India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవం’గా ఉత్సవాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం కార్యక్రమాలు ఇతర సంస్కృతి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర I & PR మంత్రి శ్రీనివాస్ హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. HYD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, RR జిల్లాలో స్టేట్ చీఫ్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. HYD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, RR జిల్లాలో స్టేట్ చీఫ్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు-2024 కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం తదితర రంగాల్లో కృషి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18ఏళ్ల లోపు విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు http://awards.gov.in లో సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు పిట్లం ZPHS విద్యార్ధిని మహాలక్ష్మి ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ సంజీవులు తెలిపారు. పాల్వంచలో ఈ నెల 9 న జరిగిన జిల్లాస్థాయి ఖో ఖో టోర్నమెంట్లో మహాలక్ష్మి ప్రతిభ కనబరిచింది. ఖమ్మంలో జిల్లా కల్లూరు మిని స్టేడియంలో ఈనెల 13 నుంచి 15 వరకు జరిగే ఖో ఖో సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఆమె ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు అభినందించారు.
ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని బీసీ యువజన సంఘం జిల్లాధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మికు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్ర సాధనలో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనంపై HYD సిటీ కమిషనరేట్ సీపీ CV ఆనంద్ వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 17వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలలోపు నిమజ్జనం చేసేందుకు ఉత్సవ కమిటీ అంగీకరించినట్లు తెలిపారు. సమయానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, అనుకున్న సమయానికి నిమజ్జనం చేయాలన్నారు. ఇందుకు తగ్గట్లు పోలీసు బందోబస్తు ఉండాలని ఆయన సిబ్బందికి సూచించారు.
❤ఉమ్మడి జిల్లా ఖోఖో సబ్ జూనియర్స్ బాల,బాలికల జట్లు ఎంపిక
❤ఆత్మకూరు: పందికి పాలు పట్టించిన ఆవు❤దేవరకద్ర: పొదల్లో నవజాత శిశువు లభ్యం❤BSC డిప్లమాలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన పాలమూరు వాసి
❤MBNR:దొంగతనానికి వెళ్లి ఇద్దరు దుర్మరణం
❤కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:BJP
❤GDWL:Way2News ఎఫెక్ట్.. ప్రమాదకర విద్యుత్ వైర్లు తొలగింపు
❤కార్మికుల బకాయిలు చెల్లించండి:AITUC
గణేష్ నిమజ్జన శోభాయాత్ర కోసం ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. 9 అడుగుల వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం వల్లభారాపు చెరువు, 9 అడుగుల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాల కోసం 14వ మైలురాయి వద్ద నిమజ్జనం ఏర్పాట్లు చేసామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ HYDలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 2011 జనాభా లెక్కల ప్రకారం 83.04 లక్షల కుటుంబాలలో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి గడపకు తిరిగి వారి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.