి జరిగే ఎన్నిక: వంశీచంద్ రెడ్డి

image

ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య పార్టీల మధ్య జరుగుతున్న పోటీ కాదు.. జిల్లా ఆత్మగౌరవానికి, రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో చూపించే ఎన్నిక అని మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. “ఇది పాలమూరు భవిష్యత్తు తరాల కోసం జరిగే ఎన్నిక, కేంద్రంలో BJP, రాష్ట్రంలో BRS పదేళ్లు అధికారంలో ఉండి మనల్ని బానిసలుగా చూశారని, పాలమూరు పౌరుషాన్ని చూపాలని, 13న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేయాలని” కోరారు.

News May 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔GDWL: నేడు ఎర్రవల్లిలో జన జాతర.. హాజరుకానున్న రాహుల్ గాంధీ,CM రేవంత్ రెడ్డి
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ
✔త్రాగునీటి సమస్యలపై ఫోకస్
✔ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక చెక్ పోస్టులు.. కొనసాగుతున్న తనిఖీలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✔నేడు పలువురు కాంగ్రెస్, BJPలో చేరికలు
✔MP ఎన్నికలు.. సోషల్ మీడియాపై అధికారుల దృష్టి
✔’సమ్మర్ క్రికెట్ శిబిరాల’పై నజర్

News May 5, 2024

నిర్మల్: రెడ్ జోన్‌లో 5 మండలాలు

image

నిర్మల్ జిల్లాలో 45.7 డిగ్రీల అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని ఐదు మండలాలైన నర్సాపూర్ జి, కడెం, కుబీర్, ఖానాపూర్, భైంసా మండలాలను వాతావరణ శాఖ అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించింది. వీటిలో 45.1 డిగ్రీ నుంచి 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించి బయటకు వెళ్లాలని సూచించారు.

News May 5, 2024

ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో అల్లు అర్జున్

image

ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో సినీ హీరో అల్లు అర్జున్ శనివారం సందడి చేశారు. కారు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన తన డాక్యుమెంట్లను రవాణా శాఖ కార్యాలయంలో అందజేశారు. అల్లు అర్జున్ బీఎండబ్ల్యూ ఐ7 కారుకు నంబర్ కేటాయించినట్లు రవాణా శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు.

News May 5, 2024

పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు: సీఎం

image

పాలమూరుకు నరేంద్రమోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తకోట సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి చెందిన డీకే అరుణ పాలమూరు పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్ష పదవిని తెచ్చుకున్నారని విమర్శించారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డీకే అరుణ ఎందుకు అడగలేదన్నారు

News May 5, 2024

నేడు నీట్ పరీక్ష.. 10 పరీక్షా కేంద్రాలు

image

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్- 2024 పరీక్ష ఆదివారం జరగనుంది. పూర్తిగా ఆఫ్‌లైన్‌లో జరగనున్న పరీక్షకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నీట్ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ భాస్కర్ తెలిపారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News May 5, 2024

MBNR: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్

image

రాష్ట్రానికి యూపీఏ, ఎన్డీఏ ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. 2004-14 మధ్య యూపీఏ, 2014-24 మధ్య ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు ఆహ్వానిస్తూ బహిరంగ లేఖ రాశారు. కొడంగల్లో లేదా అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు రావాలన్నారు. పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.9లక్షల కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు.

News May 5, 2024

కొత్తగూడెం: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

image

చింతూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పీవీ నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆకస్మికంగా ఛాతిలో నొప్పి ఉందంటూ ఒక్కసారిగా కుప్ప కూలడంతో తోటి సిబ్బంది వెంటనే రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు శనివారం చింతూరు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఏఎస్ఐ మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.